రగడ.. ఇదేం మర్యాద
క్రమశిక్షణకు మారుపేరుగా ప్రభుత్వం చెబుతున్న ట్రిపుల్ఐటీలో పరిస్థితులు అదుపు తప్పాయి.
రౌడీల్లా మారిన విద్యార్థులు
ట్రిపుల్ ఐటీలో డిష్యుం డిష్యుం
క్యాంపస్లో సీనియర్, జూనియర్ల కొట్లాట
ఒంగోలు నగరం, న్యూస్టుడే: క్రమశిక్షణకు మారుపేరుగా ప్రభుత్వం చెబుతున్న ట్రిపుల్ఐటీలో పరిస్థితులు అదుపు తప్పాయి. ఒంగోలు నగరం కర్నూలు రోడ్డు ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. జూనియర్లు, సీనియర్లు పరస్పరం కొట్లాటకు దిగారు. ఈ ఉదంతం అందరినీ నివ్వెరపరిచింది. సీనియర్లకు జూనియర్లు తగిన మర్యాద ఇవ్వడం లేదంటూ మొదలైన రగడ చినికి చినికి గాలి వానగా మారింది. గురువారం అర్ధరాత్రి వసతి గృహాల ప్రాంగణంలో దాడుల వరకు వెళ్లింది. రాత్రి 11.30కు మొదలైన గొడవ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగింది. వసతి గృహం వద్ద ఉన్న కేర్ టేకర్, వాచ్మెన్లు అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి డైరెక్టర్, ఇతర అధికారుల దృష్టికి వెళ్లడంతో సద్దుమణిగింది. ఈ ఘర్షణలో కొందరికి దెబ్బలు తగిలినట్లు సమాచారం. పోలీసుల దృష్టికి వెళ్తే విద్యాసంస్థ పరువు పోతుందని, ఫిర్యాదు చేయకుండా అంతర్గతంగానే చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఉదంతంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ శుక్రవారం చర్చించింది. గొడవకు కారకులైన విద్యార్థులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి వివాదాలకు దిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు చేశారు.
తెలిసినా.. పట్టించుకోని అధికారులు...: ఒంగోలులోని ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలు లేకపోవడంతో అధికారులు రావ్ అండ్ నాయుడు, ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కళాశాల భవనాలను అద్దెకు తీసుకుని తరగతులు, వసతి గృహం నిర్వహిస్తున్నారు. రావు అండ్ నాయుడులో 1,500 మంది, ఎస్ఎస్ఎన్లో 3,000 మంది వరకు ఉన్నారు. 2018 బ్యాచ్ విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాశాక బయటికి వెళ్లిపోతారు. వారికి 2019 బ్యాచ్ విద్యార్థులకు మధ్య కొంతకాలంగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఆ విషయం అధికారుల దృష్టికి వచ్చినా తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడే అదే గ్యాంగ్ వార్ కింద మారి విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది.
కళాశాల ప్రాంగణంలో ఘర్షణ పడుతున్న విద్యార్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు జిల్లాకు అధినేతలు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. -
అప్పుల బాధ తాళలేక యువ రైతు ఆత్మహత్య
[ 03-05-2024]
అప్పుల బాధ తాళలేక యువ రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్నగర్లో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. -
మాదిగలకు ఆది నుంచీ అండగా చంద్రన్న
[ 03-05-2024]
రాష్ట్రంలో జగన్ అనే పాలకుడు పోవాలి, మరోసారి చంద్రబాబు రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ ఆకాంక్షించారు. -
ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించొద్దు
[ 03-05-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచార ఖర్చుల నిర్వహణ విషయంలో నిబంధనలు ఉల్లంఘించరాదని కలెక్టర్ దినేష్కుమార్ స్పష్టంచేశారు. -
తెదేపాలో చేరిన వార్డు వాలంటీర్లు
[ 03-05-2024]
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన అయిదుగురు వాలంటీర్లు గురువారం రాజీనామా చేసి వైకాపాను వీడి తెదేపా చేరారు. -
రైల్వే పనులు త్వరలో పూర్తి
[ 03-05-2024]
దొనకొండ రైల్వేస్టేషన్లో నిలిచిన పనులు త్వరలో పూర్తి చేయాలని రైల్వే గుంటూరు డివిజనల్ మేనేజర్ ఎం.రామకృష్ణ అన్నారు. అమృత్ భారత్ పనులు పరిశీలనలో భాగంగా ఆయన గురువారం దొనకొండ వచ్చారు. -
వైభవంగా స్వామివారి చక్రస్నానం
[ 03-05-2024]
పట్టణంలోని కాప వీధిలో కొలువైన వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం స్వామివారి చక్రస్నానం పూజారులు కనులపండువగా నిర్వహించారు. -
నిర్లక్ష్యంతో ఆటలకు చేటు
[ 03-05-2024]
వైకాపా ప్రభుత్వం క్రీడారంగంపై శీతకన్ను వేసింది. ఫలితంగా యువత, విద్యార్థులకు గల్లీ క్రీడలే దిక్కవుతున్నాయి. చినుకు పడితే చాలు నగరంలోని మినీ స్టేడియం జలమయమవుతోంది. -
కోడిగుడ్ల డబ్బులు మింగేశారు!
[ 03-05-2024]
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కోడిగుడ్లు సరఫరా బిల్లుల చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రతినెలా వారానికి ఒకసారి గుత్తేదారు కోడిగుడ్లు సరఫరా చేస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్