ఖాతాలన్నారు.. కాజేశారు
కూలి పనులు చేసుకునే వారికి మాయమాటలు చెప్పి మోసం చేసిందో ప్రైవేటు పొదుపు సంస్థ.
ప్రైవేటు పొదుపు కార్యాలయం టోకరా
ఆందోళనలో ఖాతాదారులు
కార్యాలయం బోర్డు ఎత్తేశారిలా..
పాలకొండ/గ్రామీణం, న్యూస్టుడే: కూలి పనులు చేసుకునే వారికి మాయమాటలు చెప్పి మోసం చేసిందో ప్రైవేటు పొదుపు సంస్థ. పాలకొండ ప్రధాన రహదారిలోని నాగవంశంవీధి కూడలిలో నాలుగేళ్ల కిందట ముద్రా అగ్రికల్చర్, స్కిల్ డెవలెప్మెంట్ మల్టీస్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరిట కార్యాలయాన్ని పెట్టింది. పలువురు సిబ్బందిని నియమించి రోజువారీ, నెలవారీ పొదుపు ఖాతాలను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా ప్రచారం చేయడంతో ప్రజలు సైతం నమ్మకంగా ఖాతాలు తెరిచారు. సభ్యత్వం తీసుకున్న వారికి రుణ సదుపాయం ఇస్తామని చెప్పడంతో ఎక్కువ మంది వ్యాపారులు, చిరు వ్యాపారులు, సామాన్యులు, రోజువారీ కూలీలు చేరారు. ఏడాది కాల పరిమితితో 8.33 శాతం వడ్డీ, రెండేళ్లకు పది శాతం, 60 నెలలైతే 11 శాతమంటూ ఆకర్షణీయమైన ప్రకటనలిచ్చారు.
ఏడాదిగా మూత : పాలకొండతో పాటు సమీప మండలాలకు చెందిన వందలాది మంది ఈ సంస్థలో పొదుపు చేశారు. కొందరు రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు కట్టినట్లు సమాచారం. ప్రారంభంలో కొందరికి బాగానే డబ్బులిచ్చి నమ్మించారు. రెండేళ్ల అనంతరం ఆపేశారు. బాధితులు నిలదీయగా.. డబ్బులిస్తామని చెప్పారు. ఏడాదిగా కార్యాలయాన్ని మూసేశారు. వసూళ్లకు వచ్చిన సిబ్బంది కూడా మాయమయ్యారు. చరవాణులు కూడా స్పందించడం లేదు. ఈక్రమంలో పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
ఫిర్యాదులు అందలేదు
సంస్థపై ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పట్టణ ఎస్సై బి.శివప్రసాద్ తెలిపారు. ఖాతాదారులు ముందుకొస్తే కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆందోళనగా ఉంది ..
నాగవంశంవీధి కూడలిలో నేను కొబ్బరి బొండాలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. సమీపంలో ముద్రా పేరిట సంస్థ తెరవడంతో తెలిసిన వారి ద్వారా ఖాతా తెరిచాను. రూ.18 వేల వరకు కట్టాను. కొన్ని రోజులుగా కార్యాలయానికి వెళ్తుంటే మూసి ఉంటుంది. ఏం చేయాలో తెలియడం లేదు.
బి.సూరి, చిరువ్యాపారి
నమ్మించారు..
కేంద్ర ప్రభుత్వ సంస్థగా నమ్మించారు. దీంతో 207 రోజులు పాటు రోజుకు 200 చొప్పున చెల్లించాను. ప్రస్తుతం ఆ కార్యాలయ సిబ్బంది అందుబాటులో లేరు. ఫోన్లు సైతం పనిచేయడం లేదు. నా స్నేహితులు కూడా ఇందులో చేరారు.
పి.రమేష్, వ్యాపారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే గిరిజన సమస్యల పరిష్కారం
[ 30-04-2024]
తెదేపా అధికారంలోకి వస్తేనే గిరిజనుల కష్టాలు తీరుతాయని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. -
ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
[ 30-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు యంత్రాంగానికి సహకరించాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడు ప్రమోద్కుమార్ మెహర్ద అన్నారు. -
అందరూ నన్ను తిట్టుకుంటే.. మీరు ఓట్లు దండుకుంటారా..
[ 30-04-2024]
ఒకటా.. రెండా.. 26 నెలలుగా నన్ను ఏ ఒక్క నాయకుడూ నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. నాపై రాళ్లు తేలి.. గుంతలుగా మారడంతో ఎందరో ప్రయాణికులు అదుపుతప్పి నన్నే తిట్టుకున్నారు. -
వైకాపా నుంచి భారీగా వలసలు
[ 30-04-2024]
మండలంలోని చెముడు వైకాపా ఎంపీటీసీ సభ్యుడు చింతల గోపాలకృష్ణ సోమవారం తెదేపాలో చేరారు. సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో మండల అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాలనాయుడు కండువా వేసి ఆహ్వానించారు. -
పైసాచికత్వం
[ 30-04-2024]
మే నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒకటో తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అనుబంధమన్నావు అనాధలా వదిలేశావు!
[ 30-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన సాలూరులో వేల కుటుంబాలకు జీవనాధారం ఆటోనగర్. పద్నాలుగేళ్ల కిందట దీనికి బీజం పడింది. ఇది అభివృద్ధి చేస్తే పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరడంతో పాటు కార్మికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. -
నీకు చేతులెలా వచ్చాయమ్మా?
[ 30-04-2024]
మానవత్వం మంటగలిసిపోతోంది.. కళ్లు తెరవని పసిగుడ్డును దారుణంగా చెత్తలో పడేసిన ఘటన మెంటాడ మండలంలో చోటుచేసుకుంది. ఆండ్ర గ్రామానికి వెళ్లే వంతెన కింద చెత్తలో పసికందు మృతదేహం కనిపించింది. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
[ 30-04-2024]
మండలంలోని రాజాపులోవ గ్రామానికి చెందిన వివాహిత చందక పుష్ప బలవన్మరణానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. -
రాజీనామాకు ఒక్కరోజే గడువట!
[ 30-04-2024]
వాలంటీర్లంతా మే 1 లోగా రాజీనామా సమర్పించాలని అధికార పార్టీ ఒత్తిడి చేస్తోంది. ఈమేరకు స్థానిక నాయకులు వారిని కలిసి..
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ను కలిసిన సీఎం మాన్.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్