logo

భద్రత కట్టుదిట్టం చేయండి

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలో భద్రత చర్యలు, బందోబస్తు తీరును డీసీపీ రాజేష్‌ చంద్ర మంగళవారం పరిశీలించారు.

Published : 01 Feb 2023 05:33 IST

యాదాద్రి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న డీసీపీ రాజేష్‌ చంద్ర తదితరులు

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలో భద్రత చర్యలు, బందోబస్తు తీరును డీసీపీ రాజేష్‌ చంద్ర మంగళవారం పరిశీలించారు. దర్శన సముదాయాల నిర్వహణ, భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కలియతిరిగారు. సీసీ కెమెరాలను, కమాండ్‌ కంట్రోల్‌ గదిని పరిశీలించారు. భద్రత సిబ్బంది, అధికారులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రత చర్యలు కట్టుదిట్టం చేయాలని సూచించారు. అంతకుముందు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేసి, స్వామి వారి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆయన వెంట ఏసీపీ నర్సింహరెడ్డి, పోలీసు అధికారులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని