logo

24న చీమకుర్తికి సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 24న చీమకుర్తిలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ గురువారం బాపట్ల వచ్చారు. ఈ

Published : 12 Aug 2022 02:16 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 24న చీమకుర్తిలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ గురువారం బాపట్ల వచ్చారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్‌ వద్ద ఆయన్ను జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. 24న చీమకుర్తిలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహాల ఆవిష్కరణకు ఆహ్వానించారు. ఇందుకు సీఎం సుముఖం వ్యక్తం చేశారు. విగ్రహాల ఆవిష్కరణతో పాటు బూచేపల్లి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్‌ ప్లాంట్‌, బస్‌షెల్టర్‌ను కూడా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి అనుసంధానంగా స్థానికంగా ఓ సచివాలయాన్ని సందర్శించేలా అధికారులు ప్రణాళిక చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని