వాలంటీర్ల మెడపై వైకాపా కత్తి
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది.
నాడు దిక్కంటూ తాయిలాలు
నేడు రాజీనామాకు బెదిరింపులు
దర్శిలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శివప్రసాద్ రెడ్డికి రాజీనామా లేఖలు అందిస్తున్న కేవీపాలెం వాలంటీర్లు
ఈనాడు, ఒంగోలు
- చీమకుర్తి పురపాలక సంఘంలో 64 మంది వార్డు వాలంటీర్లు సోమవారం తమ రాజీనామా పత్రాలను కమిషనర్కు సమర్పించారు.
- తాళ్లూరులోని రెండు సచివాలయాలకు చెందిన 30 మంది వాలంటీర్లు ఒకేరోజున ఎంపీడీవో రాజీనామా చేస్తున్నట్లు పత్రాలు సమర్పించారు.
- దర్శి నగర పంచాయతీలోని అయిదు సచివాలయాల పరిధిలో 86 మంది వాలంటీర్లు సోమవారం ఒక్కరోజే రాజీనామా చేశారు.
- దొనకొండ మండలంలో చందవరం, పోలేపల్లి, కొచ్చెర్లకోట గ్రామాలకు చెందిన 18 మంది మంగళవారం రాజీనామా లేఖలను అధికారులకు అందజేశారు.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వారితో లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛను అందించి గొప్పగా ప్రచారం చేసుకుంది. వాలంటీర్ల వ్యవస్థ భేష్ అంటూ ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు వారిపై ప్రశంసలు కురిపించారు. సేవారత్న పేరుతో పురస్కారాలు, వాలంటీర్లకు వందనం పేరుతో నగదు ప్రోత్సాహకాలు కూడా అందించారు. కాబోయే నాయకులంటూ కీర్తించారు. ఇటీవల వైకాపా అభ్యర్థులు కూడా వారితో విస్తృత సమావేశాలు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తాయిలాలు అందించి తమకోసం పనిచేయాలంటూ ప్రాధేయపడ్డారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించకూడదనే ఈసీ ఆదేశాలతో ఇప్పుడు పరిస్థితి మారింది. వైకాపా నాయకుల నిజ స్వరూపం బయట పడింది. వాలంటీర్లు రాజీనామా చేసి పార్టీ ప్రచారంలో పాల్గొనాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. తమకు ఉద్యోగాలు అవసరం అని.. చేయమని చెబుతున్నా వినడం లేదు. బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఆయా అధికారులకు లేఖలు అందించగా.. మరికొందరు ఏం చేయాలో పాలుపోని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గనులను దోచిన గజదొంగలు
[ 06-05-2024]
కడుపు కొట్టడమే తప్ప.. కడుపు నింపడం తెలియని జగన్ మోహన్ రెడ్డి విధానాలతో జిల్లాలో లక్షల మందికి ఉపాధి చూపే గ్రానైట్ పరిశ్రమ కుదేలైంది. -
అధికారానికి ఝలక్
[ 06-05-2024]
అనుచిత విధానాలు, కఠిన వైఖరితో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలతో పాటు పోలీసులను గత అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. -
వైకాపా నేతల విధ్వంసం
[ 06-05-2024]
అయిదేళ్లలో పాలకుడి అండతో వైకాపా నేతలు సృష్టించిన ప్రకృతి విధ్వంసం అంతా ఇంతా కాదు.. కనిపించిన కొండను కొల్లగొట్టి..అందుబాటులో ఉన్న ఇసుకను దోచేసి.. అక్కడక్కడా ఉన్న ఎర్రమట్టిని తవ్వేసి.. రూ. కోట్లు దండుకున్నారు. -
వాలంటీర్ల తిరుగుబాటు
[ 06-05-2024]
సర్కారీ సేవలను గడప గడపకూ చేర్చేందుకంటూ వాలంటీర్ల వ్యవస్థను వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చింది. -
వైకాపా నిర్వాకం.. మందు బాబులకూ కష్టకాలం
[ 06-05-2024]
ఎన్నికల వేల వైకాపా అభ్యర్థులు, నేతల నిర్వాకంతో మందుబాబులకు కొత్త కష్టాలొచ్చాయి. -
ఇంటి గుమ్మంలోనే ఓటు
[ 06-05-2024]
ఎనభై అయిదు సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. -
తెదేపా కూటమికి 160 స్థానాలు
[ 06-05-2024]
రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తెదేపా కూటమి 160 ఎమ్మెల్యే స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. -
జోరు మీదున్న సైకిల్
[ 06-05-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో వందలాదిమంది చేరుతుండటంతో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. -
మా ఓట్లు అమ్ముకోం
[ 06-05-2024]
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలంటేనే ప్రలోభాలకు వేదికలుగా మారాయి. -
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుల ఢీ
[ 06-05-2024]
పెద్దదోర్నాల-శ్రీశైలం ఘాట్ రహదారిలోని చింతల సమీపంలో రెండు ఆర్టీసీˆ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం