పేరు మారినా.. తీరు మారలే
ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్య సేవల బలోపేతానికి ప్రభుత్వం పలు సంస్కరణల అమలుకు ఉపక్రమించింది. గత ఏడాది నుంచి పీహెచ్సీ పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాలను దశల వారీగా పల్లె దవాఖానాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. వాటిలో వైద్యుడు, సిబ్బందిని భర్తీ చేసి మెరుగైన వైద్య సేవలు
వసతులు లేవు..వైద్యులు, సిబ్బంది కొరత
పల్లె దవాఖానాల తీరిది..
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్
చింతల్ఘాట్లో అద్దె భవనంలో..
ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్య సేవల బలోపేతానికి ప్రభుత్వం పలు సంస్కరణల అమలుకు ఉపక్రమించింది. గత ఏడాది నుంచి పీహెచ్సీ పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాలను దశల వారీగా పల్లె దవాఖానాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. వాటిలో వైద్యుడు, సిబ్బందిని భర్తీ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆయా కేంద్రాలు స్థానికులకు భరోసా కల్పించాలని, మిగిలిన ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేలా చేయాలని సంకల్పించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. వీటిలో పనిచేసేందుకు వైద్యులు ఆసక్తి చూపడంలేదు. చాలాచోట్ల అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో.. కనీస సౌకర్యాలు లేక ఆసుపత్రి సిబ్బందితోపాటు రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కథనం.
సేవలకు భరోసా దక్కితేనే..
జిల్లాలో సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట వైద్యారోగ్యశాఖ డివిజన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 246 ఆరోగ్య ఉప కేంద్రాలు పని చేస్తున్నాయి. ఈ ఆరోగ్య ఉప కేంద్రాల్లో చలిజ్వరం, దగ్గు, బీపీ, షుగుర్, మలేరియా, క్షయ, దీర్ఘకాలిక రోగులకు వైద్య సేవలందిస్తుంటారు. మందులను ఉచితంగా పంపిణీ చేస్తారు. అసాంక్రమిక వ్యాధుల నిర్ధారణ(ఎన్సీడీ), గర్భిణులకు నెలవారీ పరీక్షలు, బుధ, శని వారాల్లో చిన్న పిల్లలకు టీకాలు ఇస్తుంటారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆయా సబ్సెంటర్లు, పల్లె దవాఖానాల్లో వైద్యుడు, ఏఎన్ఎం కీలకంగా పని చేయాలి. ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలోని గ్రామాలు, పట్టణ వార్డుల పర్యవేక్షణ బాధ్యత వారిదే. సహాయకులుగా ఆశా కార్యకర్తలుంటారు.
చేరడానికి.. ఆసక్తి చూపడం లేదు
తొలి విడతలో భాగంగా 20 సబ్ సెంటర్లను పల్లె పల్లె దవాఖానాలుగా మార్చారు. అందులో 100 మంది వైద్యుల భర్తీకి జిల్లా వైద్యారోగ్యశాఖ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇప్పటి వరకు 11 మంది ఆయుష్ వైద్యులు మాత్రమే భర్తీ అయ్యారు. రెండో విడతలో 100 ఆసుపత్రులను పల్లె దవాఖానాలుగా మార్పు చేసి 100 మంది ఎంబీబీఎస్ వైద్యుల భర్తీకి మళ్లీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటి వరకు 13 మందిని భర్తీ చేశారు. వారిలో ముగ్గురు వివిధ కారణాలతో వెళ్లిపోయారు. ప్రస్తుతం పది మంది వైద్యులు మాత్రమే సేవలందిస్తున్నారు. మూడో విడతలో పల్లె దవాఖానాల్లో 104 ఆసుపత్రులను గుర్తించారు. వైద్యుల భర్తీకి ప్రకటన ఇవ్వగా.. 33 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఈనెల 27న కౌన్సిలింగ్ నిర్వహించగా.. 11 మంది మాత్రమే చేరారు. వీరిలో ఎంత మంది విధులను కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే. విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నా.. పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. చేరివారూ ఎంతకాలం పనిచేస్తారో స్పష్టత లేదు. దీనివల్ల ప్రభుత్వం ఆశయం నెరవేరడం లేదు. దూరాభారం, వసతులు లేమి, తక్కువ వేతనాలు తదితర కారణాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.
సమస్యలను అధిగమిస్తాం..
-గాయత్రీదేవి, జిల్లా ఇన్ఛార్జి వైద్యాధికారిణి
జిల్లాలోని ఆరోగ్య ఉప కేంద్రాలను దశల వారీగా పల్లె దవాఖానాలుగా మార్పు చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా జిల్లాలో మార్పులు చేస్తున్నాం. వాటిలో పలు రకాల సమస్యలున్నాయి.. వాటిని అధిగమిస్తాం. ప్రతి ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రత్యేక వైద్యుడిని భర్తీ చేయాలని ప్రభుత్వం సూచనల మేరకు నడుచుకుంటున్నాం. వారిలో కొందరు ఆసక్తి చూపడం లేదు. కొత్తగా భవనాలు కావాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. మంజూరు చేస్తే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
ప్రతిపాదనలకే పరిమితం
జిల్లాలో ఆరోగ్య ఉప కేంద్రాలకు భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని జిల్లా వైద్యారోగ్యశాఖ గుర్తించింది. ప్రభుత్వానికి కొత్త భవనాలు 61 నిర్మించాలని నివేదిక అందించారు. ఇప్పటి వరకు ఒక్కటీ మంజూరు ఊసలేదు. ప్రతి ఆరు నెలలకోసారి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని సంబంధితశాఖ అధికారులు వివరించారు.
బడ్జెట్ లేక ఇబ్బందులు
పల్లె దవాఖానాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. దీని వల్ల ఆయా ఆసుపత్రుల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పీహెచ్సీ నుంచి కావాల్సిన మందులు, సామగ్రిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇంజిక్షన్లు నిల్వ చేయడానికి ప్రత్యేక రిఫ్రిజిరేటర్లు లేకపోవడం వల్ల.. వారంతా పీహెచ్సీ నుంచి ఓ డబ్బాలో వాటిని తీసుకెళ్లాల్సి వస్తోంది. మంచినీరు, శౌచాలయాలు, ప్రత్యేక గదులు లేకపోవడంతో వైద్య సిబ్బందితో పాటు.. రోగులు అవస్థలు పడాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఇచ్చిన సంస్థలను భాజపా అమ్మేస్తోంది: సీఎం రేవంత్రెడ్డి
[ 26-04-2024]
సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా