నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
కోటదుర్గమ్మ దేవస్థానంలో సోమవారం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరిపేందుకు సర్వం సిద్ధం చేశారు. ప్రతి రోజూ రాత్రివేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
నిజరూప దర్శనంలో అమ్మవారు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
పాలకొండ, గ్రామీణం, న్యూస్టుడే: కోటదుర్గమ్మ దేవస్థానంలో సోమవారం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరిపేందుకు సర్వం సిద్ధం చేశారు. ప్రతి రోజూ రాత్రివేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
భారీ బందోబస్తు.. నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డీఎసీˆ్ప ఎం.శ్రావణి ఆధ్వర్వంలో 200 మందితో భద్రత కల్పించనున్నారు. సీˆఐ కె.మురళీధర్తోపాటు ఎనిమిది మంది ఎస్సైలు, 22 మంది ఏఎస్సై, హెచ్సీలు, 53 మంది కానిస్టేబుళ్లు, 35 మంది హోంగార్డులు ఉత్సవ బందోబస్తులో విధులు నిర్వహించనున్నారు. దీంతోపాటు మూడు ప్రత్యేక పోలీసు బృందాలు రానున్నాయి.
రాటతో ఆరంభం
దసరా శరన్నవరాత్రులకు ప్రారంభం రోజున రాటతో అమ్మవారి ఉత్సవాలను ప్రారంభిస్తారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి నిజరూప దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది. మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగానే తరలివస్తారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు సిద్ధం చేస్తున్న వేదిక
షామియానాలు.. అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి దేవదాయశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన రహదారిలోని సచివాలయం పక్క నుంచి దర్శనాలకు వీలుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉచిత, ప్రత్యేక, వీఐపీలకు వేర్వేరుగా దర్శనాలు చేసుకునే వీలు కల్పించారు. ఎండల నుంచి రక్షణ పొందేందుకు షామియానాలు సిద్ధం చేశారు.
ట్రాఫిక్ మళ్లింపు.. ప్రధాన రహదారిలో ట్రాఫిక్ను మళ్లించనున్నారు. రాజాం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను అన్నవరం మీదుగా పట్టణంలోనికి అనుమతిస్తారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.
హంసవాహన రథం సిద్ధం
సాలూరు, న్యూస్టుడే: పట్టణంలోని శివాలయం, కామాక్షి అమ్మవారు, వాసవి కన్యకా పరమేశ్వరి, జ్ఞాన సరస్వతిదేవి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలకు అంతా సిద్ధం చేశారు. శివాలయం వద్ద పుష్కరిణిలో అమ్మవారికి తెప్పోత్సవం, రథోత్సవం నిర్వహించేందుకు హంసవాహనం, రథం అలంకరించారు. ఆటోటాక్సీ స్టాండులో మోటారు కార్మికులు దేవీ నవరాత్రి ఉత్సవాలకు మండపాన్ని సిద్ధం చేశారు. దసరా పండగ శోభ పట్టణంలో ఉట్టిపడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్లు కట్టలేక పోయారు
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార పరివాహక ప్రాంత రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని సీఎం జగన్మోహనరెడ్డి నెరవేర్చలేదు. -
9న చీపురుపల్లికి చంద్రబాబు
[ 07-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా చీపురుపల్లిలో 9న ప్రజాగళం భారీ బహిరంగ సభకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కానున్నట్లు తెదేపా విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. -
మా ‘గడప’కొస్తే.. తరిమికొడతాం!!
[ 07-05-2024]
నమ్మి ఓట్లేశాం.. అభివృద్ధి చేస్తారని భావించాం.. మా పిల్లలకు భవిష్యత్తునిస్తారని కలలుగన్నాం.. కానీ ఈ ఐదేళ్లలో ఆక్రమణలపై పెట్టిన దృష్టి మా కష్టాలపై పెట్టలేదు..మా అవస్థలను చూడలేదు.. ఉద్యోగాల కోసం మా యువకులు పడుతున్న శ్రమను గుర్తించలేదు. -
నోట్లతో ఎర.. బెదిరింపులు జర
[ 07-05-2024]
పార్వతీపురం నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలను ఎన్నికల విధులకు తీసుకున్నారు. వారికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేశారు. -
ఊడిపోతున్నాయ్... పంకా రెక్కలు
[ 07-05-2024]
పంకా రెక్కలు ఊడిపోతున్నాయ్.. ఇంతకాలం వైకాపాను నమ్మి తామేం కోల్పోయామో ఆ పార్టీ నేతలు, శ్రేణులతో పాటు ప్రజలు గ్రహించారు. -
దేవుడికే ‘జగన్’ శఠగోపం
[ 07-05-2024]
శతాబ్దాల చరిత్ర సొంతం.. ఉట్టిపడే శిల్పకళా సౌందర్యం.. భక్తకోటికి దైవసాన్నిహిత్యం.. ఇలా ఎన్నో విశిష్టతల సమాహారం.. అందుకే ఉభయ జిల్లాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలది ప్రత్యేక స్థానం.. -
పోస్టల్ బ్యాలెట్లు.. ఉద్యోగుల ఇక్కట్లు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలెట్లో భాగంగా ఓట్లేసేందుకు ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జేఎన్టీయూ గురజాడ విద్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఈ పరిస్థితి కనిపిస్తోంది. -
రాజీనామా చేసిన వాలంటీర్లకు జీతాలు చెల్లింపు
[ 07-05-2024]
ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు పెద్ద ఎత్తున రాజీనామా చేస్తూ వస్తున్నారు. ఇలా ఉద్యోగాలు వదులుకున్న వారికి గౌరవవేతనం చెల్లించకూడదు. -
జగనన్న కాలనీల్లో బినామీలు!
[ 07-05-2024]
ఉభయ జిల్లాల్లోని జగనన్న కాలనీల్లో బినామీలు పాగా వేస్తున్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులోనే రాజకీయాలు, ఒత్తిళ్లు చోటు చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?