logo

గొంతుకోసి మహిళ హత్య

మహిళను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మూడో మైలులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.

Published : 28 Mar 2024 04:21 IST

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: మహిళను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మూడో మైలులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని వేణుగోపాల్‌నగర్‌లో నాగూరు ఆదిశేషయ్య, మస్తానమ్మ (48) నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు వెంకటేష్‌, కుమార్తెలు సునీత, దివ్య ఉన్నారు. సునీతకు సురేష్‌తో వివాహమైంది. వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ కొన్నేళ్లుగా వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో కిసాన్‌ నగర్‌కు చెందిన నెల్లూరు చంటి అనే వ్యక్తితో సునీతకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఇటీవల గొడవ జరగడంతో మాట్లాడుకోవడం లేదు. సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్న సునీత తన ఇద్దరు కుమారులతో కలిసి మూడు మైలులోని విజ్ఞేశ్వర నగర్‌లో రెండు రోజులు క్రితం ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. ఈ క్రమంలో చంటి కారులో మస్తానమ్మను తీసుకుని సునీత ఇంటికి వచ్చాడు. వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు.. మస్తానమ్మను గొంతు కోసి హత్య చేశారు. అనంతరం చంటి, సునీత అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నెల్లూరు గ్రామీణ సీఐ మారుతీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలు స్థానికంగా వైకాపా నాయకురాలిగా చలామణి అయ్యేవారు. నెల్లూరు చంటీ కూడా గతంలో ఆ పార్టీలోనే తిరిగేవాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని