తగ్గిన పత్తి కొనుగోళ్లు
ఇటీవలి వరకు మురిపించిన పత్తి ధర అమాంతం పడిపోవటంతో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు గణనీయంగా తగ్గిపోయింది.
ధర పెరుగుదలపై అన్నదాతలు ఆశలు
న్యూస్టుడే - గజ్వేల్, మద్దూరు
బైరాన్పల్లిలో ఓ రైతు ఇంట్లో నిల్వ
ఇటీవలి వరకు మురిపించిన పత్తి ధర అమాంతం పడిపోవటంతో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు గణనీయంగా తగ్గిపోయింది. ధర పెరుగుతుందేమోనని రైతులు వారం రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆచితూచి విక్రయాలు కొనసాగిస్తున్నారు. క్వింటాలు ధర రూ.9330 నమోదు అయిన సందర్భంలో జిల్లాలో రోజుకు 3900 క్వింటాళ్ల నుంచి 4200 క్వింటాళ్ల వరకు కొనుగోళ్లు సాగాయి. ఇప్పుడు క్వింటా పత్తి ధర రూ.8800 చేరువలో ఉండటంతో ప్రస్తుతం రోజుకు 2900 నుంచి 3800 క్వింటాళ్ల వరకు విక్రయాలు నమోదు అవుతున్నాయి. మొత్తంగా ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు వ్యాపారులు 11630 మంది రైతుల నుంచి 85,523 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. గురువారం క్వింటాలుకు రూ.8850 ధర పలికింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.6380కు విపణిలో ఎక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో సీసీఐ (భారతపత్తి సంస్థ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. జిల్లాలోని 27 మిల్లులు, ప్రైవేటు కాంటాల ద్వారా కొనుగోళ్లు సాగుతున్నాయి. రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలున్నాయని భావించిన రైతులు కొందరు పత్తిని ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఈ ఏడాది జిల్లాలో 1,16,814 ఎకరాల్లో రెతులు పత్తి సాగుచేయగా ఒక్కో ఎకరానికి ఎనిమిదిన్నర క్వింటాళ్ల మేర దిగుబడి ఆశించారు. అధిక వర్షాలు, తెగుళ్ల ప్రభావంతో ఎకరానికి మూడు నుంచి ఐదు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు 20 శాతం మాత్రమే విక్రయాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు మొదలయ్యాక పది రోజుల వ్యవధిలో క్వింటాలుకు రూ.వెయ్యి తగ్గింది. గత ఏడాది ఒక దశలో రూ.14 వేల ధర పలికింది. ఈసారి కనీసం రూ.10 వేలు దాటినా అమ్మేయాలని కర్షకులు చూస్తున్నారు. దళారులు పల్లెలకు వచ్చి అడుగుతున్నారు. ధరను బట్టి రైతులు వెనుకంజ వేస్తున్నారు.
ఎనిమిది క్వింటాళ్లు దాచిన..
నందనమైన కనకయ్య, బైరాన్పల్లి
ధర పెరుగుతుందని చూస్తున్న. రెండెకరాల్లో పత్తి సాగు చేసిన. రూ.60 వేల పెట్టుబడి అయింది. భవిష్యత్తులో ధర పెరుగుతుందని ఎనిమిది క్వింటాళ్లు ఇంట్లోనే పెట్టుకున్న. కనీసం పెట్టుబడులైనా వస్తాయని ఆశపడుతున్న.
పెట్టుబడైనా రాకపోతే ఎట్లా?
లక్ష్మారెడ్డి, రైతు, ధర్మారం.
ధర ఎక్కువగా ఉంటుందని పత్తి సాగు చేసిన. ఆశతో మూడెకరాల్లో వేసిన. రూ.లక్ష పెట్టుబడి అయింది. ధర ప్రస్తుతం తగ్గింది. అమ్మలేదు. తెగుళ్లతో దిగుబడి తగ్గింది. పెట్టుబడులైనా రాకపోతే కష్టమే. పది క్వింటాళ్లు అమ్మకానికి ఉంది. రైతుల అవసరాలు చూసి వ్యాపారులు రేటు తగ్గిస్తున్నరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి