వారంలో లక్ష మందికి పని కల్పిస్తాం
‘ప్రస్తుతం వేసవి ఎండలు మండుతున్నాయి. ఉపాధి కూలీలకు పనులు కల్పించేందుకు అనువైన కాలం. అందుకే కూలీలు కోరిన వెంటనే పని కల్పించేలా ఉపాధి సిబ్బంది, అధికారులు చొరవ చూపుతున్నారని’ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీహెచ్ శ్రీనివాస్రావు అన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీహెచ్ శ్రీనివాస్రావుతో ‘న్యూస్టుడే’
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్
‘ప్రస్తుతం వేసవి ఎండలు మండుతున్నాయి. ఉపాధి కూలీలకు పనులు కల్పించేందుకు అనువైన కాలం. అందుకే కూలీలు కోరిన వెంటనే పని కల్పించేలా ఉపాధి సిబ్బంది, అధికారులు చొరవ చూపుతున్నారని’ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీహెచ్ శ్రీనివాస్రావు అన్నారు. ఆయనతో ‘న్యూస్టుడే’ నిర్వహించిన ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు.
ఊరూరా ప్రచారం
ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డున్న అందరికీ పనులు కల్పిస్తాం. ఈ దిశగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రచారం చేయిస్తున్నాం. కొత్త జాబ్కార్డులతో పాటు.. బ్యాంకు ఖాతాలు తెరిపించేలా సిబ్బంది కూలీలకు అండగా నిలుస్తున్నారు. జిల్లా పాలనాధికారి శరత్ ప్రతి గ్రామంలో 50 శాతానికి మంచి పనులు కల్పించేలా ఆదేశాలు ఇచ్చారు.
ఆందోళన వద్దు.. డబ్బులు జమవుతాయి
కొందరు కూలీలు సకాలంలో డబ్బులు జమ కావడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఎవరూ అధైర్య పడవద్దు. ప్రతి ఒక్కరికీ డబ్బులు ఖాతాల్లో జమవుతాయి. తనతోపాటు ఏపీడీలు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో కలిసి మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ తొలి వారంలో 1.16 లక్షల మందికి పని కల్పించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఆ దిశగా కృషి చేస్తున్నాం.
నర్సరీల్లో మొక్కల సంరక్షణ
జిల్లాలో 647 వన నర్సరీలున్నాయి. వాటిలో విత్తనాలు మొలకెత్తని పక్షంలో మళ్లీ నాటాలని ఆదేశించాం. వచ్చే 15 రోజుల్లో 100 శాతం మొక్కలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎండ వేడిమికి మొక్కల సంరక్షణకు చాలా చోట్ల ఇప్పటికే పరదాలు పంపిణీ చేశాం. నీటి తడులు తడిపిస్తూ మొక్కల సంరక్షణ చేసేలా ఎంపీడీవోలు పర్యవేక్షించాలి.
అత్యధికం అందోలు మండలంలో..
ప్రస్తుత గణాంకాల ప్రకారం పనుల కల్పనలో జిల్లాలో అందోలు మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. అక్కడ 2321 మంది పనులు చేస్తున్నారు. కంది మండలంలో 2743 మందికి కేవలం 803 మంది మాత్రమే పనులకు వస్తున్నారు.
ప్రాథమిక చికిత్స కిట్లు కావాలని కోరుతాం
జిల్లాలో ఉపాధి కూలీలు పనులకు వెళ్లిన చోట గతంలో పరదాలు, టెంట్ల ఏర్పాట్లు ఉండేవి. ప్రస్తుతం ప్రభుత్వం వాటి పంపిణీని నిలిపివేసింది. జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి ప్రతి గ్రామ పంచాయతీకి ప్రథమ చికిత్స కిట్లు ఇవ్వాలని కోరుతూ.. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.