ఎస్టీ కమిషన్ అంటే అంత చులకనా!
ఎస్టీ కమిషన్ రాజ్యాంగ బద్ధమైంది. గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నాను. అందుకు సంబంధించిన సమాచారాన్ని కలెక్టర్ ద్వారా అధికారులకు ముందస్తుగానే పంపాం. అయినా కొందరు ఎందుకు రాలేదు.. కమిషన్ అంటే అంత చులకనగా ఉందా..!’ అని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల తీరుపై ఛైర్మన్ ఆగ్రహం
మాట్లాడుతున్న కుంభా రవిబాబు.. వేదికపై కలెక్టర్, జిల్లా అధికారులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఎస్టీ కమిషన్ రాజ్యాంగ బద్ధమైంది. గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నాను. అందుకు సంబంధించిన సమాచారాన్ని కలెక్టర్ ద్వారా అధికారులకు ముందస్తుగానే పంపాం. అయినా కొందరు ఎందుకు రాలేదు.. కమిషన్ అంటే అంత చులకనగా ఉందా..!’ అని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై జిల్లా కేంద్రం ఒంగోలులోని ప్రకాశం భవన్లో జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ.. రెండు రోజులుగా పర్యటనకు గైర్హాజరైన అధికారులకు సంజాయిషీ నోటీసులివ్వాలని కలెక్టర్కు సూచించారు. సింగరాయకొండ, కనిగిరి ప్రాంతాలకు వెళ్లినప్పుడు విద్యుత్తు, తాగునీటితో పాటు, ఇతర మౌలిక వసతుల సమస్యలను పలువురు గిరిజనులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. అమాయక గిరిజనులను అధికారులు, పోలీసులు ఇబ్బంది పెట్టినా, చట్ట ప్రకారం వారికి దక్కాల్సిన ప్రయోజనాలను కాపాడటంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిరిజనులు తమ సమస్యలను నేరుగా ఎస్టీ కమిషన్ యాప్ ద్వారా తన దృష్టికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. సమావేశంలో జేసీ అభిషిక్త్ కిషోర్, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఆర్వో సరళా వందనం, ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్, జిల్లా అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తొలుత గిరిజన భవన్లో గిరిజనుల సమస్యలపై ఆయా సంఘాల నాయకులతో రవిబాబు చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగులకు ‘జగనన్న ద్రోహం’
[ 07-05-2024]
ఏటా జాబ్ క్యాలెండర్..మెగా డీఎస్సీ..ఆపై ఏపీపీఎస్సీ..ఇంకా పోలీసు పోస్టులు..మీకిక ఉద్యోగాలే ఉద్యోగాలు. అయిదేళ్ల క్రితం జగన్ ఇలా తన వంచనాపూరిత హామీలతో జిల్లాను హోరెత్తించేశారు. -
‘భూ’చోళ్లు.. జగనన్నే వెన్నుదన్ను
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో భూ మాఫియా రెచ్చిపోయింది. కొండలు, గుట్టలు, కాలువ గట్లు, జల వనరులు, అసైన్డ్, పశువుల పోరంబోకు, దేవుని మాన్యం, శ్మశాన భూములు ఆక్రమించారు. -
ఓటేయకుంటే... గొంతులూ తడపం
[ 07-05-2024]
గొంతులెండుతున్నాయి. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వండని జనం వేడుకుంటుంటే.. ‘మీరు మా పార్టీ కాదు కదా’ అని ప్రశ్నిస్తూ అమానుషంగా ప్రవర్తిన్నారు వైకాపా నాయకులు. -
అంతర్జాతీయ రాగం.. బతుకులు ఆగమాగం..
[ 07-05-2024]
‘రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అందుకు విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నాం’ ఇవీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్న మాటలు. -
కొనసాగుతున్న తపాలా.. ఇంటి వద్దే ఓటు
[ 07-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
అరాచక పాలనను అంతమొందిద్దాం
[ 07-05-2024]
రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడానికి కాపులంతా జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని టీబీకే రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రాము కోరారు. -
అధికారం ఉన్నోడిదే భూమి!
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం అనే పట్టాదారు పుస్తకాలు జారీచేసి దానిపైన సీఎం జగన్ మోహన్రెడ్డి పుస్తకాలను జారీచేశారు. -
తెదేపా హయాంలోనే సంక్షేమానికి పెద్దపీట
[ 07-05-2024]
వైకాపా పాలనలో కంటే తెదేపా హయాంలోనే సంక్షేమానికి బడ్జెట్లో ఎక్కువ ఖర్చుచేసినట్లు ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం