కట్టడికి కదిలారు..
జిల్లాలో వైరస్ కట్టడికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. పురపాలికల ఆధ్వర్యంలో ఇంటింటి జ్వర సర్వేతో ముందుకెళ్తున్నారు. మెప్మా అధికారులు, ఆర్పీలు, వైద్య సిబ్బంది లక్షణాలు గుర్తించి మందులు పంపిణీ చేస్తున్నారు.
పురపాలికలో ముమ్మరంగా ఇంటింటి జ్వర సర్వే
సూర్యాపేటలోని విద్యానగర్లో ఇంటింటి జ్వర సర్వే చేస్తున్న సిబ్బంది
సూర్యాపేట పురపాలిక, న్యూస్టుడే: జిల్లాలో వైరస్ కట్టడికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. పురపాలికల ఆధ్వర్యంలో ఇంటింటి జ్వర సర్వేతో ముందుకెళ్తున్నారు. మెప్మా అధికారులు, ఆర్పీలు, వైద్య సిబ్బంది లక్షణాలు గుర్తించి మందులు పంపిణీ చేస్తున్నారు.
జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్నగర్ మున్సిపాలిటీలో అధికారులు శుక్రవారం నుంచి ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఐదు పురపాలికల్లో 210 బృందాలను నియమించారు. ఈ నెల 31 వరకు నిర్వహించనున్నారు.
టీకా వేసుకున్నా వదలదే... రెండు డోసులు టీకా వేసుకున్న వారిని కూడా మహమ్మారి వదలడం లేదు. మాస్కు ధరించకుండా విచ్చలవిడిగా తిరుగుతుండటంతో వైరస్ వ్యాపిస్తోంది. ఇటీవల జిల్లాలో నమోదైన కేసుల్లో టీకా వేసుకున్నా వారూ ఉన్నట్లు గుర్తించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు రెండు డోసులు పూర్తి చేసుకొని తొమ్మిది నెలలు దాటిన వారికి బూస్టర్ డోస్ వేస్తున్నారు. దీనిపై మరింత అవగాహన కల్పించాల్సి ఉంది. సర్వేలో మొదటి, రెండు రోజులు పూర్తి చేసుకున్న వారిని గుర్తించి టీకా పంపిణీ చేస్తున్నారు.
దుకాణాలకు స్టిక్కర్లు.. కరోనా కట్టడికి మున్సిపల్ అధికారులు పట్టణాల్లోని కిరాణం, వెజ్ అండ్ నాన్వెజ్ దుకాణాల ముందు నో మాస్కు-నో వెంట్రీ స్టిక్కర్లను అంటిస్తున్నారు. దుకాణాలకు వచ్చేవారు మాస్కు, భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించారు. పోలీసులు కూడా మాస్కులేని వారికి జరిమానాలు విధిస్తున్నారు.
పకడ్బందీగా సర్వే: పి.రామాంజూలరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట... ప్రభుత్వ ఆదేశాలతో జ్వర సర్వే పకడ్బందీగా చేస్తున్నాం. కుటుంబ సభ్యుడి పూర్తి ఆరోగ్య వివరాలు నమోదు చేసేలా చర్యలు తీసుకున్నాం. బృందాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారలూ ఉన్నారు. ప్రజలంతా సహకరించి కట్టడిలో భాగస్వామ్యులు కావాలి.
కరోనా వ్యాప్తిపై మరింత అప్రమత్తం!
ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరికలపై వివరాల సేకరణ
మేళ్లచెరువు, న్యూస్టుడే: కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం ఈసారి మరింత అప్రమత్తమైంది. రాబోయే మూడు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఉన్నత వైద్యమండలి సూచించిన నేపథ్యంలో జిల్లా వైద్యశాఖ ఇంటింటి సర్వేను శుక్రవారం నుంచే ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ 96 శాతం, రెండో డోసునూ 76 శాతం పూర్తి చేశారు. ఇదే క్రమంలో ఫ్రంట్ లైన్ వారియర్స్, 60 ఏళ్లు పైబడిన వారికీ బూస్టర్ డోసు 10 శాతం వేశారు. ఇప్పటివరకు 2,865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 215 మందికి పాజిటివ్ ఉన్నట్టు నిర్థరించారు. రెండో దశ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు కంటే మరో అడుగు ముందుకేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యసేవలందించాలని, ప్రైవేటుకు వెళ్లొద్దని మంత్రి హరీష్ రావు సూచించిన నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ జ్వర కేసుల నమోదుపై జిల్లా వైద్యశాఖ దృష్టి సారించింది. ఓ పక్క హోం ఐసోలేషన్ కిట్లు ఇచ్చేందుకు సిద్ధమైన అధికారులు.. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో కేసుల వివరాలు సేకరిస్తున్నారు. దీని కోసం శనివారం జిల్లా వైద్యాధికారి కోటాచలం ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన నివేదిక ప్రైవేటు ఆసుపత్రులకు పంపారు. ఆ ప్రకారం.. రోగి పేరు, చిరునామా, చేరిన ఆసుపత్రి, బాధితులు చేయించుకున్న కరోనా టీకాల వివరాలు, జ్వరం బారిన పడిన తేదీ, కొవిడ్ పాజిటివ్ ఉంటే ఆ వివరాలు, వారి చరవాణి నంబర్ను అందులో పేర్కొనాలని సూచించారు. ప్రతిరోజూ ఈ వివరాలు తమకు పంపాలని జిల్లా వైద్యశాఖ వారికి సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలెక్టరేట్లో రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా భువనగిరిలో సాధారణ పరిశీలకుడు రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనమంతు కే.జెండగే సమక్షంలో సమావేశం నిర్వహించారు. -
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!