వలసలతో పరేషాన్..!
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈనాడు, కామారెడ్డి
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ ఓటమికి యత్నించి ప్రస్తుతం అధికారం పోగానే చేరుతున్న భారాస నాయకుల తీరును తప్పుపడుతున్నారు. క్షేత్రస్థాయి బలోపేతం పేరుతో ఇతర పార్టీల నేతలను, కార్యకర్తలను ఆహ్వానించడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. తమకు వచ్చే పదవులు వీరు ఎగురేసుకుపోతారేమోననే భయంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో సీనియర్లు
జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్లో భారాస నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. రామారెడ్డి మండలంలో సైతం పార్టీని విడిచిపెట్టి పోయిన నేతలు మళ్లీ రావడాన్ని కార్యకర్తలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బీర్కూర్లో భారాసకు చెందిన మాజీ ప్రజాప్రతినిధిని కాంగ్రెస్లోకి చేర్చుకోవద్దంటూ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. కామారెడ్డి నియోజకవర్గంలో మాచారెడ్డి, కామారెడ్డి పట్టణ పరిధిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పార్టీలోకి తీసుకోవడంపై సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగంగా అసమ్మతి ప్రకటించకపోయినా.. అంతర్గత సమావేశాల్లో పార్టీ ముఖ్యనేతల వైఖరిని ఎండగడుతున్నారు. వలస వచ్చిన నేతలే పార్టీ కార్యక్రమాల్లో హడావుడి చేయడాన్ని ఏళ్లుగా పార్టీని పట్టుకుని ఉన్న కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఎన్నికల అనంతరం భారాస నుంచి వచ్చిన వలస నేతలే పెత్తనం చెలాయిస్తున్నారని పార్టీ కార్యకర్తలు అదిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రకటనలకే పరిమితం
స్థానిక నేతలు, కార్యకర్తల సమ్మతితోనే చేరికలు ఉంటాయని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. సీనియర్ కార్యకర్తలు, ముఖ్యనేతలకు ఏమాత్రం చెప్పకుండా కండువా కప్పేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే నీకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పి సరిపెడుతున్నారు. వలస నేతలు ఆర్థికంగా ఉండడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్టు ఎక్కడ ఎగురేసుకుపోతారో అనే ఆందోళన సీనియర్ నేతల్లో కనబడుతోంది. కామారెడ్డి నియోజకవర్గంలో నియామక పదవులు సైతం వలస నాయకులకే దక్కేలా కనపడుతున్నాయి. పార్టీ అధిష్ఠానం ఇప్పటి వరకు నియోజకవర్గానికి పార్టీ పరంగా ఇన్ఛార్జిని నియమించలేదు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్తో పాటు కామారెడ్డి నియోజకవర్గ పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. ప్రభుత్వ సలహాదారుగా అటు పాలన బాధ్యతల ఒత్తిడి కారణంగా నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన నియామక పదవుల్లో నియోజకవర్గం నుంచి ఒక్కరికి స్థానం కల్పించకపోవడంతో సీనియర్ నేతలు నిరుత్సాహానికి గురయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడప గడపకు కాంగ్రెస్
[ 27-04-2024]
మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెత్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు శనివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు