మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో వైద్యశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీహర్ష
నారాయణపేట, న్యూస్టుడే : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో వైద్యశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సిబ్బంది విధుల నిర్వహణ, ఇళ్ల సందర్శన, ఆరోగ్యఉప కేంద్రాలు, పీహెచ్సీల పరిధిలో మందుల పంపిణీపై ఆరా తీశారు. జిల్లాలో స్ట్రెస్ మేనేజ్మెంటు శిబిరాలుు ఎన్ని నిర్వహించారు? నిర్వహించాల్సిన శిబిరాల గురించి అడిగి తెలుసుకున్నారు. మక్తల్లో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహణకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని ప్రశ్నించగా రెండు వచ్చినట్లు అధికారులు తెలుపగా.. పరిశీలించి అనుమతులు ఇవ్వాలని సూచించారు. డీఎంహెచ్వో డా.సౌభాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
జిల్లాలో తాగునీటి సమస్య ఉండదు : జిల్లాలో తాగునీటి సమస్య ఉండదని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. భగీరథ ద్వారా జిల్లాలో 172 గ్రామాలకు కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి చందాపూర్ కుసుమద్పల్లి నీటి శుద్ధికేంద్రం ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోందని వివరించారు. జూరాల వెనుక జలాల నుంచి జిల్లాలోని 59 గ్రామాలకు పారేవుల, నందిమల్ల పథకాల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మన్యంకొండ నీటిశుద్ధి కేంద్రం ద్వారా 180 గ్రామాలకు సరఫరా నిత్యం జరుగుతుందని చెప్పారు. మొత్తం 280 పంచాయతీల్లో 1,312 బోర్లు ఉన్నాయని, వాటిలో 308 బోర్లకు మరమ్మతులు చేయాల్సి ఉందని, 282 బోర్ల మరమ్మతులు పూర్తయినట్లు తెలిపారు. పేటలోని 24 వార్డుల జనాభా అవసరాలకు ప్రతినిత్యం 7.30 ఎం.ఎల్.డీల తాగునీటి అవసరం ఉండగా భగీరథ ద్వారా మన్యంకొండ నీటిశుద్ధి కేంద్రం నుంచి రోజూ 7.30 ఎం.ఎల్.డీల నీటి సరఫరా అవుతుందని చెప్పారు. మక్తల్, కోస్గి తదితర పురపాలికలకు నీటి సరఫరా చేస్తున్నామని వివరించారు.
నారాయణపేట, న్యూస్టుడే : మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
నారాయణపేట పట్టణం, న్యూస్టుడే : ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ(గ్రౌండ్) ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మరమ్మతుల గురించి జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ను అడిగి తెలుసుకున్నారు. పేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటుచేసిన 13 పడకల వార్డును కలెక్టర్ పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!