రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు.
వైకాపా పాలనలో ప్రజలకు తప్పని అవస్థలు
వై.పాలెం త్రిపురాంతకం ఆర్అండ్బీ రోడ్డు దుస్థితి
యర్రగొండపాలెం, న్యూస్టుడే: అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. నియోజకవర్గ కేంద్రమైన వై.పాలెం- త్రిపురాంతకం ఆర్అండ్బీ రహదారి గుంతలమయంగా మారింది. రాష్ట్ర రాజధానితోపాటు కీలక ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ రోడ్డే దిక్కు. ఇంతటి రద్దీ ఉండే మార్గం ఛిద్రమై జనాలను గుల్ల చేస్తోంది. డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.30కోట్లు మంజూరై టెండర్లు దక్కించుకున్న గుత్తేదారు సంస్థ నిర్మాణానికి ముందుకు రాలేదు. ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో టెండరు దక్కించుకున్నా పనులు మొదలుపెట్టలేదు. రాష్ట్ర మంత్రి హోదాలో అయిదేళ్లు పనిచేసిన ఆదిమూలపు సురేష్ కనీసం ఈ రోడ్డు వేయించలేకపోయారని జనం ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
- వై.పాలెం- పుల్లలచెరువు అర్అండ్బీ రోడ్డును సైతం డబుల్ రోడ్డు చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి సురేష్ అనంతరం పత్తా లేకుండా పోయారు. ఇచ్చి హామీని నిలబెట్టుకోవడంలో విఫలమై ప్యాచ్ వర్కులు చేయించి చేతులు దులుపుకున్నారు. పుల్లలచెరువు నుంచి ముటుకుల వెళ్లే బీటీ రహదారి గోతులు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ఎలక్షన్ నోటిఫికేషన్కు ముందు ప్యాచ్ వర్కులు మొదలుపెట్టి మమ అనిపిస్తున్నారు.
- ఏఐఐడీ బ్యాంకు నిధులతో తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన 21 బీటీ రోడ్లను పూర్తిచేయకుండా వదిలేశారు. నేటికీ ఆరోడ్లు గోతుల మయమై దర్శనమిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిడ్డనంటివి.. ఏడి‘ఫింఛను’ కుట్ర పన్నితివి
[ 03-05-2024]
వైకాపా ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు సామాజిక పింఛను లబ్ధిదారులతో ఓట్ల రాజకీయానికి తెరలేపింది. వృద్ధులను ముప్పుతిప్పలు పెట్టి.. ప్రతిపక్షంపైకి నెపం నెట్టాలనే ఉద్దేశంతోనే మే నెల నగదును బ్యాంక్లకు జమ చేసింది. -
నేడు జిల్లాకు అధినేతలు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. -
అప్పుల బాధ తాళలేక యువ రైతు ఆత్మహత్య
[ 03-05-2024]
అప్పుల బాధ తాళలేక యువ రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్నగర్లో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. -
మాదిగలకు ఆది నుంచీ అండగా చంద్రన్న
[ 03-05-2024]
రాష్ట్రంలో జగన్ అనే పాలకుడు పోవాలి, మరోసారి చంద్రబాబు రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ ఆకాంక్షించారు. -
ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించొద్దు
[ 03-05-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచార ఖర్చుల నిర్వహణ విషయంలో నిబంధనలు ఉల్లంఘించరాదని కలెక్టర్ దినేష్కుమార్ స్పష్టంచేశారు. -
తెదేపాలో చేరిన వార్డు వాలంటీర్లు
[ 03-05-2024]
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన అయిదుగురు వాలంటీర్లు గురువారం రాజీనామా చేసి వైకాపాను వీడి తెదేపా చేరారు. -
రైల్వే పనులు త్వరలో పూర్తి
[ 03-05-2024]
దొనకొండ రైల్వేస్టేషన్లో నిలిచిన పనులు త్వరలో పూర్తి చేయాలని రైల్వే గుంటూరు డివిజనల్ మేనేజర్ ఎం.రామకృష్ణ అన్నారు. అమృత్ భారత్ పనులు పరిశీలనలో భాగంగా ఆయన గురువారం దొనకొండ వచ్చారు. -
వైభవంగా స్వామివారి చక్రస్నానం
[ 03-05-2024]
పట్టణంలోని కాప వీధిలో కొలువైన వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం స్వామివారి చక్రస్నానం పూజారులు కనులపండువగా నిర్వహించారు. -
నిర్లక్ష్యంతో ఆటలకు చేటు
[ 03-05-2024]
వైకాపా ప్రభుత్వం క్రీడారంగంపై శీతకన్ను వేసింది. ఫలితంగా యువత, విద్యార్థులకు గల్లీ క్రీడలే దిక్కవుతున్నాయి. చినుకు పడితే చాలు నగరంలోని మినీ స్టేడియం జలమయమవుతోంది. -
కోడిగుడ్ల డబ్బులు మింగేశారు!
[ 03-05-2024]
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కోడిగుడ్లు సరఫరా బిల్లుల చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రతినెలా వారానికి ఒకసారి గుత్తేదారు కోడిగుడ్లు సరఫరా చేస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్