మంత్రి చెప్పినా చెవికెక్కలేదు
మహా శివరాత్రి వస్తుందంటే త్రిపురాంతకంలో పండగ సందడి నెలకొంటుంది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలకు త్రిపురాంతకేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరీదేవి ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నట్లు అధికారుల అంచనా.
శివరాత్రి పనుల్లో ఏదీ పురోగతి
ఈసారీ ఇబ్బందులు తప్పవా
మంత్రి సురేష్ సొంత నిధులతో నిర్మిస్తున్న ముఖద్వారం
త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్టుడే: మహా శివరాత్రి వస్తుందంటే త్రిపురాంతకంలో పండగ సందడి నెలకొంటుంది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలకు త్రిపురాంతకేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరీదేవి ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నట్లు అధికారుల అంచనా. గతం కంటే ఈ ఏడాది భిన్నంగా నిర్వహించేందుకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో జనవరి 20న అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిపై ఫిబ్రవరి 6న మళ్లీ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసినా దేవాదాయ, పోలీసు శాఖలు మినహా మిగతా శాఖల ఆధ్వర్యంలో జరగాల్సిన పనుల్లో ఎలాంటి పురోగతి లేవడం ఆవేదన కలిగిస్తోంది. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ గోపురానికి సున్నం, రంగులు వేయించారు.
అసౌకర్యాలెన్నో..
బాలాత్రిపురసుందరీదేవి ఆలయం వెలుపలి వైపు దాతల సహకారంతో ఇనుప క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా భక్తుల రాకపోకల రద్దీ నేపథ్యంలో విద్యుత్తు ఉప కేంద్రం మట్టి రహదారికి మరమ్మతులు చేపట్టాలని తీర్మానించినా ఆ దిశగా అడుగులు వేయలేదు. యర్రగొండపాలెం వైపు నుంచి కూడా భక్తులు రానున్న వేళ తారు రోడ్డుకు ఇరువైపులా కేబుల్ వేయడానికి తీసిన కాలువ అక్కడక్కడా పూడ్చకపోవడంతో రోడ్డు మార్జిన్ దిగితే ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఎన్నెస్పీ కాలువ వంతెనపై గుంతలను పూడ్చాల్సిందిగా మంత్రి ఆదేశించినా నేటికి ఆ వైపు తొంగి చూసిన నాథుడు లేరు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇటుక బట్టీలు ఉండటంతో మట్టి, ఇటుక తరలింపుతో బాలాత్రిపుర సుందరీదేవి ఆలయానికి రాకపోకలు సాగించే తారు రోడ్డు మట్టితో నిండిపోయింది. ఉత్సవాల నేపథ్యంలో బట్టీల ట్రాక్టర్ల రాకపోకలను ఆపుతామని అధికారులు చెప్పినా ఆ దిశగా చర్యలు చేపట్ట లేదు. గ్రామం నుంచి ఆలయాల వరకు విద్యుత్తు స్తంభాలకు విద్యుత్తు దీపాల ఏర్పాటుకు ఇంకా శ్రీకారం చుట్ట లేదు. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం తూర్పు మెట్ల మార్గం నుంచి పండుగ రోజున అధిక సంఖ్యలో భక్తులు కొండ మీదకు రాకపోకలు సాగిస్తుంటారు. ఆ మార్గంలోని మెట్లకు రెండు వైపులా అమర్చిన ఇనుప రెయిలింగ్ పడిపోయింది. దీంతో భక్తులు కింద పడి ప్రమాదాలకు గురయ్యే వీలుంది. వీటిని పునర్ నిర్మిస్తే భక్తులు మెట్ల మార్గాన సులువుగా కొండపైకి రాకపోకలు సాగించేందుకు అనువుగా ఉంటుంది.
మెట్ల మార్గంలో కూలిన ఇనుప రెయిలింగ్
ముఖద్వారం పనుల పూర్తి
మంత్రి సురేష్ రూ.31లక్షల సొంత నిధులతో త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ ఘాట్ రోడ్డు దిగువన నిర్మిస్తున్న ముఖద్వారం పనులు చివరికి చేరాయి. ఉత్సవాల నాటికి రంగులతో తీర్చిదిద్దితే భక్తులను ఆకర్షించనుంది. ఉత్సవాల సమయం గడువు దగ్గర పడుతున్నందున సంబంధిత శాఖల అధికారులు పనులను సత్వరమే పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సకల సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్