మన్యం కుర్రోడు సివిల్స్ కొట్టాడు
మన్యంలో అతనిదో మారుమూల ప్రాంతం.. అక్కడే విద్యాభ్యాసం. పది పాసైన తర్వాత సివిల్స్లో చేరాలని కలలుగన్నారు.
తల్లిదండ్రులు వెంకటరత్నం, విజయ్కుమార్తో పృథ్వీరాజ్కుమార్
పార్వతీపురం, న్యూస్టుడే మన్యంలో అతనిదో మారుమూల ప్రాంతం.. అక్కడే విద్యాభ్యాసం. పది పాసైన తర్వాత సివిల్స్లో చేరాలని కలలుగన్నారు. అనుకున్నదే తడవుగా ప్రణాళికలు అమలు చేశారు. లక్ష్యం చేరుకునే క్రమంలో రెండుసార్లు ఓటమి ఎదురైనా వెనక్కి తగ్గకుండా అడుగులు ముందుకు వేశారు. మూడో ప్రయత్నంలో జాతీయస్థాయిలో 493 ర్యాంకుతో ప్రతిభ చాటారు కురుపాంకు చెందిన 23 ఏళ్ల దొనక పృథ్వీరాజ్కుమార్ జిల్లా యువతకు ఆదర్శంగా నిలిచారు.
తల్లిదండ్రులే ఆదర్శం..
పృథ్వీరాజ్కుమార్ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. తండ్రి విజయ్కుమార్ పార్వతీపురం మండలంలోని ఎమ్మార్నగర్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి వెంకటరత్నం అదే పాఠశాలలో రికార్డు అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. స్వగ్రామం కురుపాంలోనే పృథ్వీరాజ్కుమార్ ప్రాథమిక విద్యను అభ్యసించారు. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా పార్వతీపురం రావడంతో పదో తరగతి ఓ ప్రైవేటు పాఠశాలలో పూర్తి చేశారు. అమ్మానాన్నను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని భావించారు. సివిల్స్ లక్ష్యంగా చేసుకొని ఇంటర్మీడియట్లో హెచ్పీజీ(హిస్టరీ, పాలిటిక్స్, జాగ్రఫీ) గ్రూపు తీసుకున్నారు. సాంఘికశాస్త్ర అంశాలతో డిగ్రీని హైదరాబాద్లో పూర్తి చేసి అక్కడే ఐఏఎస్ అకాడమీలో శిక్షణ పొందారు.
రోజూ ఎనిమిది గంటలు..
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ను ప్రధానాంశంగా ఎంచుకున్న పృథ్వీరాజ్ తొలి ప్రయత్నం విఫలమయ్యారు. రెండో సారి రాసిన పరీక్షలో భాగంగా గతేడాది ముఖాముఖి వరకు వెళ్లినా సరైన ఫలితం రాలేదు. మూడోసారి మెరుగైన ర్యాంకుతో సత్తా చాటారు. తన తండ్రి విధానాలు, ఆయనలోని నైపుణ్యాలను చూసి అఖిల భారత స్థాయిలో పరీక్షలకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నట్లు పృథ్వీరాజ్కుమార్ తెలిపారు. రోజుకు 8 గంటలు ప్రణాళికతో చదివానని, మూడోసారి ముఖాముఖిపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెప్పారు. అక్క పూజిత సహకారం, తల్లిదండ్రుల దిశానిర్దేశంతో సన్నద్ధమైనట్లు చెప్పారు. విద్యావ్యవస్థ మెరుగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పృథ్వీరాజ్కుమార్ పేర్కొన్నారు. కురుపాం నుంచి మొట్టమొదట సివిల్స్ సాధించిన యువకుడిగా తమ కుమారుడు నిలవడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు విజయ్కుమార్, వెంకటరత్నం ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం తమ జీవితాశయాన్ని తీర్చిందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే గిరిజన సమస్యల పరిష్కారం
[ 30-04-2024]
తెదేపా అధికారంలోకి వస్తేనే గిరిజనుల కష్టాలు తీరుతాయని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. -
ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
[ 30-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు యంత్రాంగానికి సహకరించాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడు ప్రమోద్కుమార్ మెహర్ద అన్నారు. -
అందరూ నన్ను తిట్టుకుంటే.. మీరు ఓట్లు దండుకుంటారా..
[ 30-04-2024]
ఒకటా.. రెండా.. 26 నెలలుగా నన్ను ఏ ఒక్క నాయకుడూ నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. నాపై రాళ్లు తేలి.. గుంతలుగా మారడంతో ఎందరో ప్రయాణికులు అదుపుతప్పి నన్నే తిట్టుకున్నారు. -
వైకాపా నుంచి భారీగా వలసలు
[ 30-04-2024]
మండలంలోని చెముడు వైకాపా ఎంపీటీసీ సభ్యుడు చింతల గోపాలకృష్ణ సోమవారం తెదేపాలో చేరారు. సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో మండల అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాలనాయుడు కండువా వేసి ఆహ్వానించారు. -
పైసాచికత్వం
[ 30-04-2024]
మే నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒకటో తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అనుబంధమన్నావు అనాధలా వదిలేశావు!
[ 30-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన సాలూరులో వేల కుటుంబాలకు జీవనాధారం ఆటోనగర్. పద్నాలుగేళ్ల కిందట దీనికి బీజం పడింది. ఇది అభివృద్ధి చేస్తే పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరడంతో పాటు కార్మికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. -
నీకు చేతులెలా వచ్చాయమ్మా?
[ 30-04-2024]
మానవత్వం మంటగలిసిపోతోంది.. కళ్లు తెరవని పసిగుడ్డును దారుణంగా చెత్తలో పడేసిన ఘటన మెంటాడ మండలంలో చోటుచేసుకుంది. ఆండ్ర గ్రామానికి వెళ్లే వంతెన కింద చెత్తలో పసికందు మృతదేహం కనిపించింది. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
[ 30-04-2024]
మండలంలోని రాజాపులోవ గ్రామానికి చెందిన వివాహిత చందక పుష్ప బలవన్మరణానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. -
రాజీనామాకు ఒక్కరోజే గడువట!
[ 30-04-2024]
వాలంటీర్లంతా మే 1 లోగా రాజీనామా సమర్పించాలని అధికార పార్టీ ఒత్తిడి చేస్తోంది. ఈమేరకు స్థానిక నాయకులు వారిని కలిసి..
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై