Nellore: సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత..
గూడూరు పురపాలక సంఘం పరిధిలోని చెన్నూరు ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పోతు రిత్విక్ (24) అంత్యక్రియలు బంధువుల మధ్య గొడవలకు దారితీశాయి.
ఆస్తి వివాదాలతో సోదరుడే హత్యచేశాడని ఆరోపణ
గూడూరు గ్రామీణం, న్యూస్టుడే : గూడూరు పురపాలక సంఘం పరిధిలోని చెన్నూరు ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పోతు రిత్విక్ (24) అంత్యక్రియలు బంధువుల మధ్య గొడవలకు దారితీశాయి. యువకుడు బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతిచెందగా మృతదేహాన్ని బుధవారం రాత్రి స్వగ్రామానికి తీసుకువచ్చారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో బంధువుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఆస్తి గొడవల నేపథ్యంలో స్వయాన పెదనాన్న కుమారుడే ఈ హత్య చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
చెన్నూరుకు చెందిన పోతు వెంకటేశ్వర్లుకు రవి, శ్రీనివాసులు కుమారులు. వెంకటేశ్వర్లుకు స్థానికంగా పలు వ్యాపారాలు ఉండేవి. ఆర్థిక ఇబ్బందులతో అవన్నీ మూసివేశారు. పలుచోట్ల ఆస్తులున్నాయి. రవికి పెళ్లికాగా భార్య గతంలో అనారోగ్యంతో మృతిచెందగా కుమారుడు రిత్విక్ ఇంజినీరింగ్ పూర్తిచేసి బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె రిషిత ఇంజినీరింగ్ చదువుతోంది. వీరిద్దరూ తాత వెంకటేశ్వర్లు సంరక్షణలో ఉంటున్నారు. శ్రీనివాసులు కుమారుడు శ్రీకాంత్ సైతం బెంగళూరులోనే ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఆస్తుల విషయమై ఇంట్లో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆస్తి పంపకాలు సక్రమంగా జరగాలని రిత్విక్ గట్టిగా పట్టుబట్టారు.
ఈక్రమంలోనే రిత్విక్, శ్రీకాంత్ ఆదివారం చెన్నూరు నుంచి ఉద్యోగం నిమిత్తం వేర్వేరుగా బెంగళూరుకు వెళ్లిపోయారు. అక్కడ ఏంజరిగిందో తెలియదుగాని రిత్విక్ చనిపోయాడని చెన్నూరులోని తాత వెంకటేశ్వర్లుకు, బంధువులకు సోమవారం సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి మృతదేహాన్ని తీసుకువచ్చారు. మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో బెంగళూరు పోలీసులు శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. చెన్నూరులో అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో వాగ్వాదం నెలకొంది. ఆస్తి విషయమై రిత్విక్ను శ్రీకాంత్ నమ్మకంగా తీసుకెళ్లి బెంగళూరులోని అపార్ట్మెంట్ నుంచి కిందికి తోసివేయడంతోనే మృతిచెందాడని ఆరోపిస్తూ ఘర్షణకు దిగారు. గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్తతల మధ్యనే అంత్యక్రియలు పూర్తిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముస్లిం మైనార్టీల అభ్యున్నతిని వైకాపా ప్రభుత్వం కాలరాస్తోంది!
[ 29-04-2024]
‘రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కూటమిగా పోటీ చేస్తున్నాం. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి ఎన్డీయేతో కలిసిన తెదేపా ప్రభుత్వంలో విశేషంగా కృషి చేశాం. మళ్లీ కూటమికి ఓటేసి గెలిపిస్తే.. మరింతగా పాటుపడతాన’ని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. -
ఆత్మస్తుతి.. హామీల ఊసేది
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కందుకూరు పట్టణానికి వస్తున్నారని తెలిసి.. ఆశతో వచ్చిన ప్రజలు అసంతృప్తితో వెనుదిరిగారు. -
గొప్పలు.. ప్రజారోగ్యానికి తిప్పలు
[ 29-04-2024]
ప్రతి గ్రామానికి వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నాడు-నేడు కింద ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం. ఉప, పట్టణ ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నా.. -
చెంతనే నీరున్నా.. చింతే నాయకా
[ 29-04-2024]
వేసవి వచ్చింది... నగర, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య పొంచిఉంది. నీటి వనరులున్నా.. నిర్వ హణ లోపంతో ప్రజలకు తాగునీరు అందడం లేదు. పథకాలున్నా.. -
జగనూ.. చెరువులను మింగేస్తున్నారు
[ 29-04-2024]
పూర్వీకులు ఎంతో ముందుచూపుతో చెరువులను ఏర్పాటుచేశారు. గొలుసుకట్టు విధానంలో ఉండడంతో వరద నివారణ సాధ్యమయ్యేది. భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీటి అవసరాలు తీరడంతో పాటు సాగుకు ఆధారంగా ఉన్నాయి. -
సంగం హామీకి సున్నం
[ 29-04-2024]
దుష్ట సంహారం నిమిత్తం పరమేశ్వరుడు వినియోగించే ధనస్సుని ‘పినాక ’అంటారు. పినాక ధారుడైన పరమశివుడిని ‘పినాకపాణి’ అని భక్తులు పూజిస్తారు. కర్ణాటక రాష్ట్రం నంది పర్వత సానువుల్లో ఉద్భవించిన నది వంపులు తిరిగి శివుడి విల్లు పినాక ఆకారంలో ఉండటంతో పెన్నానది అని పిలుస్తున్నారు. -
అక్రమాలకు పాల్పడిన ఏపీజీబీ మేనేజర్ అరెస్టు
[ 29-04-2024]
అమడగూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గతంలో మేనేజర్గా పని చేసిన కమతం పెంచల్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఆదివారం కదిరి జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెసిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి సుందరి ఎదుట హాజరు పరిచినట్లు అమడగూరు ఎస్ఐ మగ్బూల్బాషా తెలిపారు. -
సమకూరని మౌలిక వసతులు
[ 29-04-2024]
మండలంలోనే పెద్ద పంచాయతీ బ్రాహ్మణక్రాక అరుంధతి వాడలోని అంతర్గత రోడ్డు ఇది. మురుగు నీటి కాలువలు పూడి పోయాయి. దిగువ ప్రాంతాలకు మురుగు పారక..రోడ్డుపై నిల్వ ఉంది. కాలనీ వాసులు ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. -
పోలింగ్ కేంద్రాలకు అధికారుల కేటాయింపు
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం కలెక్టరేట్లో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్ను సాధారణ పరిశీలకులు నితిన్ సింగ్ బదారియ, -
వేడుకగా మహా పట్టాభిషేకం
[ 29-04-2024]
బాలాజీనగర్లోని సీతారామ మందిరంలో ఆదివారం స్వామివారికి మహా పట్టాభిషేక వేడుకలు చేపట్టారు. వేడుకల్లో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట