logo

మడుగుల్లో అడుగులెలా జగనన్నా!

గిద్దలూరు నగర పంచాయతీలోని జగన్న కాలనీల్లో రహదారులు బురద మడుగులను తలపిస్తున్నాయి. నగర పంచాయతీ అధికారులు కాలనీలో రహదారులు మెరుగు పరచకుండా ప్లాట్లు వేసి లబ్ధిదారులకు అందజేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు గిద్దలూరు - కృష్ణంశెట్టిపల్లె రహదారిలో ఉన్న ఉద్యాన శాఖ స్థలంలోని లేఅవుట్లలో

Published : 13 Aug 2022 05:22 IST

గిద్దలూరు నగర పంచాయతీలోని జగన్న కాలనీల్లో రహదారులు బురద మడుగులను తలపిస్తున్నాయి. నగర పంచాయతీ అధికారులు కాలనీలో రహదారులు మెరుగు పరచకుండా ప్లాట్లు వేసి లబ్ధిదారులకు అందజేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు గిద్దలూరు - కృష్ణంశెట్టిపల్లె రహదారిలో ఉన్న ఉద్యాన శాఖ స్థలంలోని లేఅవుట్లలో అంతర్గత రహదారులు బురదమయంగా మారాయి. ప్రధాన రహదారిలో నీరు నిలిచి నడిచి వెళ్లేందుకు కూడా వీలులేకుండా మారింది. నిర్మాణ సామగ్రి ఆటోలు, ట్రాక్టర్లలో తరలించేందుకు వీలు కావడం లేదు. ఇప్పటికైనా అంతర్గత రహదారులు, ప్రధాన రహదారులను మెరుగు పర్చాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 

 - న్యూస్‌టుడే, గిద్దలూరు పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని