ఆ ఇద్దరు.. భలే ఆవిష్కర్తలు
ఇద్దరు బాలలు తమ మేథస్సుకు పదును పెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆపత్కాలంలో ఉపయోగించే అంతర్జాల సేవలకు సంబంధించిన పరికరాన్ని ఆవిష్కరించారు.
ప్రశంసలందుకుంటున్న ‘ఇంటర్ కం ఎఫ్ఎం’ ప్రాజెక్టు
జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక
ప్రాజెక్టును ప్రదర్శిస్తున్న విద్యార్థులు అమోక్ శౌరి, స్వయం ప్రకాష్
ఇద్దరు బాలలు తమ మేథస్సుకు పదును పెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆపత్కాలంలో ఉపయోగించే అంతర్జాల సేవలకు సంబంధించిన పరికరాన్ని ఆవిష్కరించారు. సీబీఎస్ఈ సెంట్రల్ బోర్డు నిర్వహించిన వివిధ స్థాయి పోటీల్లో ప్రదర్శితమైన ఈ ప్రాజెక్టు బహుమతులందుకోవడంతో పాటు ప్రస్తుతం జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికైంది. ఆ వివరాలు ఇలా...
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఒంగోలు నగరంలోని సాయిబాబా సెంట్రల్ స్కూలులో పదో తరగతి చదువుతున్న అమోక్ శౌరి, స్వయం ప్రకాష్ అనే విద్యార్థులు వారి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు సుదర్శన్ మార్గదర్శకంలో అంతర్గత కమ్యూనికేషన్(ఇంటర్ కం ఎఫ్ఎం) పరికరాన్ని రూపొందించారు. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఉపయోగించి తయారు చేసిన ఈ ప్రాజెక్టును రెండు నెలల క్రితం విజయవాడలో జరిగిన రీజినల్ స్థాయి(తమిళనాడు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్) పోటీలో ప్రదర్శించారు. అందరి ప్రశంసలు అందుకున్న ఈ ప్రాజెక్టు సీబీఎస్ఈ సెంట్రల్ బోర్డు నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో చోటు దక్కించుకుంది. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏడింటిలో ఒకటిగా నిలవడం విశేషం. ఈ నెల 4న దిల్లీలో జరిగే పోటీలో దీన్ని ప్రదర్శించనున్నారు.
మూడేళ్ల కృషి...: చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడుకు చెందిన అల్లంకి రాము, సుభాషిణి దంపతుల కుమారుడు అమోక్ శౌరి. స్వయం ప్రకాష్ స్వస్థలం చెన్నై సమీపంలోని పన్నెకాడు. తల్లిదండ్రులు సౌందర రాజన్, రాజేశ్వరి. ఈ విద్యార్థులిరువురూ ఆరో తరగతి నుంచి స్నేహితులు. సైన్స్పై ఆసక్తితో ఏదైనా కొత్త విషయం కనిపెట్టాలని తపన పడేవారు. వారి ఉత్సాహాన్ని గుర్తించిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు సుదర్శన్ ఏడో తరగతిలోనే ఈ ప్రాజెక్టు తయారీకి బీజం వేశారు. వారికి అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ విజ్ఞానాన్ని పెంచారు. ఎట్టకేలకు వారు పదో తరగతిలోకి వచ్చే సరికి పూర్తి సమాచారంతో ప్రాజెక్టును దిగ్విజయంగా రూపొందించారు.
ప్రయోజనం ఇలా...
‘ఇంటర్ కం ఎఫ్ఎం ప్రాజెక్టు’ పరికరం ద్వారా ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ సాయంతో ఇతరులతో మాట్లాడవచ్చు. వాయిస్ కాల్స్, చాటింగ్ చేయవచ్చు. ఇందులో మెష్ నెట్వర్కింగ్ విధానాన్ని ఉపయోగించినట్లు విద్యార్థులు తెలిపారు. దీనిలో రాస్ప్బెర్రీ, ఎస్డీ కార్డు, వైఫై అడాప్టర్ను వినియోగించినట్లు పేర్కొన్నారు. విపత్తు, యుద్ధ సమయాల్లో కమ్యూనికేషన్ దెబ్బతిని సమాచారం స్తంభించిన సమయంలో ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో రొబోటిక్ ఇంజినీరింగ్ చదువుతానని అమోక్ శౌరి, కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ కావాలని స్వయం ప్రకాష్ తమ లక్ష్యాలను వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.