ఎటు వెళ్లాలి... ఏం చేయాలి!
తమకు ఇష్టమైన వైద్యకోర్సు చేసేందుకు వారు దేశం కాని దేశం వెళ్లారు. బిడ్డల లక్ష్యానికి తల్లిదండ్రులూ తోడుగా నిలిచారు. కష్టార్జితమంతా ఫీజుల రూపంలో చెల్లించారు. అంతా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో యుద్ధం ఉరిమింది. అంతే ఒక్కసారిగా పరిస్థితులే తారుమారైపోయాయి. ఇ
ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్యవిద్యార్థుల అంతర్మథనం
ఖర్చులు మరింత పెరుగుతాయని వెల్లడి
తమకు ఇష్టమైన వైద్యకోర్సు చేసేందుకు వారు దేశం కాని దేశం వెళ్లారు. బిడ్డల లక్ష్యానికి తల్లిదండ్రులూ తోడుగా నిలిచారు. కష్టార్జితమంతా ఫీజుల రూపంలో చెల్లించారు. అంతా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో యుద్ధం ఉరిమింది. అంతే ఒక్కసారిగా పరిస్థితులే తారుమారైపోయాయి. ఇటు కేంద్రం ప్రకటనలు ఊరటివ్వక, అటు ఎటువైపు అడుగులు వేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు. ఉక్రెయిన్ నుంచి వచ్చేసిన జిల్లాలోని వైద్య విద్యార్థుల ప్రస్తుత పరిస్థితి ఇది.
- ఈనాడు డిజిటల్, ఒంగోలు
ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి 37 మంది వరకు విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించడానికి ఉక్రెయిన్ వెళ్లారు. అక్కడ వివిధ విశ్వవిద్యాలయాల్లో చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. అతికష్టంమీద వారంతా జిల్లాకు చేరుకున్నారు. అప్పటికే నాలుగేళ్ల కోర్సు పూర్తిచేసినవారు కొందరుంటే.. చివరి సెమిస్టర్ చదివేవారు, ఏడాదన్నర పూర్తయినవారు మరికొందరు. తాము చదువుతున్న కోర్సు.. యూనివర్సిటీ, వసతిని బట్టి ఇప్పటికే రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షలు వెచ్చించారు. ఆ తర్వాత అర్ధంతరంగా వచ్చేయాల్సి వచ్చింది. గత ఏడు నెలలుగా తమ చదువుకు కేంద్రం ఎలాంటి దారిచూపుతుందోనని ఎదురుచూశారు. భారత విద్యాలయాల్లో వసతి కల్పించలేమని, ఇటువంటి సడలింపులు దేశంలో వైద్యవిద్య ప్రమాణాలకు ఆటంకం కలిగిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇతర దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో మొబిలిటీ కార్యక్రమంలో భాగంగా మిగిలిన కోర్సు పూర్తిచేసుకోవచ్చని తెలిపింది.
ఎన్నో అనుమానాలు
ప్రస్తుతం విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు. క్లినికల్, ప్రాక్టికల్ తరగతుల పరిస్థితేమిటో అర్థం కావడంలేదు. చివరి సంవత్సరం చదివేవారు.. ఏడాది, రెండేళ్ల తరగతులు పూర్తయినవారు తమ డిగ్రీ ధ్రువపత్రం ఇప్పటివరకు చదివిన వర్సిటీ నుంచి వస్తుందా? కొత్తగా చేరబోయే విద్యాలయం నుంచి వస్తుందో స్పష్టతలేదు. పోలండ్, జార్జియా వంటి వివిధ దేశాలకు వెళ్లాలంటే అక్కడ ఖర్చులు, ఫీజులు ఎలా ఉంటాయో తెలియదు. కొందరు మళ్లీ ఉక్రెయిన్ వెళ్లాలని భావిస్తుండగా, మరికొందరు ఉజ్బెకిస్థాన్ వైపు చూస్తున్నారు. ఇటీవల వెలువడిన ఎన్ఎంసీ నోటీసులో మాత్రం వైద్య డిగ్రీని తొలుత చదివిన ఉక్రెయిన్ విశ్వవిద్యాలయం నుంచే ప్రదానం చేస్తారని పేర్కొంది.
మార్గదర్శకాలు పరిశీలించి నిర్ణయం
ఉక్రెయిన్లోని జఫ్రోషియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్లో చేరాను. ఏడాదన్నర కోర్సు పూర్తయింది. యుద్ధం కారణంగా వచ్చేశాను. ఏడాదిన్నరకు రూ.5 లక్షలు ఖర్చయింది. ఇప్పుడు మరో దేశం వెళ్లాలంటే ఫీజు, ఇతర ఖర్చులు ఉంటాయి. అలానే డిగ్రీ సర్టిఫికెట్ ఎక్కడినుంచి ఇస్తారో కూడా తెలియదు. మార్గదర్శకాలు పరిశీలించి ఏ దేశం వెళ్లాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
-ఎస్.కల్యాణ్ చక్రవర్తి, ఉక్రెయిన్ వైద్య విద్యార్థి, ఒంగోలు
సెమిస్టర్ కోసం ఉజ్బెకిస్తాన్
జఫ్రోషియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ అయిదో సంవత్సరం చదువుతుండేవాడిని. యుద్ధం సమయానికి ఒక సెమిస్టర్ మాత్రమే మిగిలి ఉంది. నాలుగైదు నెలలు ఉండుంటే కోర్సు పూర్తయ్యేది. మిగిలిన ఒక సెమిస్టర్ ఫీజు, ఖర్చులు అన్నీ మరో రూ.3 లక్షలు అయ్యేది. మొబిలిటీలో భాగంగా ఇప్పుడు ఉజ్బెకిస్థాన్ వెళ్లి అక్కడి విశ్వవిద్యాలయంలో చదవాల్సి ఉంది. పరిస్థితులను బట్టి మరో రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుంది.
-గద్దె వెంకట సాయి ఆర్య, పామూరు
ఆర్థికంగా అదనపు భారం : యశ్వంత్, ఒంగోలు
ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేశాను. ఈ ఏడాది ఉండుంటే కోర్సు పూర్తయ్యేది. ఇప్పటివరకు రూ.30 లక్షలు వెచ్చించాను. మిగిలిన ఏడాది కోర్సు కోసం మరో దేశం వెళ్లాల్సి వస్తోంది. ఇది ఆర్థికంగా మాకు అదనపు భారం. ఫీజు విషయంలోనూ గందరగోళమే. డిగ్రీ ధ్రువపత్రం విషయంలోనూ స్పష్టత లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత