మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
ఆంధ్రా దారులు ఇంత ఘోరమా.. ఈ మాట ఎవరన్నా తల దించుకోవాల్సిందే.. మన దగ్గర రోడ్డుకు ఒడిశా వారు వచ్చి మరమ్మతులు చేస్తుంటే అంత కన్నా.. సిగ్గు ఏముంటుంది. మన పాలకుల చేతగాని తనానికి ఇదే నిదర్శనం.
న్యూస్టుడే, కొమరాడ: ఆంధ్రా దారులు ఇంత ఘోరమా.. ఈ మాట ఎవరన్నా తల దించుకోవాల్సిందే.. మన దగ్గర రోడ్డుకు ఒడిశా వారు వచ్చి మరమ్మతులు చేస్తుంటే అంత కన్నా.. సిగ్గు ఏముంటుంది. మన పాలకుల చేతగాని తనానికి ఇదే నిదర్శనం. ఈ అయిదేళ్లలో ఒకసారి మాత్రమే మరమ్మతులు చేయడం గమనార్హం.
రాష్ట్ర రహదారి-36 విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.. విశాఖ నుంచి పార్వతీపురం, కొమరాడ మీదుగా ఒడిశా, ఛత్తీస్గఢ్ వరకు ఉన్న ఈ మార్గంలో రోజూ వేల సంఖ్యలో లారీలు ప్రయాణిస్తాయి. ఒడిశా వరకు వందల సంఖ్యలో నాలుగు చక్రాలు, ద్విచక్ర వాహనాలు, బస్సులు వెళ్తాయి. మన్యం పరిధిలో కూనేరు నుంచి పార్వతీపురం వరకు మార్గం గోతులతో నిండిపోయింది. ఎప్పుడు ఏ వాహనం ప్రమాదానికి గురవుతుందో, మరమ్మతులతో ఆగిపోతుందో తెలియని పరిస్థితి. మన పరిధిలో రోడ్డు దాటి ఒడిశాలో అడుగుపెడితే హమ్మయ్య బతికాం అనుకుంటారు. ఇదే మార్గంలో అయిదు కి.మీ పరిధిలో మూడు రైల్వే గేట్లు ఉన్నాయి. ఇక్కడ పై వంతెనల నిర్మాణం గురించి కనీసం పట్టించుకున్న నేతలే కరవయ్యారు.
కొమరాడ శివాలయం వద్ద గోతుల్లో చేరిన నీటిలో చోదకుల పాట్లు
వర్షాకాలంలో నరకమే
వర్షాకాలంలో రోడ్డంతా చెరువును తలపిస్తుంది. గోతుల మధ్యలో లారీలు ఇరుక్కుపోయి గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఆ సమయంలో ట్రాఫిక్ను సరిచేయడానికి, జేసీబీలను తీసుకొచ్చి వాహనాలను బయటకు తీయించడానికి పోలీసులకు తలకు మించిన భారమవుతోంది.
ఈ పాపం సర్కార్దే
- 2017 డిసెంబరు 7న పూడేసుకు చెందిన గర్భిణి ఊర్మిళ ఆటోలో ప్రసవించింది. బిడ్డ సగం వరకు బయటకు వచ్చి అలా ఉండిపోవడంతో పార్వతీపురం ఆసుపత్రికి తరలించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది సూచించారు. అదే ఆటోలో పార్వతీపురం తరలిస్తుండగా అర్తాం రైల్వే గేటు అడ్డుపడింది. అప్పుడు ఆమె ప్రసవవేదనతో బాధపడింది. ప్రాంతీయ ఆసుపత్రికి చేరిన వెంటనే చికిత్స అందించడంతో తల్లి బిడ్డ ఆరోగ్యంగా బయటపడ్డారు.
- పూడేసుకు చెందిన ఓ గర్భిణి భర్తతో ద్విచక్ర వాహనంపై ఏరియా ఆసుపత్రికి వస్తుండగా బంగారంపేట గొయ్యి తప్పించే ప్రయత్నంలో ఇద్దరూ కింద పడిపోయారు. అదే సమయంలో లారీ రావడంతో గర్భిణిపై నుంచి వెళ్లిపోవడంతో చనిపోయింది.
- గతేడాది జనవరి 2న జాకూరు సరుగుగూడ మధ్యలో ట్రక్కర్ బోల్తా పడింది. సంఘటన స్థలంలో ఒకరు చనిపోగా, కొన ఊపిరితో ఉన్న ఇంకొకరిని పార్వతీపురం ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడు. అదే రహదారి బాగుంటే ఆసుపత్రికి తీసుకెళ్తే బతికేవాడని బంధువులు అన్నారు.
- జనవరి 23న చోళపదం శివాలయం మలుపు వద్ద లారీ ఆటోను ఢీకొట్టింది. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, జిల్లా ఆసుపత్రికి తీసుకొస్తున్న సమయంలో మరొకరు ప్రాణాలు విడిచారు. గతుకుల రహదారి కావడంతో అత్యవసర వాహనాలు వేగంగా రాలేని పరిస్థితితో చనిపోయాడు.
- ఫిబ్రవరి 17న కొమరాడ వద్ద రెండు లారీలు ఢీకొని ఒక వాహనంలో చోదకుడు ఇరుక్కుపోయాడు. ఆయన్ని బయటకు తీయడానికి పోలీసులు, స్థానికులు విశ్వప్రయత్నం చేయగా చివరికి తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. గోతులే ఈ ప్రమాదానికి కారణం.
- మార్చి 1న అర్తాం వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి గుంతలో దిగి ఒక లారీ బోల్తా పడింది.
ఇక్కడి వారికి చేతకాక..
గతంలో రాయగడ ఒడిశా లారీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కొండబాబు, జానకి రామయ్య ఆధ్వర్యంలో కొమరాడ మండలం ఇందిరానగర్ వద్ద గోతులను నాలుగు లారీలతో రాళ్లు, డస్ట్, మట్టి తీసుకొచ్చి కప్పారు.ఇందుకు రూ.50 వేలు ఖర్చు చేశారు.
- కొమరాడ శివాలయం, జూనియర్ కళాశాల దిగువన, గుమడ వద్ద తెదేపా, సీపీఎం నాయకులు బత్తుల శ్రీను, కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో సొంత నిధులతో లారీల్లో డస్ట్ను తీసుకొచ్చి పెద్దపెద్ద గుంతలను కప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా రంగుల పిచ్చితో రూ.2300 కోట్లు దుబారా: పవన్ కల్యాణ్
[ 02-05-2024]
రంగుల పిచ్చిలో వైకాపా ప్రభుత్వం రూ.2,300 కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. -
ఆరేళ్ల నుంచి అసంపూర్తిగానే పంచాయతీ భవనం
[ 02-05-2024]
తెదేపా ప్రభుత్వ పాలనలో ప్రారంభమైన బలిజిపేట మండలంలోని వెంగాపురం గ్రామపంచాయతీ భవనం ఆరేళ్ల కిందట నుంచి నేటికీ పునాదులతోనే మిగిలిపోయింది. -
పింఛను దారుల అవస్థలు
[ 02-05-2024]
బలిజిపేట యూనియన్, స్టేట్బ్యాంకు, విశాఖ గ్రామీణ బ్యాంకుశాఖలు గురువారం సామాజిక పింఛనుదారులతో కిటకిటలాడాయి. -
రక్కసుడక్కడ.. ఇసుకాసురులిక్కడ!!
[ 02-05-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఇసుక తోడేళ్లు నదులపై పడ్డాయి.. ఈ ఐదేళ్లూ వాటిని గుల్ల చేసేశాయి.. నిత్యం టన్నుల మేర తవ్వేస్తూ తరలించుకుపోయాయి.. రూ.కోట్లలో లాభాలు ఆర్జించాయి.. -
నీ జమానాలో అక్కాచెల్లెమ్మలు బక్కచిక్కారు
[ 02-05-2024]
మైకు కనిపిస్తే చాలు... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఎక్కడా లేని బంధుత్వాలు.. ఆప్యాయతలు.. తెగపుట్టుకొస్తాయి. ఏ వేదికపై మాట్లాడినా అక్కాచెల్లెమ్మలు.. నా ఎస్టీలు.. నా ఎస్సీలు.. గిరిజనులు, మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామంటూ మాటలతో ఊదరగొట్టేస్తారు. -
నేడు పాలకొండలో వారాహి యాత్ర
[ 02-05-2024]
పాలకొండ పట్టణంలో గురువారం జనసేన అధినేత పవన్కల్యాణ్ విజయ వారాహి యాత్ర జరగనుంది. ఈమేరకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీరఘట్టం ప్రధాన రహదారిలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. -
వీరిని చూస్తుంటే బాధని‘పింఛన్’
[ 02-05-2024]
సామాజిక భద్రత పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులకు కష్టాలు వచ్చి పడ్డాయి. -
మన్యంలో ‘దారి’ద్య్రమిది..
[ 02-05-2024]
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్, మంత్రులు చెబుతున్నా మన్యంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఐదేళ్లలో గిరిశిఖర గ్రామాల రోడ్లపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో దారులు అధ్వానంగా మారాయి. -
అంతా ఓకేనా.. ఓ సెల్ఫీ తీసుకుందాం
[ 02-05-2024]
సాలూరు మండలం కురుకుట్టి, సారిక పంచాయతీల్లో బుధవారం ప్రచారం చేసిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణితో పలువురు యువతులు స్వీయ చిత్రాలు తీసుకొని సందడి చేశారు. -
నీకు తప్ప.. రైతుకు ఏదీ భరోసా
[ 02-05-2024]
‘ఈ కేంద్రాల నుంచే వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలు అందుతాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు ప్రభుత్వమే గ్యారెంటీ ఉంటుంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాయి. -
ఒకటి పోయె.. రెండు వచ్చె
[ 02-05-2024]
సామాజిక భద్రత పింఛన్ల లబ్ధిదారులకు ఈ నెల నగదు బ్యాంకు ఖాతాల్లో వేసేందుకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉందని, పరిశీలించాలని పండుటాకులు మొరపెట్టుకున్నా చెవికెక్కించుకోలేదు. -
జగన్ రాజ్యంలో.. ఇసుక దందా
[ 02-05-2024]
జగన్ రాజ్యంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వుకుపోతూ రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని పలు రేవుల నుంచి విశాఖ, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురానికి రోజూ వందల సంఖ్యలో లారీలతో తరలిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. -
పాలకా... విస్తరణ మరిచారా!
[ 02-05-2024]
‘పాలకొండ ప్రధాన రహదారిని అభివృద్ధి చేస్తున్నాం.. పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ఇరువైపులా పెద్ద కాలువలను నగర పంచాయతీ నిధులతో నిర్మించనున్నాం..’ అంటూ మూడేళ్ల క్రితం పాలకులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. -
నేడు వెంకంపేటలో నితిన్ గడ్కరీ సభ
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అరకు పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థిని కొత్తపల్లి గీత తరఫున ప్రచారం చేసేందుకు కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ గురువారం పార్వతీపురం వస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్