logo

త్వరలో మూడు చోట్ల జనసేన సభలు, రోడ్‌షోలు

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated : 28 Mar 2024 06:35 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు పార్లమెంట్‌ తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థిగా మాగుంట బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో కూటమి బలోపేతంపై జనసేనానితో ఆయన చర్చించారు. ఒంగోలు, దర్శి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభలు, రోడ్‌షోలకు హాజరు కావాల్సిందిగా పవన్‌కల్యాణ్‌ను మాగుంట ఆహ్వానించారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన జనసేన కీలక నాయకులతో జిల్లా కేంద్రమైన ఒంగోలు లేదా విజయవాడలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే అంశం పైనా చర్చించినట్లు సమాచారం. జిల్లా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను పవన్‌ కల్యాణ్‌ త్వరలో ప్రకటించనున్నట్లు తెలిసింది. మాగుంట వెంట రాఘవ్‌రెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, బెల్లం సత్యనారాయణ, తాతా ప్రసాద్‌, కుప్పా రంగసాయి, కండే శ్రీనివాసులు, అయినాబత్తిన ఘనశ్యామ్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని