ఆభరణాలు స్వాధీనం: అయిదుగురి అరెస్టు
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలో ఇటీవల జరిగిన భారీ చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు.
స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలో ఇటీవల జరిగిన భారీ చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన నలుగురు నిందితులతోపాటు చోరీ సొత్తు కొనుగోలు చేసిన వ్యాపారిని అరెస్టు చేసి శుక్రవారం న్యాయస్థానానికి తరలించామని బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ ఎం. సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుల నుంచి సుమారు రూ.8 లక్షల విలువైన 162 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బ్రహ్మపుర సదర్ ఠాణా పరిధిలోనూ నిందితులు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని, దానిపైనా వారిని రిమాండులోకి తీసుకుని విచారిస్తామని పేర్కొన్నారు. గొళంత్రా పట్టణానికి చెందిన కాళు ప్రధాన్ (72) అనే వృద్ధుడి తాళం వేసి ఉన్న ఇంట్లో నిరుడు డిసెంబరు 22వ తేదీ రాత్రి చోరీ జరిగింది. ఇంటి తాళాలు విరిచి, అల్మరాలు తెరిచి అందులో భద్రపరిచిన 20 తులాల బంగారం ఆభరణాలు, రూ.10 లక్షల నగదు చోరీకు గురైనట్లు బాధితుడు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి బ్రహ్మపుర, పట్టపూర్, దిగపొహండి, భువనేశ్వర్లకు చెందిన నిందితుల్ని పట్టుకున్నామని ఎస్పీ ఆ ప్రకటనలో వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవీన్ మంచివారా... కాదా? సీఎం ప్రశ్న
[ 10-05-2024]
నవీన్ మంచివారా? కాదా? మమతా, మిషన్శక్తి, కాలియా, మధుబాబు పింఛన్లు, పిల్లలకు ఉపకార వేతనాలు, 5టీ స్కూళ్లు, లక్ష్మీ బస్సు సేవలు, పూరీ శ్రీ జగన్నాథ్ కారిడార్ తదితర ప్రభుత్వ కార్యక్రమాలు బాగున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించిన సీఎం ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. -
ఆయుష్మాన్ మంత్రం ఫలించేనా?
[ 10-05-2024]
ప్రస్తుత సమాజంలో ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం మరొకటి లేదన్నది అక్షరసత్యం. ప్రస్తుతం దీనినే రాష్ట్రంలో ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొని భాజపా ముందుకు దూసుకెళ్తోంది. -
బిజదలో చీలిక తెచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా యోచన: పాండ్యన్
[ 10-05-2024]
తొలివిడత పోలింగ్కు మూడు రోజుల వ్యవధి మిగిలున్న తరుణంలో బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. -
బ్రహ్మపురలో బహుముఖ పోటీ
[ 10-05-2024]
రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య, విద్యా కేంద్రమైన బ్రహ్మపుర అసెంబ్లీ నియోజకవర్గం కీలకమైనది. -
చందన యాత్రకు పూరీ సన్నద్ధం
[ 10-05-2024]
పూరీలో జగన్నాథుని చంద్రనయాత్ర, జల క్రీడలకు తెరలేచింది. శుక్రవారం అక్షయ తృతీయ. -
ఓలీవుడ్ నటులతో భాజపా అభ్యర్థి ప్రచారం
[ 10-05-2024]
బ్రహ్మపుర అసెంబ్లీ భాజపా అభ్యర్థి కె.అనిల్కుమార్ గురువారం నగరంలో సాంస్కృతిక బృందాలతో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
ఒడిశా వాసులు అభివృద్ధి ట్రైలర్ చూశారు
[ 10-05-2024]
ఒడిశా వాసులింత వరకు అభివృద్ది ట్రైలర్ మాత్రమే చూశారని, రానున్న అయిదేళ్లలో పూర్తి సినిమా (అభివృద్ధి పనులు) చూడగలుగుతారని కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. -
నిబంధనలు గాలికొదిలేస్తున్న కాంగ్రెస్
[ 10-05-2024]
చిన్నారులతో ఎన్నికల ప్రచారం, అనధికారికంగా ఓటరు వివరాలు సేకరణ చట్ట విరుద్ధమని ఎన్నికల సంఘం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం