నామపత్రాల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
నామపత్రాల స్వీకరణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన వివిధ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు.
మీడియా సెల్ ప్రారంభిస్తున్న కలెక్టర్ దినేష్కుమార్
ఒంగోలు గ్రామీణం: నామపత్రాల స్వీకరణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన వివిధ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా తరలిస్తున్న అనుమానిత నగదు, ఇతర వస్తువుల కట్టడి, తదితర అంశాలపై ఆయన జిల్లాల వారీగా సమీక్షించారు. సి-విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.1.30 కోట్లకుపైగా అనుమానిత నగదు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏఆర్వోల ప్రతిపాదనలను కూడా త్వరలోనే పంపుతామని వివరించారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించిన సామగ్రి అన్ని కేంద్రాలకు చేరేలా సమగ్రంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, డీఆర్వో శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో మీడియా సెల్..
ఒంగోలు గ్రామీణం: జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు, సమాచారాన్ని, ప్రవర్తనా నియమావళి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేలా మీడియా సెల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని రికార్డు భవనంలో ఏర్పాటుచేసిన ఎన్నికల సెల్ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేస్తున్నట్లు వివరించారు. సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఓటర్లల్లో చైతన్యం, పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేసి జిల్లాలో స్వీప్ ద్వారా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి ముందస్తు అనుమతులు ఇవ్వడంతోపాటు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే పెయిడ్ వార్తలను పర్యవేక్షించేందుకు కమిటీను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక కలెక్టర్ ఝాన్సీలక్ష్మి, డీఐపీఆర్వో గ్రేస్ లినోర, డీపీఆర్వో రమేష్, డివిజనల్ పీఆర్వో దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న కళ్లలో ఆనందం.. పొద్దంతా ఏడిపింఛను కుతంత్రం
[ 30-04-2024]
మీ బిడ్డనంటూ జగన్ నటిస్తూ కపట మాటలు చెబుతారు. చేతల్లో అబద్ధాలని జనానికి తెలియగానే అస్మదీయ అధికార గణం రంగంలోకి దిగుతుంది. మరో జగన్నాటకానికి తెర లేపుతుంది. అన్న కళ్లలో ఆనందం కోసం పరితపిస్తుంది. -
అబద్ధాల అన్నొస్తున్నాహో!
[ 30-04-2024]
జగన్నాటకం మళ్లీ మొదలైంది. ఎన్నికలకు పక్షం రోజులే ఉండటంతో ఓటర్ల కళ్లకు గంతలు కట్టేందుకు ఆయన జనం చెంతకు వస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీలు గుప్పించి అధికార పీఠమెక్కి..ఆ తర్వాత ఒక్కటీ నెరవేర్చలేదు. -
‘మహిళా భేరి’ మోగిద్దాం.. అరాచక పాలన తరుముదాం
[ 30-04-2024]
‘పాలకులను నిర్ణయించేది మహిళలే.. వారి చేతుల్లోనే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఉంది. అభివృద్ధికి ఓటేసి.. అరాచకాన్ని తరమాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెదేపా కొండపి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు. -
హవ్వ.. భావి పౌరుల భుజాలపై జెండాలా!
[ 30-04-2024]
అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మానవత్వం మరణించింది !
[ 30-04-2024]
వందలాది మంది సాక్షిగా మానవత్వం మరణించింది. రక్తమోడుతున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడి మృతి
[ 30-04-2024]
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. -
సార్వత్రిక రణం.. హోరెత్తనున్న ప్రచార పర్వం
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలై ఈ నెల 25 వరకు కొనసాగింది. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి 32 మంది 61 సెట్లు దాఖలు చేశారు. -
ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 30-04-2024]
రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. -
తనిఖీల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు
[ 30-04-2024]
ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల ప్రత్యేక సాధారణ పరిశీలకుడు శ్రీరామ్ మోహన్ మిశ్రా సూచించారు. -
చెల్లని చెక్కు కేసులో నిందితుడికి జైలు
[ 30-04-2024]
చెల్లని చెక్కు కేసులో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. సీఎస్పురం మండలం అరివేముల గ్రామానికి చెందిన అన్నపురెడ్డి పరమేశ్వరరెడ్డి వెలిగండ్ల మండలం
తాజా వార్తలు (Latest News)
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా