స్వచ్ఛంద గురువులు!
‘గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలి. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని ఉన్నతంగా రాణించేలా చూడాలి. ఇందుకు అనుగుణంగా చదువుకునేందుకు అవసరమైన సాయం
అక్షరదాన్ వేదికగా గ్రామీణ విద్యార్థులకు బోధన
12 సంస్థలకు చెందిన వంద మంది వాలంటీర్లతో సేవలు
ఈనాడు, సంగారెడ్డి
ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ఆచార్య బీఎస్మూర్తితో విద్యార్థుల ఆన్లైన్ ముఖాముఖి
‘గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలి. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని ఉన్నతంగా రాణించేలా చూడాలి. ఇందుకు అనుగుణంగా చదువుకునేందుకు అవసరమైన సాయం అందించాలి’.. ఈ లక్ష్యంతో సంగారెడ్డి జిల్లాలో అక్షరదాన్ అనే స్వచ్ఛంద సంస్థ ముందడుగు వేస్తోంది. మూడేళ్ల క్రితం అక్షర సహాయంతో మొదలుపెట్టి అక్షరమాలనూ అందిస్తుండటం విశేషం. హైదరాబాద్కు చెందిన విశ్రాంత శాస్త్రవేత్త ఎం.శ్రీరామచంద్రమూర్తి నేతృత్వంలో ఇవి కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ప్రతిభాపాటవాలను పెంచేలా వీరు ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు పైలట్ ప్రాజెక్టుగా జిల్లాను ఎంచుకున్నారు.
అక్షరదాన్కు ఐఐటీ హైదరాబాద్తో పాటు ఎన్ఐటీ వరంగల్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, బిట్స్పిలానీ (హైదరాబాద్), సీబీఐటీ, బీవీఆర్ఐటీ.. ఇలా 12 విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ప్రధానంగా గణితం, సైన్స్ పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. అక్షరదాన్ కోరడంతో ఇప్పటి వరకు 250 మందికి పైగా వాలంటీర్లు ముందుకొచ్చారు. ప్రస్తుతం వంద మంది సేవలను వినియోగించుకుంటున్నారు.
నలుగురి చొప్పున..
ఒక్కో వాలంటీరుకు సగటున నలుగురి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ మేరకు చిన్నారులతో మాట్లాడి వారికి ఏ ఏ పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉందో తెలుసుకుంటారు. అందుకు తగ్గట్లు పాఠ్యప్రణాళిక రూపొందించుకుంటారు. వారాంతాలు, సెలవు దినాల్లో ఆన్లైన్ బోధన సాగిస్తారు. కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా.. భవితకు దోహదపడే కోర్సులపై అవగాహన కల్పిస్తారు. బాగా చదువుకుంటే ఎలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చో వివరిస్తున్నారు. నచ్చిన అంశంలో ఎలా ముందుకు సాగాలో వివరించి ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది.
1,500 వీడియోలు..
అక్షరదాన్ వెబ్సైట్లో 1,500 వీడియోలు అందుబాటులో ఉంచారు. ఇందులో విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశాలు, మహనీయుల జీవిత చరిత్రలు ఉన్నాయి. విద్యార్థులు తమకు అనుకూల సమయంలో లాగిన్ఐడీతో వెబ్సైట్లోకి వెళ్లి వాటిని చూడొచ్ఛు విద్యార్థులకు అవసరమైన వీడియోలను ఒక క్రమపద్ధతిలో ఇందులో ఉంచారు. ప్రస్తుతం 100 మంది వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. ఏడాదిలో ఈ సంఖ్య వెయ్యికి పెంచాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
5వేల మందికి చేరేలా..: ఎం.శ్రీరామచంద్రమూర్తి, విశ్రాంత శాస్త్రవేత్త
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో అక్షరదాన్ను ప్రారంభించాం. 2019 నుంచి సంగారెడ్డి జిల్లాలో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అక్షరసహాయలో భాగంగా దాతల సహకారంతో రూ.5 లక్షల మేర ఇక్కడ వెచ్చించగలిగాం. ప్రస్తుతం జిల్లాలోని 550 మంది ఆన్లైన్లో పాఠాలు వింటున్నారు. ఈ సంఖ్యను 5 వేలకు చేర్చాలని సంకల్పించుకున్నాం. పాఠాలకే పరిమితం కాకుండా ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నాం. విశ్రాంత ఐఏఎస్లు, ఐపీఎస్లు, వైద్యులు, న్యాయవాదులు, సైనికాధికారులతో కూడిన 25 మంది బృందాన్ని ఏర్పాటు చేశాం. పిల్లల్లో పఠనాసక్తిని పెంచేలా ఎంపిక చేసిన బడుల్లో పుస్తకాలు అందిస్తున్నాం.
పదో తరగతి పిల్లలకు..: విజయ్కుమార్, జిల్లా సైన్స్ అధికారి
అక్షరదాన్ తొలుత మన జిల్లాను ఎంపిక చేసుకోవడం చాలా సంతోషం. మూడేళ్లుగా వారు చేపడుతున్న కార్యక్రమాలతో విద్యార్థులకు ఆ మేరకు ప్రయోజనం దక్కుతోంది. పిల్లలకు అవసరమైన పుస్తకాలు, ఇతర విద్యా సామాగ్రిని అందిస్తున్నారు. రెండేళ్లుగా ఆన్లైన్ ద్వారా వాలంటీర్లతో ప్రత్యేకంగా పాఠాలు చెప్పించడం, ప్రముఖులతో మాట్లాడించడం ద్వారా పిల్లలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇటీవల ఐఐటీ డైరెక్టర్ మూర్తి అరగంట పాటు వారికి దిశానిర్దేశం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల గురించి వారికి అర్థమయ్యేలా వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలదళం.. గెలుపు వ్యూహం
[ 30-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు భాజపా ప్రత్యేక వ్యూహం రూపొందించి అమలు చేస్తోంది. -
బరిలో 44 మంది 15 మంది
[ 30-04-2024]
మెదక్ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. కీలకమైన సంగ్రామంలో 44 మంది అభ్యర్థులు తలపడనున్నారు. -
బడుల బాగుకు నిధులు
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. జిల్లాలో చాలా పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మెతుకుసీమలో త్రిముఖ పోరు
[ 30-04-2024]
మెతుకుసీమ పోరాటాల గడ్డ. దేశ ప్రధాని, ముఖ్యమంత్రిని అందించిన నేల ఇది. 19వ సారి లోక్సభ ఎన్నికలకు(ఉప ఎన్నికతో) సన్నద్ధమవుతోంది. -
స్వీప్ నడవడి.. చైతన్య ఒరవడి
[ 30-04-2024]
ప్రజాస్వామ్య పరిరక్షణలో ‘ఓటు’ పాత్ర అనిర్వచనీయం. పారదర్శకమైన పాలన సాకారం కావాలంటే.. ఒకవేళ ఎన్నికైన తరువాత నిలదీసే హక్కు పొందాలంటే.. ఓటు సద్వినియోగంతోనే సాధ్యం. -
భాజపా మళ్లీ వస్తే ప్రజల జీవితాలు ఆగం
[ 30-04-2024]
భాజపా అధికారం చేపట్టిన పదేళ్లలో దేశంలో అసమానతలు పెరిగాయని ఆచార్య కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సోమవారం తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు ఆగమవుతాయన్నారు. -
వేసవి శిబిరాలు.. విజ్ఞాన వీచికలు
[ 30-04-2024]
వేసవి సెలవులంటే.. చుట్టాల ఇళ్లు, విహారయాత్రలకు వెళ్లడం పరిపాటే. కొందరు ప్లిలలు మాత్రం విజ్ఞానం, నైపుణ్య అంశాలను పెంచుకోవాలని పరితపిస్తుంటారు. -
గతంలో తండ్రి.. ఇప్పుడు తల్లి
[ 30-04-2024]
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకే తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్నాడు. -
అభ్యర్థులు వీరే..ఇక ప్రచార హోరే!
[ 30-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానానికి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. -
పరిశ్రమల్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
[ 30-04-2024]
జిల్లాలోని పరిశ్రమల్లో ప్రమాదాల వల్ల పలువురు కార్మికులు మరణిస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారని జడ్పీ ఉపాధ్యక్షుడు, మరికొందరు జడ్పీ అభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘మూడు నెలల్లో 5 గ్యారంటీల అమలు’
[ 30-04-2024]
కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ను భారీ అధిక్యంతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి