రోడ్లు లేవు.. సేవలూ కానరావు
రైతులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీలు ఆదాయ వనరుగానే మిగిలాయి. చెక్పోస్టుల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతున్నా కనీస సేవలు కూడా అందించలేని పరిస్థితి నెలకొంది.
ఏఎంసీలకు ఆదాయమే లక్ష్యమా!!
పాలకొండలో అధ్వానంగా గోదాములు
పాలకొండ, న్యూస్టుడే: రైతులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీలు ఆదాయ వనరుగానే మిగిలాయి. చెక్పోస్టుల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతున్నా కనీస సేవలు కూడా అందించలేని పరిస్థితి నెలకొంది.
మన్యం జిల్లాలో పార్వతీపురం, పాలకొండ, సాలూరు, కురుపాంలో మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. సెస్సుల రూపంలోనూ వస్తోంది. పార్వతీపురం మార్కెట్ కమిటీ ద్వారా రూ.4.64 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.1.98 కోట్లు, సాలూరులో రూ.2.79 కోట్లకు రూ.2.28 కోట్లు, కురుపాంలో రూ.2.14 కోట్లకు రూ.1.29 కోట్లు, పాలకొండలో రూ.2.51 కోట్లకు రూ.2.08 కోట్లు వసూలైంది.
గతంలో మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహించేవారు. ఇందుకు రూ.20 వేలు వ్యయం చేసేవారు. గ్రామాల్లో ఉన్న రైతుల మూగజీవాలు రోగాలు బారిన పడితే పట్టణ ప్రాంతాలకు తరలించకుండా గ్రామాలకే వెళ్లి వైద్యసేవలు అందించేవారు. 2020 నుంచి వైద్య శిబిరాలు ఆగాయి.
పొలానికి వెళ్లేది ఎలా?
పొలాల నుంచి పంటలు రవాణా చేసేందుకు అనువుగా ఏఎంసీల ఆధ్వర్యంలో లింకురోడ్లు నిర్మించేవారు. ప్రస్తుతం ఇవీ కానరావడం లేదు. కొన్నేళ్ల కిందట ప్రతిపాదించినా నేటికీ అమలుకు నోచుకోలేదు. జిల్లాలోని నాలుగు మార్కెట్ కమిటీల పరిధిలో ఏడు ప్యాకేజీలుగా పనులు విభజించారు. 54 పనుల్లో భాగంగా 160 కిలోమీటర్ల మేర రహదారులు మెరుగుపర్చేందుకు నిర్ణయించారు. ఇందుకోసం రూ.33.76 కోట్లు వ్యయం చేసేందుకు అంచనాలు వేశారు. ప్రతిపాదనలు చేసి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ అమలుకు నోచుకోలేదు. పంచాయతీరాజ్ అధికారుల ఆధ్వర్యంలో పలుమార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. దీంతో ఈ పనులు నాబార్డు ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. నేటికీ రహదారులు మాత్రం మెరుగుపడలేదు. జిల్లాలోని ఏఎంసీల పరిధిలో 29 గోదాములు ఉన్నాయి. వీటి సామర్థ్యం 19,760 టన్నులు. ఇందులో తొమ్మిది గోదాములు మరమ్మతులకు గురయ్యాయి.
లింకు రోడ్లకు ప్రతిపాదించాం
- ఎల్.అశోక్, ఏడీ మార్కెటింగ్ శాఖ
జిల్లాలో మార్కెట్ కమిటీల పరిధిలో లింకురోడ్లకు ప్రతిపాదించాం.పంచాయతీరాజ్ అధికారుల పర్యవేక్షణలో ఇవి ఉన్నాయి. పశు వైద్య శిబిరాలకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోతలరాయ.. ఎత్తిపోతల నీరేదయ్యా
[ 27-04-2024]
ముఖ్యమంత్రి జగన్కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు. -
నామపత్రాల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటరీ, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం వరకు దాఖలైన నామపత్రాలను రిటర్నింగ్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు. -
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
[ 27-04-2024]
వైకాపా అరాచక పాలనకు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిని కొత్తపల్లి గీత, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. -
వైనాట్ 175 కాదు.. వైకాపాకు 17
[ 27-04-2024]
జనసేన స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్పాలకొండ, గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో కూటమి గెలుపు తథ్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని జనసేన స్టార్ క్యాంపెయినర్, సినీనటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు