పింఛన్లపై ఆశల ఊసులు..
స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ.. పింఛను కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి తీపి కబురు అందింది. ఈనెల 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరుకు మంత్రి మండలి నిర్ణయించిన నేపథ్యంలో మరోమారు ఆశలు చిగురించాయి.
బలోపేతం దిశగా అంగన్వాడీ కేంద్రాలు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ.. పింఛను కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి తీపి కబురు అందింది. ఈనెల 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరుకు మంత్రి మండలి నిర్ణయించిన నేపథ్యంలో మరోమారు ఆశలు చిగురించాయి. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అర్హులకు.. త్వరలోనే పింఛను సొమ్ము మంజూరు కానున్న నేపథ్యంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దమొత్తంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు నిర్ణయించడంతో బలోపేతం దిశగా చర్యలు చేపట్టినట్లయింది.
జిల్లాలోని వివిధ విభాగాల్లో పింఛను నిమ్తితం 11,477 దరఖాస్తులు ఆమోదం పొంది రాష్ట్రస్థాయిలో పెండింగ్లో ఉన్నాయి. వృద్ధాప్య పింఛను నిమిత్తం 57 ఏళ్లు, ఆపై వయసు కలిగిన దరఖాస్తుదారుల సంఖ్య 25,168. ఆసరా పింఛను 57 ఏళ్ల వయసున్న వారికి అందిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించడంతో దరఖాస్తుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 65 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులు సహా హెచ్ఐవీ, బోధకాల బాధితులకు ప్రభుత్వం ప్రతి నెలా పింఛను చెల్లిస్తోంది. రెండోసారి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పింఛను మొత్తాన్ని పెంచింది. ఫలితంగా దివ్యాంగులకు నెలకు రూ.3016, మిగిలిన విభాగాల వారికి రూ.2,016 చొప్పున ఖాతాల్లో జమ అవుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 1,71,637 మందికి నెలలో మొత్తం రూ.37 కోట్లు చెల్లిస్తున్నారు. సీఎం గత ఎన్నికల్లో ప్రకటించిన మేర ఆసరా పథకానికి అర్హత వయసును గత ఏడాది ఆగస్టులో 65 నుంచి 57 ఏళ్లకు కుదించింది. అదే నెలలో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ఆరంభమైంది. ఈ మేరకు జిల్లాలో 57 ఏళ్లు, ఆపైబడి ఉన్న వారు పెద్దమొత్తంలో దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించారు. తాజాగా మంత్రివర్గ నిర్ణయంతో తాము పింఛను అందుకుంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అత్యధికంగా సిద్దిపేట అర్బన్ మండలంలో..
జిల్లాలో ఆమోదం పొంది రాష్ట్రస్థాయిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలిస్తే.. వృద్ధాప్య - 2728, వితంతు - 5636, దివ్యాంగ - 406, కల్లుగీత కార్మికులు - 364, నేత కార్మికులు - 211, ఒంటరి మహిళలు - 183, బీడీ కార్మికులు - 1555, హెచ్ఐవీ - 239, బోదకాలు - 155 మంది ఉన్నారు. 57 ఏళ్లు, ఆపైన వయసుండి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 25,168. అందులో అత్యధికంగా సిద్దిపేట అర్బన్ మండలం నుంచి 2908 మంది, అత్యల్పంగా కొమురవెల్లి మండలం నుంచి 458 ఉన్నారు. జాబితా సిద్ధంగా ఉందని, ప్రభుత్వం నుంచి మార్గ్గదర్శకాలు రాగానే మంజూరు, పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
అవస్థలకు చెల్లుచీటి పలికేలా..
జిల్లాలో చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1150 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఉపాధ్యాయులు, ఆయాలు లేక నిర్వహణపై ప్రభావం చూపుతోంది. కేంద్రాల పరిధిలో బాలలకు పూర్వ ప్రాథమిక విద్య బోధన, గర్భిణులు, తల్లులకు భోజనం, సరుకుల పంపిణీ సక్రమంగా సాగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పలుచోట్ల పర్యవేక్షణ, కార్యక్రమాల నిర్వహణ నామమాత్రంగా మారింది. గత ఏడాది సెప్టెంబరులో 129 అంగన్వాడీ, మినీ అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా.. 2648 మంది దరఖాస్తు చేశారు. అప్పటి నుంచి నియామకాల ప్రక్రియ ముందడుగు పడలేదు. ఫలితంగా ఖాళీల సంఖ్య మరింతగా పెరిగింది. సీఎం ప్రకటనతో ఆ కష్టాలకు చెల్లుచీటి పలికే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.