logo

ఇటు చేరికలు.. అటు ప్రచారం

మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్‌ చండ్రా మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్‌ ప్రచారం నిర్వహించారు.

Published : 19 Apr 2024 03:50 IST

వరికుంటపాడు, న్యూస్‌టుడే: మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్‌ చండ్రా మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్‌ ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతులు ఇస్తూ ఆశీర్వదించారు. విరువూరులో ఉపసర్పంచి పాలకొల్లు భాస్కర్‌రెడ్డితోపాటు పలువురు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, కృష్ణంరాజుపల్లె సర్పంచి పి. వెంకటనారాయణ, తెల్లగొర్ల వెంకటయ్య, ముజ్జే లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. దుత్తలూరు: మండలంలోని వెంగన్నపాలెం, తెడ్డుపాడు, తిమ్మాపురం, కొత్తపేటలలో గురువారం నాయకులతో కలిసి  మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ప్రచారం నిర్వహించారు. తెదేపా మండల కన్వీనర్‌ వెంకటరత్నం, గురవారెడ్డి, ఎంపీˆటీసీˆ మాదాల రామచంద్ర, గురవయ్యనాయుడు, రవీంద్రబాబు, మల్లికార్జున, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి: తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జి.చెరువుపల్లిలో గురువారం తెదేపా, జనసేన నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. రవీంద్ర, సురేంద్ర, ఓబుల్‌రెడ్డి, కిరణ్‌, కృష్ణ, ప్రవీణరాజు, నారాయణరాజు   పాల్గొన్నారు.  జలదంకి : కాకర్ల సురేష్‌ సోదరుడు కాకర్ల సునీల్‌, మరదలు సురేఖ  తెదేపా మండల అధ్యక్షుడు పి.మధురెడ్డి ఆధ్వర్యంలో జలదంకిలో ప్రచారం చేశారు.


నేడు నిరాడంబరంగా నామినేషన్‌ వేస్తా: కృష్ణారెడ్డి

కావలి :  నిరాడంబరంగా శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్‌ వేయనున్నట్లు ఎన్డీఏ కావలి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి వెల్లడించారు. గురువారం తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలసి విలేకర్ల సమావేశంలో ఈవిషయం వెల్లడించారు. తనతోపాటు కుమార్తె సంహిత డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్నట్లు వెల్లడించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శులు మొగిలి కల్లయ్య, మలిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, లీగల్‌సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పోట్లూరి శ్రీనివాసులు, భాజపా నాయకులు గుండ్లపల్లి భరత్‌, బ్రహ్మానందం, జనసేన సాయి, దళిత నాయకులు జ్యోతి బాబురావు, అలేఖ్య, కిషోర్‌, తదితరులు పాల్గొన్నారు.


సుదర్శన నారసింహ యాగం

కందుకూరు పట్టణం : నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు దంపతులు గురువారం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో సుదర్శన నారసింహ యాగం నిర్వహించారు.  వేదమంత్రోచ్చారణల మధ్య పలు పూజలు చేశారు. ఉలవపాడుకు చెందిన పలువురు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఇంటూరి  సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు డి. వెంకట్రావు, వలేటి నరసింహం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని