logo

బస్సు ఢీకొని 8 ఆవులు మృతి

పశుగ్రాసం కోసం మిర్యాలగూడ వైపు వెళ్తున్న గోవుల మందను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 ఆవులు మృతిచెందాయి.

Published : 22 Mar 2023 04:05 IST

బాధితులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు

మాడ్గులపల్లి(వేములపల్లి),న్యూస్‌టుడే: పశుగ్రాసం కోసం మిర్యాలగూడ వైపు వెళ్తున్న గోవుల మందను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 ఆవులు మృతిచెందాయి. ఈ ఘటన మంగళవారం బుగ్గబావిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడుగొమ్మ మండలం కాచరాజుపల్లి గ్రామానికి చెందిన పెద్దగొల్ల పుల్లయ్య, రమావత్‌ రాములు మరికొంత మందితో కలిసి సుమారు రెండువేల ఆవుల మందను మేతకోసం మిర్యాలగూడ కెనాల్‌ ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం గ్రామానికి చేరుకోగానే...గోవులు ఒక్కసారిగా బెదిరాయి. అలా బెదరడంతో మందలోని కొన్ని చెల్లాచెదురుగా అయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని ఆవులు రహదారి అవతలి వైపుకు వెళ్లాయి. అలా వెళ్తుండగా చెన్నై నుంచి హైదరాబాదు వెళ్తున్న ప్రైవేటు బస్సు గోవులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 ఆవులు అక్కడిక్కడే మృతిచెందాయి.బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీను కేసు నమోదు చేశారు.సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటగిరి పరిశీలించారు. ఈ విషయం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు దృష్టికి రావటంతో మృతి చెందిన ఆవుల్ని పరిశీలించారు. ప్రైవేటు బస్సు ఏజెన్సీతో మాట్లాడి బాధితులకు త్వరితగతిన నష్టపరిహారం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్‌, పశువైద్యాధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని