పుస్తకాలు ఇవ్వకుండానే పాఠాలు
విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం... ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండా అర్ధ సంవత్సరం గడిపేసింది.
పుస్తకాలు ఇవ్వకుండానే పాఠాలు
ఇంటర్ విద్యార్థుల అవస్థలు
పామూరు, సి.ఎస్.పురం, న్యూస్టుడే
పామూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు
విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం... ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండా అర్ధ సంవత్సరం గడిపేసింది. అధ్యాపకులు పాఠాలు కూడా చెప్పి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో యూనిట్, త్రైమాసిక పరీక్షలు సైతం నిర్వహించారు. అర్ధ సంవత్సర పరీక్షలకు మాత్రం సిలబస్ పూర్తికాకపోవడంతో నవంబరు 12 నుంచి జరగాల్సిన వాటిని డిసెంబర్ 12కు వాయిదా వేశారు. పాఠ్య పుస్తకం చేతిలో లేకపోవడంతో పాఠాలు అర్థం కాక, పరీక్షల్లో ఏం రాస్తున్నామో తెలియని పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంత నిర్లక్ష్యమా..?
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జూనియర్ కళాశాలలతో పాటు ఇంటర్మీడియట్ అమలయ్యే ఆదర్శ, కస్తూర్బా, ఫ్లస్-2 పాఠశాలల్లో సుమారు 11 వేల మందికి పైగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలి. విద్యా సంవత్సరానికి ముందే వాటిని ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది. తరగతులు ప్రారంభమై నాలుగు నెలలు కావస్తున్నా.. నేటికీ ఒక్క పాఠ్య పుస్తకం కూడా ఇవ్వలేదంటే ఆ శాఖకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. బయట మార్కెట్లో పుస్తకాలు లభ్యం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
పరీక్షలపై ప్రభావం..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కువగా పేదలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే అధికంగా ఉంటారు. ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు అందిస్తేనే వారికి చదువుకోవడానికి వీలుంటుంది. గత ఏడాది కూడా వీటిని సకాలంలో సరఫరా చేయకపోవడంతో ఈ ఏడాది విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కళాశాలలు వెనుకబడ్డాయి. ఉత్తీర్ణత తగ్గడానికి ఇది కూడా కారణమే. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇంటర్బోర్డు స్పందించి పాఠ్య పుస్తకాలు వెంటనే సరఫరా చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో కళాశాలలు, విద్యార్థుల వివరాలు..
* ప్రభుత్వ జూనియర్ కళాశాలలు: 32
* ఆదర్శ పాఠశాలలు: 11
* కేజీబీవీలు: 37
* ఫ్లస్-2 పాఠశాలలు: 19
* ప్రథమ సంవత్సరం విద్యార్థులు: 5 వేలు
* ద్వితీయ సంవత్సరం విద్యార్థులు: 6 వేలు
* ప్రైవేటు జూనియర్ కళాశాలలు: 169
* వాటిల్లో మొత్తం విద్యార్థులు: 50 వేలు
త్వరలో వస్తాయి..
పాఠ్య పుస్తకాలు త్వరలో జిల్లాలకు సరఫరా అయ్యే అవకాశం ఉంది. కొన్నిచోట్ల పాత వాటిని కొందరికి సర్దుబాటు చేశాం. ప్రభుత్వం సరఫరా చేసిన వెంటనే ఆలస్యం చేయకుండా కళాశాలలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుటాం. డిసెంబరు 12 నుంచి అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతాయి.
ఎ.సైమన్ విక్టర్, ఆర్ఐవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.