స్వశక్తి నీడగా.. ఆసక్తి తోడుగా..!
కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపిన వారితో పాటు, చదువును కొనసాగిస్తున్న బాలికలు స్వశక్తితో రాణించాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుట్టు మిషన్, బ్యూటీషియన్ వృత్తి విద్యా కోర్సులపై గ్రామీణ బాలికలు ఆసక్తి చూపుతున్నారు.
మునుగోడు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో వృత్తి విద్యా కోర్సులపై శిక్షణ పొందుతున్న బాలికలు
మునుగోడు, న్యూస్టుడే: కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపిన వారితో పాటు, చదువును కొనసాగిస్తున్న బాలికలు స్వశక్తితో రాణించాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుట్టు మిషన్, బ్యూటీషియన్ వృత్తి విద్యా కోర్సులపై గ్రామీణ బాలికలు ఆసక్తి చూపుతున్నారు. కిశోర బాలికలకు 45 రోజుల పాటు ఉచితంగా కల్పిస్తున్న ఈ వృత్తి విద్య కోర్సులు వారికి ఎంతగానో దోహదపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మహిళ సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మునుగోడు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న పలువురు బాలికలతో ‘న్యూస్టుడే’ మాట్లాడింది.
రకరకాల డిజైన్లపై శిక్షణ పొందాను
తేజశ్విని, మునుగోడు
గత 35 రోజుల నుంచి బ్యూటీషియన్ వృత్తి విద్యా కోర్సులో రకరకాల డిజైన్లపై శిక్షణ పొందాను. మెహందీ, మేకప్, మేడిక్యూర్, పెడిక్యూర్ ఇలా మరెన్నో చేయడం నేర్చుకున్నాను. బ్యూటీషియన్ చేయడం నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. ప్రభుత్వం ఉచితంగా వేసవి కాలంలో శిక్షణ ఇవ్వడంతో పూర్తిగా నేర్చుకున్నాను.
శ్రద్ధతో నేర్చుకున్నాను..
హర్షిత, మునుగోడు
వేసవి కాలంలో ఇంటివద్ద ఖాళీగా ఉండటం ఇష్టం లేక శిక్షణ కార్యక్రమాన్ని చాలా శ్రద్ధతో నేర్చుకుంటున్నాను. బ్యూటీషియన్పై ఉన్న ఇష్టంతో ఐబ్రోస్, పేషియల్, హేర్ స్టైల్, ఇలా నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఎన్నో కొత్త డిజైన్లపై శిక్షణ పొందాను. సొంతంగా బ్యూటీషియన్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశం ఉంది.
ఉపాధి కల్పిస్తుందని..
శ్రుతి , మునుగోడు మండలం
మాది వ్యవసాయ కుటుంబం. ఇంటర్ పూర్తి చేశాను. కుట్టుమిషన్ ఉపాధి కల్పిస్తుందని ఈ శిక్షణకు వస్తున్నాను. కుట్లు, అల్లికలు పూర్తిగా నేర్చుకున్నాను. బ్లౌజులు, డ్రెస్లను కుట్టేవిధంగా శిక్షణ తీసుకున్నాను. ప్రభుత్వం కల్పించిన ఈ కార్యక్రమం ఎంతో బావుంది.
వృత్తి విద్యా కోర్సుపై ఆసక్తితో..
పరమేశ్వరీ, మునుగోడు మండలం
వృత్తి విద్య కోర్సులపై ఉన్న ఆసక్తితో వేసవి కాలంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు వస్తున్నాను. 45 రోజుల పాటు సాగిన ఈ శిక్షణ తరగతుల్లో కుట్టుమిషన్ను పూర్తిగా నేర్చుకున్నాను. కొత్త డిజైన్లను కుట్టే విధంగా మాకు జ్యోతి టీచర్ శిక్షణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!