రుధిర దారులు
నిర్లక్ష్య డ్రైవింగ్.. మితిమీరిన వేగం.. డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం.. మద్యం తాగి వాహనాలు నడపడం.. లాంటి పలు కారణాలే రోడ్డు ప్రమాదాలకు కారణమని పలు సంస్థల నివేదికలు పేర్కొన్నాయి.
తరచూ ప్రమాదాలతో ప్రయాణికుల్లో భయందోళన
వరికుంటపాడు కోల్డ్స్టోరేజీ సమీపంలో కారు డ్రైవర్ కునుకు తీయడంతో వంతెనపై నుంచి గోతిలో పడింది. కారు సినీఫక్కీలో మాదిరి 3 దఫాలుగా పల్టీలు కొట్టి బోల్తా పడటంతో ప్రకాశం జిల్లాకు చెందిన నాదెండ్ల వెంకటలక్ష్మమ్మ కారులోనే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద గతేడాది ఏప్రిల్ 27న ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు లారీలు వేగంగా ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
న్యూస్టుడే, వరికుంటపాడు, వింజమూరు: నిర్లక్ష్య డ్రైవింగ్.. మితిమీరిన వేగం.. డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం.. మద్యం తాగి వాహనాలు నడపడం.. లాంటి పలు కారణాలే రోడ్డు ప్రమాదాలకు కారణమని పలు సంస్థల నివేదికలు పేర్కొన్నాయి. వంతెనల వద్ద, రహదారి ఎత్తుగా ఉన్న ప్రాంతాల వద్ద ఏర్పాటు చేసిన ఇనుప పట్టాలు సక్రమంగా లేకపోవడం.. జంక్షన్లలో ఎలాంటి సూచికలు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గ్రామ కూడళ్ల వద్ద సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో రాత్రి సమయంలో వేగంగా వెళుతుండటంతో ప్రమాదాలు జరగుతున్నాయి. తిరుపతి జిల్లా నుంచి తెలంగాణలోని నకిరేకల్ వరకు ఎనిమిదేళ్ల కిత్రం జాతీయ రహదారి నిర్మించారు. ప్రస్తుతం ఎన్హెచ్ 565గా పిలుస్తున్నారు. ఈ మార్గంలో రాయలసీమ, కర్నాటక నుంచి అమరావతికి రాకపోకలు సాగించేందుకు వాహనాల రాకపోకలు క్రమంగా పెరిగాయి. నాణ్యత లేని రహదారి నిర్మాణంతో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు నెర్రెలిచ్చి గోతులు ఏర్పడుతున్నాయి. వాటిని మరమ్మతులు చేసిన ప్రాంతాల్లో హెచ్చుతగ్గులు ఉండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పెట్రోలింగ్ వాహనం రాత్రి సమయంలో గసీˆ్త తిరుగుతూ రహదారి పక్కన నిలిపిన వాహనాలను వారికి కేటాయించిన స్థలంలో ఆపేలా చర్యలు తీసుకుంటే ప్రమాదాలు తగ్గుతాయని వాహనదారులు చెబుతున్నారు.
ఘటనల వివరాలు..
* 2021 జూన్ 11న మర్రిపాడు మండలం బూదవాడ సమీపంలో కారు అతివేగంతో కూలీలు వెళుతున్న ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు.
* 2022 ఏప్రిల్ 27న మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
* మే 15న మర్రిపాడు మండలం ఏపిలగుంట వద్ద రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతున్న మహిళను వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
* సెప్టెంబర్ 5న మర్రిపాడు మండలం బాట సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతున్న వెంకట కార్తీక్రెడ్డి(5)ని కారు ఢీకొనడంతో మృత్యువాతపడ్డాడు.
* సెప్టెంబర్ 11న బూదవాడ వద్ద ద్విక్రవాహనదారుడిని కారు ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు.
* వరికుంటపాడులో అంకాలమ్మ వాగు వంతెనపై నుంచి కారు బోల్తాపడిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.సకాలంలో స్థానికులు స్పందించడంతో కోలుకున్నారు.
పది రోజుల్లో విద్యుద్దీపాలు ఏర్పాటు చేస్తాం
- ప్రసాద్, ఆర్పీవో
వగ్గంపల్లి, వరికుంటపాడు, దుత్తలూరు, బ్రాహ్మణపల్లి గ్రామ కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్కు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాం. గ్రామ కూడళ్ల వద్ద డీక్రాసింగ్ సిగ్నల్స్ను తిరిగి వేయించాం. పది రోజుల్లో లైటింగ్ వేయిస్తాం. వంతెనల వద్ద, ఎత్తయిన ప్రాంతాల వద్ద సైడు ఏర్పాటు చేయాల్సిన ఇనుప పట్టాలు, సిగ్నల్స్ వంటి సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో సమస్యలు పరిష్కరిస్తాం. వంతెనలపై పడిన గోతులను తాత్కాలికంగా పూడ్చేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా