ఒక్కసారి తీసుకుంటే చాలు..!
రోజురోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. వీరికి ఎంప్లాయిమెంట్ కార్డు ఎంతో అవసరం. ఇది పొందిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాల్లో కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
నల్గొండ జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం
నల్గొండ గ్రామీణం, న్యూస్టుడే: రోజురోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. వీరికి ఎంప్లాయిమెంట్ కార్డు ఎంతో అవసరం. ఇది పొందిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాల్లో కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఒకసారి కార్డు తీసుకున్న వారు.. తిరిగి రెన్యూవల్ చేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుండటంతో అవి రద్దు అవుతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన జాబ్ కార్డులు అందించేలా చర్యలు తీసుకుంటోంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 31,525 మంది
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉపాధి కల్పన శాఖ కార్యాలయాల్లో నమోదు చేసుకున్న వారు 31,525 మంది ఉన్నట్లు ఆధికారులు చెబుతున్నారు. వీరు ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ కార్డు పొందారు. ఇంకా పేర్లు నమోదు చేసుకోని యువత లక్షల్లోనే ఉంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు ఉపాధి కల్పనశాఖ ద్వారానే నిర్వహించే వారు. ఆ సమయంలో కార్డు తప్పనిసరిగా చూసేవారు. సీనియారిటీ ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించేవారు.ఆ తర్వాత ఆ విధానాన్ని రద్దు చేయడంతో యువత ఆసక్తి చూపడం లేదు. కొన్ని కార్పొరేషన్లు మాత్రం ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా జాబ్కార్డు ఉండాల్సిందేననే నిబంధనలు పెడుతున్నాయి. ప్రభుత్వం కూడా జిల్లాలో జాబ్మేళాలు నిర్వహించి..ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందుకోసం పలు ప్రైవేటు కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది.
రిజిస్ట్రేషన్ ఇలా..
నూతనంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారు ఆన్లైన్లో www.employment.telangana.gov.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. యూజర్ ఐడీ, పాస్వర్డు వస్తుంది. దరఖాస్తుదారుడి వివరాలన్నీ ఉపాధి కల్పన జిల్లా కార్యాలయానికి వెళ్తాయి. అక్కడ సంబంధిత అధికారులు పరిశీలన చేసి కార్డును అందిస్తారు. అభ్యర్థి జిల్లా కార్యాలయానికి పోవాల్సిన అవసరం లేదు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.అభ్యర్థుల జాబితాను www.ncs.gov.in జాతీయస్థాయి వెబ్సైట్కు బదిలీ చేస్తారు. తద్వారా ఎక్కువ మొత్తంలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
చెల్లుబాటు కానుంది
గతంలో జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో పేరు నమోదు చేసుకొని నూతనంగా కార్డు తీసుకుంటే.. మూడేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. చాలామంది ఆ విషయం మరిచిపోతుంటారు. కార్డు (ల్యాప్స్) రద్దు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న సర్కారు నూతన మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఇక నుంచి ఉపాధి కల్పన కార్యాలయం నుంచి ఎంప్లాయిమెంటు కార్డు తీసుకున్న వ్యక్తికి 54 సంవత్సరాలు వచ్చే వరకు లేదా ఉద్యోగం వచ్చే వరకు కార్డు చెల్లుబాటు కానుంది.
ఉపాధి కల్పన కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్నవారు జిల్లాల వారీగా ఇలా..
నల్గొండ - 18,853
సూర్యాపేట - 9,340
యాదాద్రి - 3,332
సద్వినియోగం చేసుకోవాలి
- పద్మ, నల్గొండ జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి
యువతకు జాబ్ కార్డులు శాశ్వత ప్రాతిపదికన అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కసారి పొందితే 54 సంవత్సరాల వరకు వినియోగంలో ఉంటుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలెక్టరేట్లో రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా భువనగిరిలో సాధారణ పరిశీలకుడు రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనమంతు కే.జెండగే సమక్షంలో సమావేశం నిర్వహించారు. -
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!