వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం తీవ్ర పీడనంగా మారింది. రానున్న 36 గంటల్లో ఇది వాయుగుండంగా బలం పుంజుకుని ఒడిశా తీరం
భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్న జిల్లాలు మ్యాప్లో ఎరుపు, నారింజ, పసుపు రంగులో
గోపాలపూర్, న్యూస్టుడే: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం తీవ్ర పీడనంగా మారింది. రానున్న 36 గంటల్లో ఇది వాయుగుండంగా బలం పుంజుకుని ఒడిశా తీరం దాటి ఛత్తీస్గఢ్ వైపు వెళ్తుందని గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్ దాస్ ‘న్యూస్టుడే’కు చెప్పారు. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, మత్స్యకారుల వేట ఈ నెల 10 వరకు నిషేధించినట్లు వెల్లడించారు.
రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్
రాయగడ, కలహండి జిల్లాల్లో సోమవారం అతి భారీ వర్షాలు (20 సెంటీ మీటర్లకు పైగా) కురిసే సూచనలున్నందున రెడ్ అలర్ట్ ప్రకటించామన్నారు. గంజాం, గజపతి, మల్కాన్గిరి, కొరాపుట్, నవరంగపూర్, నువాపడ, బొలంగీర్, కొంధమాల్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నందున ఆరెంజ్, పూరీ, ఖుర్దా, నయాగఢ్, బౌద్ధ్, సోన్పూర్, బరగఢ్, సంబల్పూర్, కటక్, జగత్సింగ్పూర్, అనుగుల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు దాస్ తెలిపారు.
నయాగఢ్లో 23 సెంటీమీటర్ల వాన
గడిచిన 24 గంటల్లో నయాగఢ్లో 24 సెంటీమీటర్ల వాన కురిసింది. రాయగడ జిల్లా పద్మపూర్లో 18, కొంధమాల్ జిల్లా టికాబలిలో 14, కలహండి జిల్లా జయపట్నాలో 12, గజపతి జిల్లా నువాగడలో 12, కొంధమాల్ జిల్లా రైకియాలో 12, ఢెంకనాల్ జిల్లా హిందోళ్లో 12, పూరీ జిల్లా అస్తరంగలో 11, గంజాం జిల్లా సన్నాఖెముండిలో 9 సెంటీమీటర్ల వర్షం కురిసిందని దాస్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జంపివాణి కేసులో నిందితుడికి ఉరిశిక్ష
[ 26-04-2024]
మ్యుచుండే వయగఢ్ జిల్లా ఏడీజేఎంకేలో 2019లో జరిగిన జంపి వాణి కేసులో శుక్రవారం తీర్పు వెల్లడించారు. -
నీటిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి
[ 26-04-2024]
జిల్లాలోని గేప్ సమితిలోని మథని గ్రామంలో శుక్రవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. -
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM