ఎంచక్కని బడులు.. గురువులే కొరత
ధన్వాడలోని బాలుర ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరం 967 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పతి 1:40 ఉండాలి దీని ప్రకారం ఆలోచిస్తే 25 మంది
ప్రభుత్వ పాఠశాలల్లో వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత
కొండాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
న్యూస్టుడే, ధన్వాడ : ధన్వాడలోని బాలుర ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరం 967 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పతి 1:40 ఉండాలి దీని ప్రకారం ఆలోచిస్తే 25 మంది ఉపాధ్యాయులు అవసరం. జీహెచ్ఎంతో కలుపుకొని 16 మంది మాత్రమే ఉన్నారు. అయిదు పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
* మక్తల్ బాలుర ఉన్నత పాఠశాలలో గత ఏడాది 680 విద్యార్థులు ఉన్నారు. మొత్తం 20 మంది ఉపాధ్యాయ పోస్టులు ఉండగా 16 మంది మాత్రమే ఉన్నారు.
* జిల్లాలో పలు చోట్ల ఏకోపాధ్యాయ ఒక్కరే తెలుగు, ఆంగ్లం బోధించలేక సతమతమవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మన ఊరు-మన బడి కార్యక్రమంలో కార్పోరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు నేలపై కూర్చోకుండా బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రీన్ బోర్డులతో పాటు డిజిటల్ పాఠాల బోధనకు వసతులు సమకూరుతున్నాయి. ఉచితంగా పాఠ్య, రాత పుస్తకాలు, ఆకర్షణీయమైన ఏకరూప దుస్తులు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇవన్ని బాగానే ఉన్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను మాత్రం భర్తీ చేయడం లేదు. కనీసం వాలంటీర్ల నియామకాలపై దృష్టి పెట్టడంలేదు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం అంటే విద్యార్థుల సంఖ్య పెంచుకోవడం కాదని, ఉపాధ్యాయులు లేకుంటే ప్రయోజనం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం
ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించాం. ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న విషయాన్ని విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లి కొత్త పోస్టులు మంజూరు చేయాలని కోరాం. ఇవన్నీ విద్యాశాఖ పరిశీలనలో ఉన్నాయి.
విద్యాసాగర్, ఏఎంవో, నారాయణపేట
పేట జిల్లాలో పరిస్థితి..
మొత్తం పోస్టులు 2,490
ప్రస్తుతం ఉన్నది 2,070
ఖాళీల సంఖ్య 420
ప్రభుత్వ, స్థానిక సంస్థల బడుల్లో ఖాళీలు (ఈ ఏడాది గణాంకాలు వెల్లడి కాలేదు. గత ఏడాది విద్యాశాఖ లెక్కల ప్రకారం)
జీహెచ్ఎం గ్రేడ్ -2 పోస్టులు : 31
గణితం స్కూల్ అసిస్టెంట్ : 21
ఎస్ఏ ఫిజికల్ సైన్స్ : 10
ఎస్ఏ బయాలజీ : 31
ఎస్ఏ సాంఘిక శాస్త్రం : 35
ఎస్ఏ ఇంగ్లీష్ : 20
ఎస్జీటీ పోస్టులు : 119
తెలుగు మాధ్యమంలోఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం : 64
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..