ఆశ తప్ప.. పరిశ్రమల ఊసేదీ..?
అదిగో నిమ్జ్... ఇవిగివిగో పరిశ్రమలు అన్న మాటలు తప్ప అక్కడ పారిశ్రామికవాడ ఏర్పడింది లేదు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందీ లేదు.
నిమ్జ్ ఏర్పాటుపై పాలకుల నిర్లక్ష్యం
ఇతర ప్రాంతాలకు యువత వలస
పార్కులోని భూముల్లో అరకొరగానే మౌలిక వసతులు
ఈనాడు డిజిటల్, ఒంగోలు: అదిగో నిమ్జ్... ఇవిగివిగో పరిశ్రమలు అన్న మాటలు తప్ప అక్కడ పారిశ్రామికవాడ ఏర్పడింది లేదు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందీ లేదు. జిల్లాలో వెనుకబడిన ప్రాంతం కనిగిరి. ఇక్కడ జాతీయ పెట్టుబడులు, తయారీ మండలి(ఎన్ఐఎంజెడ్) ఏర్పాటుకు కేంద్రం పదేళ్ల క్రితమే పచ్చజెండా ఊపింది. గత ప్రభుత్వం హయాంలో భూసేకరణకు అడుగులు పడ్డాయి. కనిగిరి నియోజకవర్గంలోని పామూరు, పీసీపల్లి మండలాల పరిధిలోని భూములను ఇందుకు గుర్తించారు. వీటి సేకరణ ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తికాలేదు. పారిశ్రామికవాడ ఏర్పాటుతో స్థానికంగానే ఉద్యోగాలు లభిస్తాయనే యువత ఆశలు అడియాసలుగానే మిగిలాయి.
4,390 ఎకరాల గుర్తింపు...: నిమ్జ్ ఏర్పాటుకు 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం కనిగిరి నియోజకవర్గంలోని పామూరు, పీసీపల్లి మండలాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కలిపి 14,390 ఎకరాలు గుర్తించింది. ఇందులో బూదవాడలో 3405, మాలకొండాపురంలో 3209, రేణిమడుగు 1025, సిద్ధవరం 4390 ఎకరాలు, అయ్యన్నకోట 552, పెద్దఇర్లపాడు 1647 ఎకరాలున్నాయి. ప్రైవేట్, అసైన్డ్ భూముల రైతులకు పరిహారం చెల్లించి సేకరించాల్సి ఉంది.
మాలకొండాపురం వద్ద ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కు సూచిక
మొదటి విడతలో 4,149 ఎకరాల్లో...: మొత్తం మూడు దశల్లో పారిశ్రామికవాడ రూపుదిద్దుకునేలా ప్రణాళిక రచించారు. మొదటిగా రూ.3,640 కోట్లతో 4149 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో ఎలక్ట్రికల్ వాహనాలు, వాహన విడిభాగాలు, పీవీసీ పైపులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఉడ్, ఇంజినీరింగ్, లాజిస్టిక్స్ పార్కు, సోలార్ తదితర విభాగాల పరిశ్రమలు ఉంటాయి. మొదటి దశకు సంబంధించిన భూముల విషయంలో ప్రజల అభిప్రాయాలను స్వీకరించిన అధికారులు కేంద్రానికి నివేదించారు. మొత్తం మూడు విడతల్లో ఇక్కడ పారిశ్రామికవాడ రూపుదిద్దుకుంటే తద్వారా రూ. 1.22 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3.15 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
పర్యావరణ అనుమతులు రావాలి...
పామూరు, పీసీపల్లి పరిధిలో నిమ్జ్ రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం మాలకొండాపురం వద్ద ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణ పనులు చేపట్టాం. భూసేకరణకు సంబంధించి గతేడాది నవంబరులో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి కేంద్రానికి నివేదించాం. పర్యావరణంపై ఈ ప్రాజెక్టు ప్రభావాన్ని అంచనా వేసి కేంద్రం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అనంతరం భూసేకరణ, ఇతర పనులు వేగవంతం చేస్తాం.
-వెంకటేశ్వర్లు, జెడ్ఎం, ఏపీఐఐసీ
నిరుద్యోగుల్లో ఎన్నెన్నో ఆశలు...
నిమ్జ్ ఏర్పాటుతో తమ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని.. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిరుద్యోగ యువత ఎంతగానో ఆశ పడింది. కానీ ఏళ్లు గడుస్తున్నా అధికారులు, నాయకుల మాటలు కాగితాలకే పరిమితం అయ్యాయి. రాజకీయ నాయకులు సైతం నిమ్జ్ ఏర్పాటును ఎన్నికల ప్రచార హామీగా వాడుకుంటున్నారే తప్ప చిత్తశుద్ధితో అందుకు కృషి చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..