విద్యుత్తు సిబ్బంది ఏరీ.. ఎక్కడ!
క్షేత్రస్థాయిలో సత్వర సేవలు అందించాల్సిన విద్యుత్తు అధికారులు, సిబ్బంది పోస్టులు గత ఎనిమిదేళ్లుగా భర్తీ కావడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో చిన్నపాటి అంతరాయం కలిగినా పరిష్కరించేవారు కరవయ్యారు. లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉండటం
ఏళ్లతరబడి భర్తీకాని పోస్టులు
గ్రామాల్లో సేవలందించేవారే కరవు
* కొత్తపట్నం మండలం మడనూరులో ఉప్పుగాలుల తీవ్రతకు విద్యుత్తు స్తంభంపై ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. వాటి నిర్వహణపై సిబ్బంది పట్టించుకోలేదు. మహాశివరాత్రి సందర్భంగా జరిగిన తిరునాళ్ల సమయంలో రథం స్తంభం తగలడంతో పైన ఉన్న పలకలు ఓ మహిళ తలపై పడ్డాయి. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు.
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: క్షేత్రస్థాయిలో సత్వర సేవలు అందించాల్సిన విద్యుత్తు అధికారులు, సిబ్బంది పోస్టులు గత ఎనిమిదేళ్లుగా భర్తీ కావడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో చిన్నపాటి అంతరాయం కలిగినా పరిష్కరించేవారు కరవయ్యారు. లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉండటం; మరోవైపు విధుల్లో ఉన్నవారు అప్పుడప్పుడైనా తనిఖీ చేయకపోవడం చిక్కులు తెచ్చిపెడుతోంది. ఒక్కో ఉద్యోగి ఇతర ప్రాంతాలకు ఇన్ఛార్జిగా విధులు నిర్వహించడం వల్ల సకాలంలో సేవలు అందించడంలోనూ ఇబ్బందే. స్థానికులే కొద్దిపాటి అవగాహనతో ఎలక్ట్రీషియన్గా మారి విద్యుత్ పరివర్తకాల వద్ద ఫ్యూజు వేయడం లేదా లైన్ మీద మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తున్నారు. తద్వారా అవగాహన లేమితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయ్..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైన్మెన్ మాత్రమే స్తంభం ఎక్కాలి. జూనియన్ లైన్మెన్, సహాయ లైన్మెన్ అనుసంధానంగా ఉండేవారు. 2001లో డిస్కంల ఆవిర్భావం తర్వాత నిబంధనలు సడలించారు. తద్వారా సహాయ లైన్మెన్ కూడా స్తంభం ఎక్కేలా మార్పులు చేశారు. సచివాలయాల ఎనర్జీ అసిస్టెంట్(జేఎల్ఎం-గ్రేడు 2) పోస్టులు మినహా 2014 నుంచి ఎలాంటి ఉద్యోగాల భర్తీ జరగలేదు. మార్గదర్శకాల ప్రకారం ఎనర్జీ అసిస్టెంట్ స్తంభం ఎక్కడానికి లేదు. అత్యవసర సమయంలో వారితో పని చేయించినా ఆ సమయంలో ఊహించని ప్రమాదాలు సంభవించినప్పుడు అందుకు బాధ్యులైన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
గతంలో జేఎల్ఎం మీటరు రీడింగ్ తీయగా వారికి పనిభారం రీత్యా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. ఉద్యోగుల కొరతను దృష్టిలో ఉంచుకుని జూనియర్ లైన్మెన్, సహాయ లైన్మెన్కు రెండు లేదా మూడు గ్రామాల చొప్పున విద్యుత్తు సరఫరా నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. వినియోగదారుల నుంచే వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. 2019లో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చాక ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేశారు. 638 సచివాలయాలకు మంజూరుకాగా, అందులో 629 మంది విధుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారు కూడా పనిచేసే చోట నివాసం ఉండకపోవడంతో పల్లెల్లో రాత్రివేళ ఫ్యూజ్ పోతే వేసేవారు కరవయ్యారు. వేసవిలో ఏసీల వినియోగం కారణంగా పరివర్తకంపై లోడు ఎక్కువ పడటంతో తరచూ ఫ్యూజులు పోతున్నాయి. స్థానికులే వీటిని వేస్తున్నారు.
* కంభం మండలం లింగాపురంలో ఇటీవల సయ్యద్ ఫాతిమా ఆరుబయట నిద్రించగా సమీపంలోని 11 కేవీ విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. బయట ఉన్నవారంతా పరుగులు తీయగా ఫాతిమా తమ మనవళ్ల కోసం వెతుకుతూ మంచంపై ఉన్న బొంతను తీశారు. ఆ క్రమంలో విద్యుత్తు తీగ తగిలి క్షణాల్లో ఆమె సజీవ దహనమయ్యారు.
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు శాఖలో ఉన్న ఖాళీల గురించి ప్రభుత్వానికి నివేదించాం. 33 ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వినియోగదారులకు సేవల విషయంలో అంతరాయం జరగకుండా జూనియన్ ఇంజినీర్లకు అదనపు బాధ్యతలు అప్పగించాం. సరఫరాలో ఏదైనా సమస్య వస్తే విద్యుత్తు సిబ్బంది దృష్టికి రైతులు, వినియోగదారులు తీసుకురావాలి. అంతే కానీ వారే స్వయంగా ఫ్యూజులు వేయడం, ఇతరత్రా మరమ్మతులు చేయకూడదు.
- కేవీజీ సత్యనారాయణ, ఎస్ఈ, విద్యుత్తు శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరు జీవితాల్లో ఇసుక తుపాను
[ 08-05-2024]
గద్దెనెక్కగానే కొత్త ఇసుక పాలసీ అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాకాలూదారు. ఆ వెనుకే జనాలకు గోతులు తవ్వే కుట్రలు పన్నారు. అక్రమాల జాతరకు తెర లేపారు. దేశానికే ఆదర్శమంటూ అనుయాయులకు రీచ్లు అప్పగించారు. -
మునుగుతున్నాం.. కొనేద్దాం!
[ 08-05-2024]
2019 ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలిచ్చారు. అమలు చేయమని అడిగితే పోలీసులను ఉసిగొల్పి అన్ని వర్గాలపై ఉక్కుపాదం మోపించారు. గత అయిదేళ్లుగా ఎక్కడా అభివృద్ధి లేదు. మరోసారి జనం నమ్మే పరిస్థితి ఎలాగూ లేదు. మరోపక్క విద్యుత్తు ఛార్జీలతో పాటు, అన్ని రకాల నిత్యావసర సరకుల ధరలు పెరిగాయి. -
పార్టీ మారారని అక్కసు.. వైకాపా బరితెగింపు
[ 08-05-2024]
ఎన్నికల వేళ ఓటమి భయం వైకాపా నాయకులను బరితెగించేలా చేస్తోంది. ప్రచారంలో తమకు ఎదురవుతున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నారు. విధానాలు నచ్చక పార్టీ వీడిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. -
చెవి నొగ్గి వినండి అరాచక ముఠా దిగింది!
[ 08-05-2024]
కార్యకర్తలొద్దు.. ప్రైవేట్ సైన్యమే దన్ను...: ఎన్నికల్లో సదరు బదిలీ అభ్యర్థి పూర్తిగా తన ప్రైవేట్ సైన్యం పైనే ఆధారపడ్డారు. తాయిలాల పంపిణీ నుంచి, క్షేత్రస్థాయిలో అసంతృప్తులను బుజ్జగించడం, ఇతర పార్టీల్లోని వారికి ఎరవేయడంలో బిజీగా ఉన్నారు. -
పాలబుగ్గలపైనా పాలకుడి పగ
[ 08-05-2024]
ప్రజాక్షేమమే పాలకుల అంతిమ లక్ష్యం..అయితే అయిదేళ్ల క్రితం కొలువుదీరిన ఆంధ్రా పాలకుడు మాత్రం దీనికతీతం. అధికార పీఠమెక్కాక ఆయన కర్కశంగా ప్రాథమిక విద్య గొంతు నులిమేశారు. పాఠశాలల విలీనమంటూ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ఇటు చిన్నారులు..అటు ఉపాధ్యాయులు విలవిల్లాడారు. -
వెలుగొండ పూర్తి.. పథకాలతో ప్రతిఇంటికీ అబ్ధి
[ 08-05-2024]
రాష్ట్రంలో కీలక పార్లమెంట్ నియోజకవర్గం ఒంగోలు. కోస్తా.. రాయలసీమ సంస్కృతుల సమ్మిళితమైన ఈ ప్రాంతం నుంచి తెదేపా తరఫున బలమైన అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బరిలో నిలిచారు. ఇటు సేవా కార్యక్రమాలు..అటు పార్టీలకతీతంగా వివాద రహితుడిగా గుర్తింపు పొందడం ఆయనకు కలిసొచ్చే అంశం. -
ఓటుకు వందనం
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ ఎనభై అయిదు సంవత్సరాలు దాటిన వృద్ధులు, ఇంటికే పరిమితమైన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. -
పోలైన తపాలా ఓట్లు 16,400
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. -
నగదు బదిలీతో ఓట్ల కొనుగోలు
[ 08-05-2024]
నగదు బదిలీతో ఓట్లు కొనుగోలు చేసిన ఉదంతంపై దర్శి పీఎస్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఓట్లు కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు, ఓట్లు అమ్ముకున్న ఎనిమిదిమంది ఉపాధ్యాయులు, ఇద్దరు పోలీసులు, ఒక ఏఎన్ఎం, ఓ వాలంటీరు, ఓ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్