logo

‘ముఖ్యమంత్రిని విమర్శిస్తే సహించను’

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపైన వ్యక్తిగత విమర్శలకు దిగితే సహించేది లేదని శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్‌ హెచ్చరించారు. టెక్కలిలోని ఆయన ఇంటి వద్ద శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో

Published : 23 Jan 2022 03:52 IST

మాట్లాడుతున్న దువ్వాడ శ్రీనివాస్‌

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపైన వ్యక్తిగత విమర్శలకు దిగితే సహించేది లేదని శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్‌ హెచ్చరించారు. టెక్కలిలోని ఆయన ఇంటి వద్ద శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు సామాజిక మాధ్యమంలో ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రిపై, ఆయన భార్యపై వ్యాఖ్యలు చేశారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తెదేపా నేతలు ఎవరైనా పార్టీపరంగా, అభివృద్ధి పరంగా మాట్లాడాలే తప్ప, ఆడపడుచుల జోలికొస్తే ఊరుకునేది లేదన్నారు. తెదేపా హయాంలో రివ్యూల పేరుతో చంద్రబాబు ఉద్యోగులకు నరకం చూపించారని, ఇప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడతానని అంటున్నారని ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌పైనా విమర్శలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు