అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు
అంకాపూర్లో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి
ఆర్మూర్ గ్రామీణం, నందిపేట్ గ్రామీణం, న్యూస్టుడే: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అంకాపూర్లో ఆర్మూర్, ఆలూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆర్మూర్ నియోజకవర్గ బాధ్యుడు వినయ్కుమార్రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. కార్యకర్తలు ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజలకు కాంగ్రెస్ పథకాలు వివరించి గెలిపించాలని అన్నారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటుతో పాటు అక్కడ మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. పిల్లలకు గురుకులాల్లో విద్య అందిస్తామని చెప్పారు. నందిపేట్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. లక్కంపల్లి సెజ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల కోసం వందల ఎకరాలు సేకరిస్తే గత పాలకులు తుంగలో తొక్కారనివిమర్శించారు. తాను నలుగురికి అన్నం పెట్టినోడినని ఆహార పరిశ్రమలు తెప్పించలేనా అని వ్యాఖ్యానించారు. ‘నేను మీరనుకున్న జీవన్రెడ్డిని కానమ్మా.. ప్రజల కష్టసుఖాలు తెలిసిన జీవన్రెడ్డినమ్మా’.. అంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అనుకుంటున్నారేమో కానీ నేను అసలు సిసలు ప్రజల మనిషినంటూ అన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్రెడ్డి, జిల్లా, మండలాధ్యక్షులు మానాల మోహన్రెడ్డి, మంద మహిపాల్, సిలిండర్ లింగం, తాహెర్, ఖలీం, నాయకులు మార గంగారెడ్డి, మార చంద్రమోహన్, జీవన్, ఎంపీపీ పస్క నర్సయ్య, సాయారెడ్డి, విజయ్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు పంటకు జై
[ 21-05-2024]
తొలకరి రాగానే జూన్ మొదటి వారంలోనే పసుపు విత్తడం ఆరంభమవుతుంది. రైతులు ఇప్పటికే దుక్కిలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
మట్టి.. కనిపెట్టి
[ 21-05-2024]
ఎండాకాలం వచ్చిందంటే చాలు పొడి దుక్కుల సమయంలో మట్టి నమూనాలు సేకరించడం ఒక్కప్పుడు ఆనవాయితీగా ఉండేది. -
టెట్ ప్రారంభం
[ 21-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2024 రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు దశల్లో జూన్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. -
చరిత్ర శిథిలం.. పాలకులూ.. పట్టించుకోరా..
[ 21-05-2024]
నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. నాటి హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనమయ్యే వరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు ఎన్నో ఉద్యమాలు చేశారు. -
నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి
[ 21-05-2024]
మరో నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని పాలనాధికారి జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. -
ఫలితాలు మెరుగయ్యేనా..?
[ 21-05-2024]
ఇంటర్మీడియట్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అట్టడుగుస్థాయికి పడిపోయింది. -
ఆరోగ్యశ్రీలో అడ్డదారులు
[ 21-05-2024]
ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త ఏడాదిన్నర క్రితం ఎడపల్లి పీహెచ్సీ వైద్యాధికారిగా ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. మహబూబ్నగర్కు చెందిన జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ స్వప్నకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. -
సదరం స్లాట్.. ఇక నిరంతరం
[ 21-05-2024]
అర్హులైన దివ్యాంగులు తగిన ధ్రువపత్రాలతో ఎప్పుడైనా మీ-సేవా కేంద్రాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇప్పటి వరకు ప్రతి నెలా రెండు, నాలుగో వారాల్లో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు. -
ఓపెన్ జిమ్ను సందర్శించిన బల్దియా ఛైర్పర్సన్
[ 21-05-2024]
జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్డు-పాతబస్టాండు ప్రాంతంలోని ఓపెన్జిమ్ను పురపాలక ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సోమవారం సందర్శించారు. -
ప్రగతి పరిశీలన..
[ 21-05-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతి పనులు, సంక్షేమ పథకాలు పల్లెల్లో ఏ విధంగా అమలవుతున్నాయనే దానిపై సమగ్ర సమాచారం సేకరించి నివేదిక రూపొందించే నిమిత్తం ఎంసీహెచ్ఆర్డీ యంత్రాంగం రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఐదు గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ
-
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్
-
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్