సీఎం కాన్వాయ్కు కారు కావాలి.. ఇవ్వండి: తిరుమల వెళ్తున్నవారిని ఆపి పోలీసు జులుం
పల్నాడు జిల్లా వినుకొండకు చెందని వేమల శ్రీనివాస్ కుటుంబం వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరింది. ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పిల్లలతో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్నారు. ఆకలిగా ఉండటంతో బుధవారం రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఒంగోలు నగరంలోకి వచ్చారు
నడిరోడ్డుపై శ్రీనివాస్ కుటుంబం
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్ కుటుంబం వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరింది. ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పిల్లలతో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్నారు. ఆకలిగా ఉండటంతో బుధవారం రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఒంగోలు నగరంలోకి వచ్చారు. అలా రావడమే వారు చేసిన తప్పయింది.. స్థానిక పాత మార్కెట్ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్ చేస్తుండగా ఓ కానిస్టేబుల్ అక్కడికి వచ్చారు. ఈ నెల 22న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒంగోలు పర్యటన నేపథ్యంలో.. కాన్వాయ్ కోసం వాహనంతో పాటు డ్రైవర్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు సార్.. మీకు సారీ చెప్పడం తప్ప మేమేమీ చేయలేమంటూ కారుతో పాటు డ్రైవర్ను తీసుకుని ఆ కానిస్టేబుల్ వెళ్లిపోయాడు.
ఏం చేయాలో అర్థంకాక రాత్రివేళ నడిరోడ్డుపై నిలుచుండిపోయారు ఆ కుటుంబీకులు. సీఎం కాన్వాయ్కు వాహనాలు కావాలంటే స్థానికులను అడిగి తీసుకోవాలనీ, దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న వారి నుంచి, అందునా మొక్కులు తీర్చుకునేందుకు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న వారి వాహనాలు లాక్కుని రోడ్డుపాలు చేయడం ఏమిటని వాపోయారు. ఊరుకాని ఊళ్లో తమకు ఇప్పటికిప్పుడు తిరుమల వెళ్లేందుకు వాహనం ఎక్కడ దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వస్థలానికి వెళ్లేందుకు కూడా వాహనం దొరికే పరిస్థితి లేదన్నారు. దీనిపై సీఐ సుభాషిణి వద్ద న్యూస్టుడే ప్రస్తావించగా ఇప్పటిదాకా తన దృష్టిలో ఈ విషయం లేదన్నారు. బాధితులు ఇప్పటికీ అక్కడే ఉంటే వారి కోసం తమ రక్షక్ వాహనాన్ని పంపించి వారి నుంచి వివరాలు తెలుసుకుంటామన్నారు. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలకు దూరప్రాంతాలకు వెళ్లే వారి వాహనాలను సేకరించరని ఆమె స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరు జీవితాల్లో ఇసుక తుపాను
[ 08-05-2024]
గద్దెనెక్కగానే కొత్త ఇసుక పాలసీ అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాకాలూదారు. ఆ వెనుకే జనాలకు గోతులు తవ్వే కుట్రలు పన్నారు. అక్రమాల జాతరకు తెర లేపారు. దేశానికే ఆదర్శమంటూ అనుయాయులకు రీచ్లు అప్పగించారు. -
మునుగుతున్నాం.. కొనేద్దాం!
[ 08-05-2024]
2019 ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలిచ్చారు. అమలు చేయమని అడిగితే పోలీసులను ఉసిగొల్పి అన్ని వర్గాలపై ఉక్కుపాదం మోపించారు. గత అయిదేళ్లుగా ఎక్కడా అభివృద్ధి లేదు. మరోసారి జనం నమ్మే పరిస్థితి ఎలాగూ లేదు. మరోపక్క విద్యుత్తు ఛార్జీలతో పాటు, అన్ని రకాల నిత్యావసర సరకుల ధరలు పెరిగాయి. -
పార్టీ మారారని అక్కసు.. వైకాపా బరితెగింపు
[ 08-05-2024]
ఎన్నికల వేళ ఓటమి భయం వైకాపా నాయకులను బరితెగించేలా చేస్తోంది. ప్రచారంలో తమకు ఎదురవుతున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నారు. విధానాలు నచ్చక పార్టీ వీడిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. -
చెవి నొగ్గి వినండి అరాచక ముఠా దిగింది!
[ 08-05-2024]
కార్యకర్తలొద్దు.. ప్రైవేట్ సైన్యమే దన్ను...: ఎన్నికల్లో సదరు బదిలీ అభ్యర్థి పూర్తిగా తన ప్రైవేట్ సైన్యం పైనే ఆధారపడ్డారు. తాయిలాల పంపిణీ నుంచి, క్షేత్రస్థాయిలో అసంతృప్తులను బుజ్జగించడం, ఇతర పార్టీల్లోని వారికి ఎరవేయడంలో బిజీగా ఉన్నారు. -
పాలబుగ్గలపైనా పాలకుడి పగ
[ 08-05-2024]
ప్రజాక్షేమమే పాలకుల అంతిమ లక్ష్యం..అయితే అయిదేళ్ల క్రితం కొలువుదీరిన ఆంధ్రా పాలకుడు మాత్రం దీనికతీతం. అధికార పీఠమెక్కాక ఆయన కర్కశంగా ప్రాథమిక విద్య గొంతు నులిమేశారు. పాఠశాలల విలీనమంటూ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ఇటు చిన్నారులు..అటు ఉపాధ్యాయులు విలవిల్లాడారు. -
వెలుగొండ పూర్తి.. పథకాలతో ప్రతిఇంటికీ అబ్ధి
[ 08-05-2024]
రాష్ట్రంలో కీలక పార్లమెంట్ నియోజకవర్గం ఒంగోలు. కోస్తా.. రాయలసీమ సంస్కృతుల సమ్మిళితమైన ఈ ప్రాంతం నుంచి తెదేపా తరఫున బలమైన అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బరిలో నిలిచారు. ఇటు సేవా కార్యక్రమాలు..అటు పార్టీలకతీతంగా వివాద రహితుడిగా గుర్తింపు పొందడం ఆయనకు కలిసొచ్చే అంశం. -
ఓటుకు వందనం
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ ఎనభై అయిదు సంవత్సరాలు దాటిన వృద్ధులు, ఇంటికే పరిమితమైన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. -
పోలైన తపాలా ఓట్లు 16,400
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. -
నగదు బదిలీతో ఓట్ల కొనుగోలు
[ 08-05-2024]
నగదు బదిలీతో ఓట్లు కొనుగోలు చేసిన ఉదంతంపై దర్శి పీఎస్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఓట్లు కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు, ఓట్లు అమ్ముకున్న ఎనిమిదిమంది ఉపాధ్యాయులు, ఇద్దరు పోలీసులు, ఒక ఏఎన్ఎం, ఓ వాలంటీరు, ఓ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ