ఎన్నికల వేళ.. ఎన్ని విచిత్రాలో అన్నా
అయిదేళ్లుగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. చిన్నపాటి మరమ్మతులు.. వీధి దీపాల ఏర్పాటు వంటి వాటిని కూడా గాలికొదిలేసిన పాలకులకు ఎన్నికల వేళ జ్ఞానోదయం అయింది.
అయిదేళ్లుగా వదిలేసి..ఇప్పుడు పనుల హడావుడి
శివారు ఓట్లు పొందేందుకు ఎత్తుగడ
న్యూస్టుడే, మార్కాపురం అర్బన్
అయిదేళ్లుగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. చిన్నపాటి మరమ్మతులు.. వీధి దీపాల ఏర్పాటు వంటి వాటిని కూడా గాలికొదిలేసిన పాలకులకు ఎన్నికల వేళ జ్ఞానోదయం అయింది. వారి కనుసైగతో ఇప్పుడు అధికారులు అభివృద్ధి పనులు గాభరా..గాభరాగా చేసేస్తున్నారు. కోడ్ కూసిన వేళ ఓట్లు దండుకునేందుకు వేస్తున్న ఎత్తుగడ అంటూ శివారు కాలనీ వాసులు పెదవి విరుస్తున్నారు.
పశ్చిమ ప్రకాశంలో కీలక పట్టణమైన మార్కాపురం అయిదేళ్లుగా అసౌకర్యాలతో మగ్గుతోంది. పట్టణంలోని శివారు కాలనీల్లో ఎక్కడ చూసినా దెబ్బతిన్న రహదారులు, కాలువలు, వెలగని వీధి దీపాలు, పాడైన నీటి పైపులే దర్శనమిస్తున్నాయి. కాలనీల వాసులు ఎంత మొత్తుకున్నా అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. సరిగ్గా ఎన్నికల నగారా మోగిన వేళ పాలకులకు ఇవన్నీ గుర్తొచ్చాయి. ఇంకేం పాలకుల మనసు దోచేందుకు ఇదే సరైన తరుణమని అధికారులు పనులు చేపడుతూ ఉరుకులు పరుగులు తీస్తున్నారు. అధికార పార్టీ నూతన సమన్వయకర్త చెప్పిందే వేదంగా క్షణాల్లో జరిగిపోతున్నాయి. సాధారణ రోజుల్లో నిధుల సమస్య అంటూ కాలం వెళ్లదీసే పుర అధికారులు ఇప్పుడు స్వామి భక్తి చాటుకుంటున్నారు.
పాత తేదీలతో...
మార్కాపురం పట్టణంలో జన సంఖ్య లక్షకు పైమాటే. 35 వార్డుల్లో విస్తరించినా.. సౌకర్యాలు కల్పించడంలో అధికార వైకాపా పాలకవర్గం పూర్తిగా విఫలమైంది. దూపాడు నుంచి పట్టణానికి నీటి సరఫరా అయ్యే పైపు లైన్ తరచూ మరమ్మతులకు గురవుతున్నా...కొత్తవి అమర్చి నీటి సమస్య లేకుండా చేయడంలో నిర్లక్ష్యం చూపింది. ఎన్నికలకు ముందు నూతన సమన్వయకర్త లేఖపై బాధ్యతల్లో చేరిన కీలక అధికారితో పాటు దీర్ఘకాలికంగా పాతుకుపోయిన మరో ముఖ్య అధికారి జీ హుజూర్ అంటూ పనులు చేస్తున్నారు. కోడ్ అమల్లో ఉన్న పట్టించుకోకుండా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పాత తేదీలతో చకచక పనులు ప్రారంభిస్తున్నారు.
కోడ్ కూతకు కాస్త ముందు..
పట్టణంలోని సుందరయ్య కాలనీ ఏళ్ల తరబడి నుంచి కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. దీనిపై ప్రతిపక్షాలు పదే పదే నిరసనలు చేపట్టినా ఫలితం లేకుండాపోయింది. కాలనీకి చేరుకునేందుకు ప్రధాన మార్గం రహదారి నిర్మించాలని కాలనీవాసులు కాళ్లరిగేలా తిరిగారు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎన్నికల కోడ్కు ముందే పనులకు శంకుస్థాపనలు చేసి ఇప్పుడు చకచక పూర్తి చేస్తున్నారు. సుందరయ్య కాలనీలో గ్రావెల్ రోడ్డు నిర్మిస్తున్నారు.
తూర్పు వీధిలో నీటి కొరత ఉందంటూ వైకాపా శ్రేణులు గగ్గోలు పెట్టడంతో అక్కడ సైతం నూతన బోరు వేయించి పైపులైను పనులు ప్రారంభించారు. ఈ విధంగా పట్టణంలో చాలా వీధుల్లో శ్రేణులు అడిగిన పనులన్నింటినీ అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఓట్లు రాబట్టుకునేందుకు వైకాపా వేస్తున్న ఎత్తుగడ అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వైకాపా పాలక వర్గానికి వత్తాసు పలికే విధంగా కమిషనరు, డీఈ వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం