యార్డులున్నా.. వసతులు కరవు
అందోలు నియోజకవర్గ పరిధిలోని జోగిపేట, వట్పల్లి, రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు సరైన వసతులు లేవు.
అన్నదాతలకు తప్పని ఇబ్బందులు
న్యూస్టుడే, జోగిపేట, వట్పల్లి, రాయికోడ్: అందోలు నియోజకవర్గ పరిధిలోని జోగిపేట, వట్పల్లి, రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు సరైన వసతులు లేవు. అన్నదాతలకు అసౌకర్యంగా మారాయి. పంటల విక్రయానికి వచ్చే వారికి సదుపాయాల కల్పనపై పాలకవర్గం, అధికారులు దృష్టి సారించకపోవడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కథనం.
వట్పల్లి: ఇతర కార్యాలయాలకు వినియోగం
వట్పల్లి మార్కెట్ యార్డులో రైతుల సౌకర్యార్థం నిర్మించిన పలు భవనాలను ఇతర శాఖల అధికారులకు కేటాయించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. విశ్రాంతి భవనం పోలీసు స్టేషనుకు, మరో భవనాన్ని తహసీల్దార్ కార్యాలయాలకు అప్పగించారు. యార్డు ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగాయి. మూత్రశాలలున్నా.. వినియోగానికి అనుకూలంగా లేవు. ప్రహరీ కూలిపోయింది.
రాయికోడ్: అన్నీ సమస్యలే..
రాయికోడ్ మార్కెట్ యార్డులో విశ్రాంతి భవనాన్ని నిర్మించ లేదు. ఈ యార్డుకు రాయికోడ్ మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులు ధాన్యం తెస్తుంటారు. వారికి మౌలిక వసతులు కరవయ్యాయి. యార్డు చుట్టూ నిర్మించిన రక్షణ గోడ కూలిపోయింది.
జోగిపేట: విశ్రాంతి భవనం శిథిలం
జోగిపేట పట్టణంలోని మార్కెట్ యార్డులో నిర్మించిన రైతు విశ్రాంతి భవనం శిథిలావస్థకు చేరింది. నిత్యం ఇక్కడికి చౌటకూరు, పుల్కల్, అందోలు హత్నూర మండలాలకు చెందిన రైతులు ధాన్యం, ఇతర పంటల విక్రయానికి వస్తుంటారు. భవనం నిర్మించినప్పుడు కొంత కాలం రైతులకు ఉపయోగపడ్డా.. పదేళ్లుగా నిరుపయోగంగా మారింది. దాని చుట్టూ ముళ్ల పొదలు పెరిగాయి. గోదాం భవనం గోడ కూలిపోయింది. దిగుబడులు ఆరబెట్టడానికి నిర్మించిన ప్లాట్ఫాంలు శిథిలమయ్యాయి. తాగునీటికి మినీ ట్యాంకులు నిర్మించినా.. పరిశుభత్ర పాటించడం లేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు.
సౌకర్యాల కల్పనకు చర్యలు
ప్రతాప్గౌడ్, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి జోగిపేట
మార్కెట్ యార్డుల్లో రైతులకు సైకర్యాలు కల్పించేదందుకు చర్యలు చేపడతాం, కూలిన భవనాలు, షెడ్లు, ప్రహరీల మరమ్మతులకు నిధులు కావాలని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి