బోధనలో నైపుణ్యం.. ప్రతిభకు పురస్కారం
భాషపై పట్టు సాధిస్తే ఎందులోనైనా రాణించగలరు.. ఇది నిపుణులు చెప్పే మాట. ఆంగ్లంపై ఆసక్తితో అటువైపు అడుగేసి దాన్ని బోధించే ఉపాధ్యాయులుగా మారారు. ఆసక్తితో పిల్లలకు వినూత్నంగా పాఠాలు చెబుతూ..
న్యూస్టుడే, హుస్నాబాద్ గ్రామీణం
సిక్కింలో జరిగిన శిక్షణలో ప్రశంసాపత్రం అందుకుంటున్న రాజమల్లు
భాషపై పట్టు సాధిస్తే ఎందులోనైనా రాణించగలరు.. ఇది నిపుణులు చెప్పే మాట. ఆంగ్లంపై ఆసక్తితో అటువైపు అడుగేసి దాన్ని బోధించే ఉపాధ్యాయులుగా మారారు. ఆసక్తితో పిల్లలకు వినూత్నంగా పాఠాలు చెబుతూ.. మరోవైపు రిసోర్సుపర్సర్లుగా తమ తోటివారికి బోధనా నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తున్నారు. తమ ప్రతిభతో ఉన్నతాధికారుల ప్రశంసలతో పాటు పురస్కారాలు అందుకుంటున్నారు. ఇటీవల సిక్కింలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను ఆకట్టుకొని ప్రశంసలు, అవార్డులు గెలుచుకోవడం విశేషం.
రిసోర్సుపర్సన్గా..
అక్కన్నపేట మండలం కట్కూర్కు చెందిన పంజ రాజమల్లు ఆంగ్ల బోధనలో దిట్ట. ప్రస్తుతం హుస్నాబాద్లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. ఈయన విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే కొనసాగింది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఈడీతో పాటు పీజీ పూర్తి చేశారు. 1998 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన అతడు కాళేశ్వరం, కోహెడ, అంతకపేట, గౌరవెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పని చేశారు. తానెక్కడ పని చేసినా ప్రత్యేక గుర్తింపు సాధించారు. 2015 నుంచి కీ రీసోర్సు పర్సన్గా సహచర ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల దిల్లీ, బెంగళూరు, సిక్కిం, హైదరాబాద్లో ఆంగ్లభాష, బోధన నైపుణ్యాలపై జరిగిన వివిధ సెమినార్లు, సదస్సులకు హాజరయ్యారు. తాజాగా మైసూర్లోని ప్రాంతీయ విద్యాకేంద్రంలో ఈ నెల 2 నుంచి జరిగిన ఎన్సీఈఆర్టీ 5 రోజుల శిక్షణలో పాల్గొన్నారు.
రమణి
పాఠ్యపుస్తక రచయిత్రిగా..
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం ప్రాథమికోన్నత పాఠశాలలో రమణి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అంటే ఆమెకు చాలా ఇష్టం. 18వ ఏట వివాహం జరిగింది. అత్తింటివారు విద్యాభ్యాసానికి సాగించేందుకు ప్రోత్సహిస్తూ సహకరించారు. దూరవిద్య ద్వారా డీగ్రీ, పీజీ, రెగ్యులర్గా బీఈడీ పూర్తి చేశారు. 2002 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. దౌల్తాబాద్, రామచంద్రాపురం పాఠశాలల్లో పని చేశారు. ప్రస్తుతం ఇంద్రేశం పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు పాఠాలు చెబుతూనే మరోవైపు 3, 4 తరగతులకు సంబంధించి ఆంగ్ల పాఠ్యాంశాలు రాస్తున్నారు. పాఠ్యపుస్తక రచయిత్రిగానే కాకుండా ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాలను పెంపొందించేందుకు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన హ్యాండ్బుక్స్, మాడ్యూల్స్ రూపొందిస్తున్నారు. ఇటీవల మైసూర్లో జరిగిన శిక్షణలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఇచ్చిన సంస్థలను భాజపా అమ్మేస్తోంది: సీఎం రేవంత్రెడ్డి
[ 26-04-2024]
సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..