logo

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం తీవ్ర పీడనంగా మారింది. రానున్న 36 గంటల్లో ఇది వాయుగుండంగా బలం పుంజుకుని ఒడిశా తీరం

Published : 08 Aug 2022 06:53 IST


భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్న జిల్లాలు మ్యాప్‌లో ఎరుపు, నారింజ, పసుపు రంగులో

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం తీవ్ర పీడనంగా మారింది. రానున్న 36 గంటల్లో ఇది వాయుగుండంగా బలం పుంజుకుని ఒడిశా తీరం దాటి ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్తుందని గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, మత్స్యకారుల వేట ఈ నెల 10 వరకు నిషేధించినట్లు వెల్లడించారు.

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
రాయగడ, కలహండి జిల్లాల్లో సోమవారం అతి భారీ వర్షాలు (20 సెంటీ మీటర్లకు పైగా) కురిసే సూచనలున్నందున రెడ్‌ అలర్ట్‌ ప్రకటించామన్నారు. గంజాం, గజపతి, మల్కాన్‌గిరి, కొరాపుట్‌, నవరంగపూర్‌, నువాపడ, బొలంగీర్‌, కొంధమాల్‌ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నందున ఆరెంజ్‌, పూరీ, ఖుర్దా, నయాగఢ్‌, బౌద్ధ్‌, సోన్‌పూర్‌, బరగఢ్‌, సంబల్‌పూర్‌, కటక్‌, జగత్సింగ్‌పూర్‌, అనుగుల్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు దాస్‌ తెలిపారు.

నయాగఢ్‌లో 23 సెంటీమీటర్ల వాన
గడిచిన 24 గంటల్లో నయాగఢ్‌లో 24 సెంటీమీటర్ల వాన కురిసింది. రాయగడ జిల్లా పద్మపూర్‌లో 18, కొంధమాల్‌ జిల్లా టికాబలిలో 14, కలహండి జిల్లా జయపట్నాలో 12, గజపతి జిల్లా నువాగడలో 12, కొంధమాల్‌ జిల్లా రైకియాలో 12, ఢెంకనాల్‌ జిల్లా హిందోళ్‌లో 12, పూరీ జిల్లా అస్తరంగలో 11, గంజాం జిల్లా సన్నాఖెముండిలో 9 సెంటీమీటర్ల వర్షం కురిసిందని దాస్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని