పెద్దచెరువులో రూ.కోట్లు కొల్లగొడుతూ..
మహబూబ్నగర్ పెద్ద చెరువు ఒండ్రుమట్టితో దందా జోరుగా సాగుతోంది. రైతులకు ఉచితంగా మట్టి ఇస్తున్నామని చెబుతూ ఇట్టుక బట్టీలకు, కర్వేన ప్రాజెక్టుకు తరలిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఒండ్రుమట్టి తరలింపు
ఇటుక బట్టీలకు, ప్రాజెక్టులకు చేరుతున్న వైనం
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్
పెద్ద చెరువులో జోరుగా మట్టి తవ్వకాలు
మహబూబ్నగర్ పెద్ద చెరువు ఒండ్రుమట్టితో దందా జోరుగా సాగుతోంది. రైతులకు ఉచితంగా మట్టి ఇస్తున్నామని చెబుతూ ఇట్టుక బట్టీలకు, కర్వేన ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. కొన్ని రోజులుగా టిప్పర్లు, ఎక్సవేటర్లు పెట్టి యథేచ్ఛగా ఒండ్రును తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి రోజు మొత్తం 40 టిప్పర్లలో 9,600 క్యూబిక్ మీటర్ల నల్లమట్టి తరలుతోంది. బయట మార్కెట్లో క్యూబిక్ మీటర్ మట్టి ధర రూ.వెయ్యి పలుకుతోంది. ఈ లెక్కన నిత్యం రూ.లక్షల్లో గుత్తేదారులు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు మాత్రం రైతులకు ఉచితంగా ఒండ్రుమట్టి ఇస్తున్నట్లు చెబుతున్నా ఎక్కడా కూడా అందుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అధికారుల కళ్లెదుటే ఈ దందా సాగుతున్నా.. ఒక్కరు కూడా పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వీటిని పర్యవేక్షించాల్సిన జలవనరులశాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీనరేజీ ఛార్జీలు ఎక్కడ.. : సాధారణంగా చెరువుల నుంచి ఒండ్రుమట్టిని వ్యాపారులకు తరలించాలంటే జలవనరులశాఖ అనుమతి తప్పని సరిగా ఉండాలి. ప్రైవేటు వ్యాపారులకు ఈ మట్టిని తరలిస్తే సీనరేజీ ఛార్జీలు వసూలు చేయాలి. ఈ చెరువు నుంచి ఎక్కడికి నల్లమట్టిని తరలించాలి? ఏ వాహనంలో తరలిస్తున్నారు? దూరం ఎంత ఉంటుంది? చెరువులో ఎంత లోతు మేర ఒండ్రును తవ్వాలి? ఎన్ని క్యూబిక్ మీటర్ల లోతు వరకు తీయాలి? ఇవన్నీ మట్టిని అనుమతిచ్చే పత్రాల్లో ఉండాలి. ఇవేమీ లేకుండానే ప్రాజెక్టులు, ఇటుక బట్టీలకు నల్లమట్టి తరలుతోంది. చెరువును ఇష్టారాజ్యంగా తవ్వి మట్టిని తరలిస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పూర్తిగా పడిపోతాయి. ప్రస్తుతం పెద్ద చెరువు అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా తవ్వుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చెరువును కుదించి కట్ట నిర్మాణం చేపడుతున్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధి పనులకు ఈ ఒండ్రు ను ఉపయోగించుకోవచ్చు. కానీ కొందరు నేతల జోక్యం ఉంటుండటంతో వ్యాపారులకు ఈ మట్టిని విక్రయిస్తున్నా.. అధికారులు సైతం మౌనంగానే ఉంటున్నారు.
* పెద్ద చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి తీసిన ఒండ్రును రైతులకు ఉచితంగా ఇస్తున్నాం. ఇటుక బట్టీలకు పోతున్న విషయం తెలియదు. తీసిన ఒండ్రుమట్టిని పట్టణ శివారులోని డంపింగ్యార్డుకు తరలించి అక్కడ ఉంచాలని చెప్పాం. దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటాం.
చక్రధరం, ఎస్ఈ, జలవనరుల శాఖ, మహబూబ్నగర్
స్థానికుల ఆందోళన
పెద్ద చెరువు నుంచి తీసిన ఒండ్రు మట్టిని పిల్లలమర్రి సమీపంలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. చెరువు నుంచి మహబూబ్నగర్ ప్రధాన రహదారి మీదుగా మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రికి టిప్పర్లు వెళ్తుండడంతో స్థానికులు ఆందోళన చేస్తున్నారు. రెండు రోజులుగా పిల్లలమర్రి రోడ్డులో ఉంటే స్థానికులు టిప్పర్లను ఆపి తమ నిరసన వ్యక్తం చేశారు. టిప్పర్లలో ఒండ్రు మట్టిని తరలిస్తుంటే దుమ్ము మొత్తం వ్యాపిస్తోంది. రోడ్లపైన టిప్పర్ల వెనుక వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటలు టిప్పర్లు తిరుగుతుండటంతో రోడ్డు కూడా ధ్వంసమయ్యే పరిస్థితి వచ్చింది. కర్వెన ప్రాజెక్టుకు కూడా ఐదారు వాహనాల్లో మట్టి తరలుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు