ఆభరణాలు స్వాధీనం: అయిదుగురి అరెస్టు
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలో ఇటీవల జరిగిన భారీ చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు.
స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలో ఇటీవల జరిగిన భారీ చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన నలుగురు నిందితులతోపాటు చోరీ సొత్తు కొనుగోలు చేసిన వ్యాపారిని అరెస్టు చేసి శుక్రవారం న్యాయస్థానానికి తరలించామని బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ ఎం. సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుల నుంచి సుమారు రూ.8 లక్షల విలువైన 162 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బ్రహ్మపుర సదర్ ఠాణా పరిధిలోనూ నిందితులు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని, దానిపైనా వారిని రిమాండులోకి తీసుకుని విచారిస్తామని పేర్కొన్నారు. గొళంత్రా పట్టణానికి చెందిన కాళు ప్రధాన్ (72) అనే వృద్ధుడి తాళం వేసి ఉన్న ఇంట్లో నిరుడు డిసెంబరు 22వ తేదీ రాత్రి చోరీ జరిగింది. ఇంటి తాళాలు విరిచి, అల్మరాలు తెరిచి అందులో భద్రపరిచిన 20 తులాల బంగారం ఆభరణాలు, రూ.10 లక్షల నగదు చోరీకు గురైనట్లు బాధితుడు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి బ్రహ్మపుర, పట్టపూర్, దిగపొహండి, భువనేశ్వర్లకు చెందిన నిందితుల్ని పట్టుకున్నామని ఎస్పీ ఆ ప్రకటనలో వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Nitin Gadkari: ₹10కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రికి బెదిరింపు కాల్.. గడ్కరీ ఇంటి వద్ద భద్రత పెంపు!
-
Movies News
Payal Rajput: పాయల్ రాజ్పుత్కు అస్వస్థత.. అయినా షూట్లో పాల్గొని!
-
Sports News
Sachin Tendulkar: సచిన్ పాదాలపై పడి క్షమాపణలు కోరిన పాక్ మాజీ పేసర్..కారణమేమిటంటే?
-
General News
Delhi liquor Scam: ముగిసిన విచారణ.. 8.30గంటల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?