అడుగంటుతున్న వరదాయని
ఉమ్మడి జిల్లా తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో వరదాయనిగా నిలిచిన రామన్పాడ్ జలాశయం అడుగంటి పోతోంది. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో జలాశయంలో నీటి మట్టం అడుగంటింది.
రామన్పాడ్ జలాశయంలో పడిపోయిన నీటి మట్టం
ఆత్మకూరు, న్యూస్టుడే : ఉమ్మడి జిల్లా తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో వరదాయనిగా నిలిచిన రామన్పాడ్ జలాశయం అడుగంటి పోతోంది. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో జలాశయంలో నీటి మట్టం అడుగంటింది. ఈ క్రమంలో జలాశయంపై ఆధారపడిన తాగునీటి పథకాలకు నీటి లభ్యత ఇబ్బందికరంగా మారింది. గతంలో మహబూబ్నగర్, వనపర్తి, జడ్చర్ల, అచ్చంపేట ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసిన పథకాలకు నీటి లభ్యత కొనసాగుతున్నా.. ఆత్మకూరు మండలంలోని 12 గ్రామాలకు తాగునీటినందించే పథకానికి ఎద్దడి ఏర్పడింది. మిషన్ భగీరథ పథకం పరిధిలో ఉన్న ఈ గ్రామాలకు రామన్పాడ్ జలాశయంలో గరిష్ఠ నిల్వ నీటి మట్టం ఉన్న రోజుల్లోనే పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా కాని పరిస్థితి కొనసాగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చడం మరింత జఠిలం కానుంది.
- రామన్పాడ్ జలాశయం గరిష్ఠ నిల్వ నీటి మట్టం 1021.09 ఫీట్లు. ప్రస్తుతం 1004.02 ఫీట్ల మేరకు నీరు ఉంది. 12 గ్రామాలకు తాగునీటినందించే ఇన్టెక్ వెల్కు పూర్తిస్థాయిలో నీరు సమకూరడం లేదు.
- పథకం చేపట్టిన రోజుల్లో జలాశయంలో నిల్వనీటి మట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా దూరంగా ఇన్టెక్ వెల్ నిర్మాణం చేపట్టడం వల్ల ఏటా వేసవిలో నిల్వ నీటిని ఇన్టెక్ వెల్ వరకు తరలించడం సమస్యగా మారుతోంది. అక్కడి వరకు నీరు చేరకపోవడంతో మిషన్ భగీరథ అధికారులు కాలువ తవ్వించారు. నీటి మట్టం పడిపోతున్న నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా కాలువను పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- మండలంలోని జూర్యాల, గుంటిపల్లి, మేడేపల్లి, మోట్లంపల్లి, దేవర్పల్లి, తిప్పడంపల్లి, ఆరేపల్లి, కత్తేపల్లి, తూంపల్లి, వీరరాఘవపూర్, రేచింతల, బాలకిష్టాపూర్ గ్రామాలకు రామన్పాడ్ జలాశయం నుంచి తాగునీటిని సరఫరా చేయడంలో సమస్యలు ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయంగా మిషన్ భగీరథ పథకం అమలుకు ముందు ఉన్న తాగునీటి వనరును పునరుద్ధరించాల్సిన అవసరం ఏర్పడింది. చేతి పంపుల నిర్వహణ పూర్తిగా విస్మరించిన క్రమంలో గ్రామాల్లోని తాగునీటి బోర్ల నిర్వాహణకు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
- రామన్పాడ్ దిగువన ఉన్న ఈ గ్రామాల శివారులో ఊకచెట్టివాగులోని తాగునీటి బోర్లను తిరిగి ఉపయోగంలోకి తీసుకురాకుంటే వేసవిలో తాగునీటి కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. ఆరేపల్లి, తూంపల్లి, కత్తేపల్లిలో సమస్యను పరిష్కరించడంలో గ్రామ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు ఒత్తిళ్లకు గురవుతున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైౖ దృష్టి
- రామకృష్ణ, ఏఈ, మిషన్ భగీరథ, ఆత్మకూరు
రామన్పాడ్ జలాశయంలోని ఇన్టెక్ వెల్కు నీరు సమకూరని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా పరిస్థితిని పరిశీలించి ఇన్టెక్ వెల్ వరకు ఎప్పటికప్పుడు కాలువ తీయాల్సిందిగా ఆదేశించారు. గ్రామాల్లోని పాత తాగునీటి సరఫరా పథకాల నిర్వహణకు చొరవ తీసుకోవాల్సిందిగా కోరనున్నాం. జూరాల నుంచి 12 గంటల పాటు రామన్పాడ్కు నీటిని విడుదల చేయడం వల్ల మరో 10 రోజుల పాటు 12 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయడంలో సమస్యలు ఏర్పడబోవని భావిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు హక్కుపై మహిళలకు అవగాహన
[ 27-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం ఓటు హక్కుపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. -
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
తాజా వార్తలు (Latest News)
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్