బాలలకేదీ సురక్ష..?
పేదరికం, పోషకాహారం లోపంతో ఎంతో మంది బాలలు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. చదువులో వెనుకబడుతున్నారు.
అయిదేళ్లుగా గాడిన పడని వైద్యసేవలు
న్యూస్టుడే, తోటపల్లిగూడూరు, పొదలకూరు
విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం.. విద్యార్థుల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తున్నామని పదేపదే చెబుతున్న పాలకులు విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ఉద్దేశించిన బాలల సురక్ష పథకాన్ని అటకెక్కించారు. ఐదేళ్లుగా పునరుద్ధరణ జరుగుతోందని ఆశించి ఎదురుచూస్తున్న బాలలు, తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. బాలల ఆరోగ్యం బాగుంటే భావితరం ఆరోగ్యంగా ఉన్నట్లేనని నిపుణులు పలుమార్లు చెబుతున్నా పట్టించుకునే వారే లేరు.
పేదరికం, పోషకాహారం లోపంతో ఎంతో మంది బాలలు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. చదువులో వెనుకబడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చిన్నతనంలోనే బాలబాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారిలో ఏమైనా వ్యాధి లక్షణాలున్నట్లు గుర్తిస్తే తగిన చికిత్స అందించడానికి ముఖ్యమంత్రి బాలల సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి తెదేపా ప్రభుత్వం 2018 జూన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. అమల్లో కొన్ని బాలరిష్టాలను ఎదుర్కొన్న తరువాత సక్రమంగా కొనసాగింది. అప్పట్లో క్షేత్రస్థాయిలో 0 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలను ఇందులో చేర్చారు. ప్రాథమిక పాఠశాల నుంచి జూనియర్ కళాశాలల వరకు వారు వెళ్లి పరీక్షలు చేసి వివరాలు ఏరోజుకారోజు ఆన్లైన్లో పొందుపరిచేలా కార్యక్రమాన్ని చేపట్టారు. బాలబాలికల్లో తరచూ వచ్చే సుమారు 30 రకాల వ్యాధులను, లక్షణాలను బట్టి తీవ్రతను గుర్తించి తగిన చర్యలు తీసుకున్నారు. పుట్టుకతో ఉన్నవి పెరుగుదలను బట్టి వచ్చే రకరకాలుగా వ్యాధులను స్ర్కీనింగ్ చేపట్టారు. నియోజకవర్గానికి మూడు వాహనాలు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనానికి ఇద్దరు వైద్యులు, ఇద్దరు ఏఎన్ఎంలను నియమించారు. సుమారు 17 వేల మందికి ఒక వాహనం ద్వారా వైద్యసేవలందించేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రతి బృందం రోజుకు 120 మందిని పరీక్షించాలని లక్ష్యాలను నిర్దేశించారు.
అంతా కనుమరుగు..
నిర్దేశించిన లక్ష్యాలకనుగుణంగా క్షేత్రస్థాయిలో పరీక్షలు బాగానే జరిగాయి. వ్యాధుల గుర్తింపు, నిర్ధారణ బాగా చేశారు. పథకంతో వేలాది మంది బాలలు ప్రయోజనం పొందారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు పథకం బాగానే కొనసాగింది తరువాత అటకెక్కింది. దీంతో వాహనాలు రాకపోవడంతో బాలలకు పరీక్షలు నిలిచిపోయాయి. వాహనాల్లో తిరిగి వైద్య సేవలందించిన సిబ్బందికి పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించలేదని అప్పట్లో వాపోయారు.
వాహనాలు ఆగినా పరీక్షలు చేస్తున్నాం
-డాక్టర్ సుధీర్కుమార్, ఆర్బీఎస్కే జిల్లా సమన్వయకర్త
బాలసురక్ష వాహనాలు ఆగిపోయిన మాట వాస్తవమే. కొన్ని సమస్యలతో నిలిచాయి. అయినప్పటికీ రాషీˆ్ట్రయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా మా పరిధిలో వీలున్నంత వరకు బాలల ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యాధికారి పర్యవేక్షణలో ప్రతి గురువారం ఐరన్ మాత్రలు ఏఎన్ఎంలు దగ్గరుండి వేయిస్తున్నారు. వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఆనారోగ్యం కలిగినా వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో సంప్రదిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరువును కాపాడుకుందాం
[ 27-04-2024]
కావలి పట్టణంలోని మందాటి చెరువును కాపాడుకుందాం అంటూ ముసునూరు వాసులు నిరసన ర్యాలీ చేపట్టారు. -
ఇష్టంతో చదివితే కొలువులు
[ 27-04-2024]
ఇష్టంతో చదివితే కొలువులు సులువుగా వస్తాయని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ డాక్టర్ పి.గుణశేఖర్ తెలిపారు. -
తెదేపా సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం
[ 27-04-2024]
దగదర్తిలోని పెద్దపుత్తేడు గ్రామం అరుంధతి వాడలో మండల తెదేపా నాయకుడు మాలేపాటి రవీంద్ర నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
[ 27-04-2024]
వైద్యసేవలు ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వైద్యసేవలను అందించేందుకు ఎంఎల్హెచ్పీలు సిబ్బందిని నియమించారు. -
ఉన్నత విద్య.. జగన్ మిథ్య
[ 27-04-2024]
విశ్వవిద్యాలయాలు ప్రగతిపథంలో నడవాలన్నా.. విద్యార్థులు చేరేందుకు పోటీపడాలన్నా.. పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలన్నా.. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నేడు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.25కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ఓటుతో.. వైకాపాను తరిమికొడదాం
[ 27-04-2024]
‘ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి. ప్రజల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా కాదు.. -
అధికారమే అండ.. ఆక్రమణలే అజెండా!
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగునీటి కాలువలనే ఆలోచన లేకుండా కబ్జా చేస్తున్నారు. -
నిమ్మధరలు ఆశాజనకం
[ 27-04-2024]
పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.9500 పలికింది. రెండు రోజుల నుంచి నిమ్మ ధరల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. -
ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి
[ 27-04-2024]
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే పోలీసు అధికారులకు సూచించారు. -
జగనన్నా.. గొంతెండుతోందయ్యా!
[ 27-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు వట్టిపోతున్నాయి. దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకడం లేదు. గొంతులు తడారిపోతున్నాయి. -
పట్టణాభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకం: తెదేపా
[ 27-04-2024]
పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైందని తెదేపా అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో తెదేపా ఎన్నికల కార్యాలయాన్ని ఆర్యవైశ్య నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్ నేతృత్వంలో ప్రారంభించారు. -
బాలయ్యా.. మా గుండెల్లో నీవేనయ్యా!
[ 27-04-2024]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కావలి, గుడ్లూరులో పర్యటించారు. -
జగన్ సర్కార్ ఉత్తుత్తి సాయం
[ 27-04-2024]
మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది. -
వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం
[ 27-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ