అత్యంత కచ్చితత్వంతో వర్షపాత అంచనా
అత్యంత కచ్చితత్వంతో వర్షపాతాన్ని ముందుగా గుర్తించడమనేది పర్యావరణ పరిశోధనల్లో అత్యంత సవాలుతో కూడుకున్నది.
ఐఐటీహెచ్లో రెయిన్డ్రాప్ రీసెర్చి ఫెసిలిటీ ఏర్పాటు
వాన పరిమాణంపై పరిశోధనలు
రెయిన్డ్రాప్ రీసెర్చ్ ఫెసిలిటీ పరికరం
ఈనాడు, సంగారెడ్డి: అత్యంత కచ్చితత్వంతో వర్షపాతాన్ని ముందుగా గుర్తించడమనేది పర్యావరణ పరిశోధనల్లో అత్యంత సవాలుతో కూడుకున్నది. వర్షపాతానికి సంబంధించి సహజ వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకునే మైక్రోఫిజికల్ ప్రక్రియలపై ప్రాథమిక పరిజ్ఞానం లేకపోవడంతో సమస్య వస్తోంది. ఈ పరిస్థితుల్లో కచ్చితత్వంతో వర్షపాతాన్ని అంచనా వేసేలా ఐఐటీ హైదరాబాద్ ముందడుగు వేసినట్లు ఆ విద్యా సంస్థ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన రెయిన్డ్రాప్ రీసెర్చ్(వాన బిందువుల పరిశోధన) ఫెసిలిటీని తాజాగా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఐఐటీహెచ్ డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి, ఆచార్యుడు విద్యాసాగర్లతో కలిసి నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్ శుక్రవారం దీన్ని ఆవిష్కరించారు. వర్షపు చినుకులు పడే సమయంలో జరిగే వివిధ ప్రక్రియల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి, వాతావరణ మార్పులను పసిగట్టడానికి ఈ ఫెసిలిటీ ఉపకరిస్తుందన్నారు. వర్షపాతాన్ని కచ్చితత్వంతో తెలుసుకోవడానికి ఉపకరిస్తుందని ఆచార్య బీఎస్మూర్తి పేర్కొన్నారు.
కీర్తిసాహు కీలక పాత్ర
కెమికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఆచార్య కీర్తి సాహు గత కొన్నేళ్లుగా ఈ అంశమై పరిశోధనలు చేసి ఈ ఫెసిలిటీని సృష్టించారు. ఇక్కడ ఏర్పాటయ్యే కేంద్రంలో 10-40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో పాటు తేమ శాతం సున్నా నుంచి సంతృప్త స్థాయి వరకు ఉండేలా ఏర్పాట్లు చేశారు. బిందువులు మేఘాల నుంచి భూమికి చేరేలోపు వివిధ పరిస్థితుల్లో, వివిధ ఎత్తుల్లో పరిమాణం, ఆకృతి ఎలా మారుతుందో తెలుసుకోవడం దీని ద్వారా సాధ్యపడుతుంది. తద్వారా ముందస్తుగా కచ్చితత్వంతో వర్షపాతాన్ని అంచనా వేస్తామని స్పష్టం చేశారు. మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) ఆధారిత డిజిటల్ ఇన్లైన్ హోలోగ్రఫీ సాంకేతికత వినియోగిస్తున్నామన్నారు.
ఆచార్య కీర్తిసాహు బృందంతో డాక్టర్ వీకే సారస్వత్, ఆచార్య బీఎస్మూర్తి, ఆచార్య విద్యాసాగర్ తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి