logo

నెత్తురోడ్డాయి..

జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు..

Published : 29 Mar 2024 01:59 IST

వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృత్యువాత

అరుణ, శ్రావణి, దివ్య (పాత చిత్రాలు)

న్యూస్‌టుడే బృందం: జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం శివారులో దిమ్మెలను ఢీకొట్టడంతో కందుకూరుకు చెందిన రాయని అరుణ(50), తలపనేని దివ్య(30), గుళ్లాపల్లి శ్రావణి(22) అనే ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

  • దర్శికి చెందిన వాకా అఖిల్‌రెడ్డి(23) అనే యువకుడు ఈత కొలనులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
  • సముద్రంలో ఈతకు వెళ్లి ఒంగోలు మండలం పెద్దదేవరంపాడుకు చెందిన గడ్డం హేమంత్‌(19) అనే యువకుడు.. నాగులుప్పలపాడు మండలం కనపర్తి సముద్రం తీరం వద్ద విగతజీవిగా కనిపించారు.
  • అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కనిగిరికి చెందిన షేక్‌ నూర్జహాన్‌(41) అనే మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
  • ఒంగోలులో రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని సుమారు 50 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తిరిగి రాని లోకాలకు తరలిపోయారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని