మూడేళ్ల చదువు ఉపాధికి ఆదరువు
పదో తరగతి తరువాత మూడేళ్ల చదువు.. అనంతరం ఉపాధి.. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నేరుగా రెండో సంవత్సరంలో బీటెక్లో చేరే అవకాశం.. ఇది పాలిటెక్నిక్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు.
అందుబాటులో సాంకేతిక విద్య
పాలిసెట్కు దరఖాస్తుల ఆహ్వానం
న్యూస్టుడే, నెల్లూరు (విద్య): పదో తరగతి తరువాత మూడేళ్ల చదువు.. అనంతరం ఉపాధి.. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నేరుగా రెండో సంవత్సరంలో బీటెక్లో చేరే అవకాశం.. ఇది పాలిటెక్నిక్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇదో సువర్ణావకాశం. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యను డిప్లొమా స్థాయిలో విద్యార్థులకు అందిస్తోంది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇందుకు అర్హులు. మూడన్నరేళ్ల వ్యవధిలో బయోమెడికల్, రెండేళ్ల వ్యవధిలో డీ ఫార్మసీ మినహా సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, కంప్యూటర్ ఇంజినీరింగ్, సీసీపీ ఇలా మూడేెళ్ల కోర్సులు, డీసీఈ, డీఎంఈ తదితర డిప్లొమా కోర్సులకు మూడేళ్ల వ్యవధి ఉంటుంది.
పెరిగిన ఆదరణ
ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులకు ఆదరణ పెరిగింది. మూడు సంవత్సరాల కోర్సు పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఏడాది ప్రత్యేక ప్లేస్మెంట్ కార్యక్రమంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, పాలిసెట్ నిర్వహణ కన్వీనర్ విజయకుమార్ పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఉపాధి పొంది ఆర్థికంగా నిలబËడొచ్చని పలువురు విద్యావేత్తలు అంటున్నారు. జిల్లాలో నెల్లూరు, కావలి, ఆత్మకూరు, కందుకూరులో అయిదు ప్రభుత్వ, ఆరు ప్రైవేటు కళాశాలలు ఉండగా.. వీటిలో వివిధ కోర్సుల్లో దాదాపు మూడు వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.
బంగారు భవిత
విజయకుమార్, పాలిసెట్ జిల్లా కన్వీనర్
విద్యార్థులకు మూడేళ్లలో చదువుతోపాటు ఉపాధి అవకాశాలు లభించేది కేవలం పాలిటెక్నిక్లోనే. పదో తరగతిలో మంచి మార్కులు, పాలిసెట్లో ఉత్తమ ర్యాంకు సాధిస్తే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.
అయిదు కళాశాలల్లో ఉచిత శిక్షణ
జిల్లా వ్యాప్తంగా అయిదు ప్రభుత్వ, ఆరు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఇప్పటికే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష పాలిసెట్-24కు సిద్ధమవుతున్నారు. వీరికి ఈనెల 27న పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది పాలిటెక్నిక్కు సిద్ధమవుతున్న విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఉచిత శిక్షణను జిల్లాలోని అన్ని ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలల్లో అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ పిల్లల భవిష్యత్తు కోసం తెదేపాను గెలిపించండి
[ 30-04-2024]
మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా అధికారంలోకి రావాలని నెల్లూరు రూరల్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. -
పింఛన్ల నీడ.. వైకాపా చీడ
[ 30-04-2024]
-
పార్లమెంటు అభ్యర్థులకు గుర్తులు
[ 30-04-2024]
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారికి కలెక్టర్ హరినారాయణన్ ఎన్నికల గుర్తులు కేటాయించారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
[ 30-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సోమవారంతో నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. -
దగాపడ్డ రైతు దళారీకే మద్దతు!
[ 30-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుంది. జగన్ సీఎం అయ్యాక గిట్టుబాటు ధరలు లేక రైతులు కుదేలవుతున్నారు. -
ప్రభుత్వ భూములు మింగేశారు
[ 30-04-2024]
వింజమూరు మండలంలో వైకాపా నాయకులు, మద్దతుదారులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి అనుభవిస్తున్నారు. -
జగనన్నా.. ఈ ప్రాంగణాలేందన్నా!
[ 30-04-2024]
ప్రయాణికుల క్షేమమే మా లక్ష్యం.. వారికే ప్రథమ ప్రాధాన్యం.. ఇవీ ఆర్టీసీ బస్సులు.. ప్రాంగణాల్లో కనిపించే నినాదాలు. -
అగ్రిగోల్డ్ భూముల్లోని కలప అక్రమ రవాణా
[ 30-04-2024]
మండలంలోని రాచవారిపల్లి- తురకపల్లి మార్గంలో సుమారు 200 ఎకరాల్లో అగ్రిగోల్డ్ భూముల్లోని కలపను అక్రమార్కులు తరలిస్తుండగా స్థానికులు గుర్తించారు. -
పరిహారం పేరుతో జగన్నాటకం
[ 30-04-2024]
పల్లె ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఎన్నికల నియమావళి అమలుకు ఒకరోజు ముందు భూసేకరణ ప్రకటన విడుదల చేసింది. -
ఉలవపాడులో స్టిక్కర్ల దుమారం
[ 30-04-2024]
మండల కేంద్రంలో సోమవారం వైకాపా గుర్తుతో స్టిక్కర్లు అంటించడంపై దుమారం రేగింది. వివిధ జిల్లాలకు చెందిన ఆరుగురు యువకులు ద్విచక్రవాహనాలపై వచ్చి పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఇళ్లకు వైకాపా స్టిక్కర్లు అంటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన